VETA NEWS MEDIA

2026-06-18
Offcanvas
Edit Template

Uncategorized

కొత్త వ్యవసాయ మార్కెట్ యార్డుల పాలక మండలిని ప్రకటించిన ప్రభుత్వం వనపర్తి ఖిల్లా ఘణపురం, పెద్దమందడి గోపాల్పేట ఉమ్మడి మండల అన్నదాతల వ్యవసాయ మార్కెట్ యార్డుల సమస్యలు తొలగించేందుకు వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఎమ్మెల్యే గారి అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం ఖిల్లా ఘణపురం, పెద్దమందడి, గోపాల్పేట ఉమ్మడి మండలాలకు మార్కెట్ యార్డులను మంజూరు చేసింది ఈ క్రమంలో శనివారం ఆయా మార్కెట్ యార్డులకు సంబంధించిన పాలకమండలి పేర్లను ప్రకటించింది ప్రభుత్వం పాలక మండలి పేర్లను ప్రకటించిన సందర్భంగా వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి కి రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఖిల్లా ఘణపురం, పెద్దమందడి మండల మార్కెట్ యార్డ్ అధ్యక్షులుగా క్యామ నవనీత W/o క్యామరాజు ఖిల్లా ఘణపురం ని, ఉపాధ్యక్షులుగా కొత్త కాపు వెంకటేశ్వర్ రెడ్డి s /o బాల్ రెడ్డి దొడగుంటపల్లి ని అధికారికంగా ప్రకటించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతన పాలకమండలికి శుభాకాంక్షలు తెలియజేశారు.

Read More »

మొక్కజొన్న రైతులకు లారీలు గన్ని బ్యాగుల కొరత తీర్చాలి: సిపిఐ వనపర్తి వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డులో మొక్కజొన్న రైతులు లారీలు, గన్ని బ్యాగుల కొరత తీర్చాలని సిపిఐ వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కే శ్రీరామ్ డిమాండ్ చేశారు. సోమవారంవనపర్తి మార్కెట్ యార్డును సందర్శించి మొక్కజొన్న వరి రైతుల ఇబ్బందులను తెలుసుకున్నారు. మాట్లాడుతూ.. వనపర్తి మార్కెట్ యార్డులో మొక్కజొన్నలు కొనుగోలు చేయక పేరుకుపోయాయన్నారు. కొన్నింటినితూకం వేసి నెలరోజులైనా లారీలు రాక తరలించలేదని రైతులు వాటి వద్ద రాత్రి పగలు కావలి కాస్తున్నారన్నారు. మార్కెట్లో పెద్ద మొత్తంలో మొక్కజొన్నలు అలాగే ఉన్నాయని గన్ని బ్యాగులు లేక కాంటాలు వేయలేదని,ఖాళీ సంచులు తెస్తే తూకం వేస్తామని అధికారులు చెబుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. ఖాళీ సంచులు కొనాలని గణపురం మండలం అప్పారెడ్డిపల్లి రైతుల నుంచి 1100 ఖాళీ సంచుల కోసం రూ. 33000 వసూలు చేశారన్నారు. వరి వేరుశనగ రైతులకు ఉచితంగా ఖాళీ సంచులు ఇస్తున్నారని మక్కజొన్న రైతుల వద్ద డబ్బులు వసూలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. డబ్బులు వాపస్ ఇవ్వాలని తగినన్ని ఖాళీ సంచులను ఉచితంగా సరఫరా చేయాలన్నారు. మద్దతు ధరరూ.2400 కొంత సరుకు మాత్రమే కొన్నారని, తక్కిన వాటిని రైతులు రూ. 1700లకే ప్రైవేటు వారికి అమ్ముతున్నారని మొత్తం సరుకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే పార్టీ ఆధ్వర్యంలో రైతులను సమీకరించి ధర్నా చేస్తామని హెచ్చరించారు. గణపురం గోపాల్పేట వనపర్తి మండల రైతులు పాల్గొన్నారు.

Read More »

సంసార జీవితం లో ఉంటే సామాన్యుల బాధలు తెలిసేవి : సిపిఐ వనపర్తి ప్రధాని మోదీ సంసార జీవితం గడిపితే బంగారం అవసరం, ధరల పెరుగుదల భారం తెలిసేదని సిపిఐ వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్, ఏఐటీయూసీ ఉపాధ్యక్షుడు శ్రీరామ్ అన్నారు. సోమవారం గోపాల్పేట బస్టాండ్ లో పెట్రోల్ డీజిల్ ధరలు లీటర్కు రూ.3.50కు పెంపు, వాణిజ్య సిలిండర్ ధర రూ. 993 కు పెంచటానికి వ్యతిరేకంగా ధర్నా చేసి నిరసన తెలిపారు. సిపిఐ నేతలు, ఆటోల డ్రైవర్లు ఆటోకు తాళ్లు కట్టి కొంత దూరం లాగుతూ డీజిల్ కొనలేక భవిష్యత్తులో ఆటోలను తాళ్లతో లాగాల్సిందేనని సంకేతాలు ఇచ్చారు. మాట్లాడుతూ.. బంగారం కొనొద్దని, పెట్రోల్ డీజిల్ వాడకల్లో పొదుపు పాటించాలని ప్రధాని ప్రజలకు సలహాలు ఇస్తున్నారని, సంసార జీవితం గడిపితే బంగారు అవసరం, సామాన్యులకు పెట్రోల్ డీజిల్ అవసరం ఎంతో తెలిసేదని ఎద్దేవా చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా ఎన్నికల్లో లబ్ధికి ప్రపంచంలో డీజిల్ పెట్రోల్ ధరలు ఎక్కడ పెరిగిన భారతదేశంలో పెంచమని హామీ ఇచ్చారన్నారు. ఎన్నికలు ముగియగానే పెట్రోల్ డీజిల్ ధర పెంచి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. దీనివల్ల రవాణా చార్జీలు పెరిగి నిత్యవసర వస్తువుల ధరలు అమాంతం పెరుగుతాయని సామాన్యుడు కొనలేని దుర్భర స్థితి ఏర్పడుతుందన్నారు. పెట్రోల్ డీజిల్ పై సంకాలను తగ్గిస్తే వాడి ధరలు పెంచాల్సిన అవసరమే లేదని సుంకాలను తగ్గించి పెంచిన ధరలను ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. రష్యా భారతదేశానికి తక్కువ ధరకు సమరును సరఫరా చేస్తామని చెబుతున్న ట్రంప్ కు భయపడి కొనకుండా ధరలు పెంచి పేదలపై భారం వేసారన్నారు. మళ్లీ వారం రోజుల్లో పెట్రోల్ లీటర్ పై మరోరూ. 10 పెంచేందుకు సిద్ధమవుతున్నారని పోరాడి నిలువరించాలన్నారు. అధికారం ఉందా లేకున్నా సిపిఐ పేదల పక్షాన పోరాడుతుందన్నారు. బిజెపి కేంద్ర ప్రభుత్వం సంపన్నుల కుమ్ముగాచి సామాన్యులపై భారం వేసి కార్మిక కర్షక హక్కులను హరిస్తోందన్నారు. సామాన్యుల సమస్యలను పట్టించుకోకుండా మతం పేరుతో యువత ప్రజలను మభ్యపెట్టి జైశ్రీరామ్ నినాదంతో అధికారంలో కొనసాగేందుకు పాచికలు కదుపుతున్నారని జాగ్రత్తగా ఉండి ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీరామ్, జె. చంద్రయ్య, గోపాల్పేట మండలం కార్యదర్శి మంకలి శాంతన్న, సహాయ కార్యదర్శి కురుమూర్తి,పొలికెపాడు గ్రామ శాఖ కార్యదర్శి బుచ్చన్న నేతలు ఆటో డ్రైవర్లు రాములు బాలకృష్ణ చంద్రశేఖర్ రఘు వెంకటేష్, బండారు వెంకటయ్య మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Read More »

ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సత్వరమే చర్యలు తీసుకోవాలి వనపర్తి ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను అధికారులు సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లాస్థాయి ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఎన్ ఖీమ్య నాయక్, జెడ్పి సీఈవో యాదయ్యతో కలిసి ప్రజల నుంచి అర్జీలు, వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులకు సూచనలు ఇస్తూ, ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులకు ఎప్పటికప్పుడు పరిష్కరించి సమాచారాన్ని సంబంధిత ఫిర్యాదు దారునికి పంపించటమే కాకుండా ఆన్లైన్ లో పెట్టాలని ఆదేశించారు. ఒకవేళ ఫిర్యాదుకు సంబంధించిన అంశం తమ శాఖ పరిధిలో లేనిది అయితే సంబంధిత శాఖకు లేఖ రాస్తూ పంపించాలని తెలియజేశారు. పరిష్కరించలేని అంశం ఏదైనా ఉంటే పై అధికారులకు పంపించడం లేదా ఏ నిబంధన ప్రకారం పరిష్కారం చేయలేమో ఫిర్యాదు దారునికి తెలియజేయాలి తప్ప తమ వద్ద పెండింగ్ లో పెట్టుకోవద్దని సూచించారు. పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి, వెంటనే పరిష్కరించేలా తగు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. సీఎం, జిల్లా మంత్రి ప్రజావాణి నుంచి వచ్చి పెండింగ్ లో ఉన్న అర్జీలను సైతం సత్వరం పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. నేటి ప్రజావాణి కార్యక్రమంలో 40 దరఖాస్తులు వచ్చాయి. కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు

Read More »

డోలాహరణ కార్యక్రమానికి హాజరై ఆశీర్వదించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వనపర్తి వనపర్తి పట్టణం 9వ వార్డుకు చెందిన చీర్ల జయమ్మ – చీర్ల శ్రీనివాసులు సాగర్ గార్ల ఆహ్వానం మేరకు శ్వేత సాగర్ ప్రణయ్ సాగర్ ల డోలాహరణ కార్యక్రమం సోమవారం వారి నివాసానికి వెళ్లి ఆనందోత్సాహాల నడుమ ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి , బిఆర్ఎస్ సభ్యత్వ నమోదు నియోజకవర్గ ఇన్చార్జ్ మెట్టు శ్రీనివాస్ హాజరై కుటుంబ సభ్యులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారులు ఆయురారోగ్యాలతో, విద్యా విజ్ఞానాలతో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వెంట గట్టు యాదవ్, నందిమల్ల అశోక్, గంధం పరంజ్యోతి, గంధం బాల పీరు, నీల స్వామి వెంకట్ సాగర్, ప్రేమ్ నాథ్ రెడ్డి, ఇమ్రాన్, శేఖర్, చిట్యాల రాము, మంద రాము, హలీం, కుమార్, తోట శీను, సిరివాటి శంకర్, ముని కుమార్,చీర్ల శ్రీనివాసులు,బెదడు కుమార్, చీర్లశాంతయ్య,గోవర్ధన్ సాగర్,భగీరథ శ్రీను,సూర్య నారాయణ,రవి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Read More »

యూసుఫ్(గ్రీన్ యార్డ్స్)కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి వనపర్తి బిఆర్ఎస్ మైనార్టీ నాయకులు యూసుఫ్ జన్మదినం సందర్భంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వారి స్వగృహంలో కేక్ కట్ చేసి యూసుఫ్ కు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. యూసుఫ్ గారికి శుభాకాంక్షలు తెలిపిన వారిలో రాష్ట్ర నాయకులు మెట్టు.శ్రీనివాస్,జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్,జోహెబ్హు స్సేన్,సూర్యవంశం.గిరి,నీలస్వామి,వెంకట్ సాగర్,చంద్రశేఖర్,పోతులపల్లి.రాజు,మంద రాము,అలీమ్ తదితరులు ఉన్నారు.

Read More »

క్రీడాకారుల అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుంది వనపర్తి క్రీడల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తూ… క్రీడలు, క్రీడాకారుల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తోందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పేర్కొన్నారు. 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న యూత్ మరియు స్పోర్ట్స్ వారోత్సవాల సందర్భంగా జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం వనపర్తిలో 2కే రన్ ఉత్సాహంగా నిర్వహించారు. ఈ 2కే రన్ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ముఖ్యఅతిథిగా హాజరై అదనపు ఎస్పీ రాజేష్ మీనాతో కలిసి జెండా ఊపి రన్ ప్రారంభించారు. బాలుర జూనియర్ కళాశాల మైదానం నుంచి బస్ డిపో మీదుగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానం వరకు ఈ 2కే రన్‌ సాగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, 99 డేస్ ప్రజా పాలనలో భాగంగా యువజన మరియు క్రీడల వారోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. క్రీడల పట్ల ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తూ, క్రీడల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తోందని అన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో క్రీడలు ఒక భాగంగా మారాలని సూచించారు. శారీరకంగా ఆరోగ్యంగా ఉంటే మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటామని, అందరూ ఫిట్‌నెస్‌ను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం వనపర్తి జిల్లాలో బాక్సింగ్ స్పోర్ట్స్ క్యాంప్‌ను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. యువత క్రీడల్లో రాణించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఏ ఎస్ పి రాజేష్ మీనా మాట్లాడుతూ క్రీడలను అలవాటు చేసుకోవడం వల్ల శారీరకంగా దృఢంగా ఉండడం సాధ్యమవుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఫిట్నెస్ కలిగి ఉండాలని తద్వారా ఆరోగ్యాన్ని సంరక్షించుకోగలమని తెలిపారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న యువజన మరియు క్రీడల వారోత్సవాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా యూత్ మరియు స్పోర్ట్స్ వీక్, టూరిజానికి సంబంధించిన పోస్టర్లను కూడా ఆవిష్కరించారు. యూత్ మరియు స్పోర్ట్స్ వారోత్సవాల్లో భాగంగా ఈ వారం ప్రతిరోజు ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని జిల్లా యువజన మరియు క్రీడల అధికారి తెలిపారు. యువతలో స్కిల్ డెవలప్మెంట్, యూత్ పార్లమెంట్, స్వచ్ఛదనం మరియు పచ్చదనం, వివిధ రంగాల్లో ముందంజలో ఉన్న యువతకు సన్మాన కార్యక్రమాలు వంటివి వారోత్సవాల రోజువారి కార్యక్రమాల్లో భాగంగా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ బాలాజీ నాయక్, అధికారులు, క్రీడాకారులు, విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Read More »

చీకటిలో ఉన్న వారిని వెలుగులోకి తెద్దాం వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రపంచ ఎయిడ్స్ క్యాండిల్ లైట్ డే సాయంత్రం 6 గంటల కు జరిగింది. ఈ సందర్బంగా సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ పాల్గొన్ని మాట్లాడారు. చీకటిలో ఉన్న వారిని వెలుగులోకి తెద్దాం. వారిని ద్యర్యాన్ని కోల్పొనీయవద్దు. వారికి తొడుగా సమాజం నీలబదుద్దాం అన్నారు. AIDS అనేది ఇప్పుడు నియంత్రించగలిగే ఒక ఆరోగ్య పరిస్థితి . బీపీ, చక్కెర వ్యాధి లాగా ఎయిడ్స్ కుడా ఓక ధీర్గ కాల వ్యాధి సరైన మందులు, ART చికిత్సతో మీరు కూడా సాధారణ జీవితం గడపవచ్చు. క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదించండీ. వ్యాధి వచ్చిందని మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు. మీరు కుటుంబానికి, సమాజానికి ఎంతో విలువైనవారు. మీ ప్రేమ, మీ నైపుణ్యం, మీ కలలు అన్నీ ముఖ్యమైనవే అని అన్నారు. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మీ బాధ్యత. పోషకాహారం తీసుకోండి, మందులు వేళకు వేసుకోండి, పరిశుభ్రంగా ఉండండి. మీ నుండి ఇతరులకు వ్యాపించకుండా డాక్టర్ సూచించిన జాగ్రత్తలు తప్పక పాటించండి బాధను గుండెల్లో దాచుకోవద్దు. నమ్మకమైన వ్యక్తులతో, కౌన్సెలర్లతో మాట్లాడండి. మాట పంచుకుంటే భారం తగ్గుతుందిఅని అన్నారు. మీకు నచ్చిన పని చేయండి, చిన్న చిన్న ఆనందాలను ఆస్వాదించండి. వైద్య శాస్త్రం రోజురోజుకూ అభివృద్ధి చెందుతోంది. ఆశను వదలకండి. ప్రతి ఒకరు కుడా ఎయిడ్స్ రోగులను భాదతో చీకటిలో ఉన్న వారిని వెలుగులోకి తీసుకు రావటం ప్రపంచ క్యాండిల్ లైట్ డే లక్ష్యం.కావున్న ఎయిడ్స్ రోగులను గౌరవిద్దాం. ఈ వ్యాధి తాకడం వల్ల, కలిసి తినడం వల్ల, దగ్గడం వల్ల రాదు. అపోహలు వీడండి. వ్యాధిగ్రస్తుల పట్ల ప్రేమతో, దయతో మెలగడం మనందరి బాధ్యత.అన్నారు. ఈ ప్రోగ్రామ్ లోప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నందు 43వ ప్రవతుల ర్యాలీ ప్రదర్శన ప్రోగ్రామ్ ఆఫీసర్ డా. డాక్టర్ వంశీకృష్ణ , సాహితీ కళావేదిక జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పలుస శంకర్ గౌడ్ , సి ఎస్ ఓ రవి రవీందర్ రెడ్డి , డాక్టర్ బండారు శ్రీనివాస్ గారు హోప్ ఎన్ జీవో శేఖర్శి వకుమార్ , గుర్నాథ్ గౌడ్ , శ్రీమతి శివాని, భాగ్య. పద్మ మరియు ట్రాన్స్ జెండర్స్ తేజస్విని, సంయుక్త, భాస్కర్ వైద్య ఉద్యోగులు పాల్గొన్నారు

Read More »

డీసీఎంను తాళ్లతో లాగి సిపిఐ తీవ్ర నిరసన వనపర్తి పానగల్ మండలం మూడు గ్రామాల్లో కేంద్ర బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ వాణిజ్యగ్యాస్ సిలిండర్ ధర పెంపుపై సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా చేసి నిరసన తెలిపారు. కేతేపల్లి లో డీసీఎం వాహనాన్ని తాళ్లతో కట్టి గ్రామపంచాయతీ వద్ద నుంచి కొంత దూరం లాగి డీజిల్ కొనలేక వాహనాలను ఇక తాళ్లతో లాగాల్సిందేనని సంకేతాలు ఇచ్చి నిరసన తెలిపారు. వెంగలాయపల్లి అంబేద్కర్ విగ్రహం వద్ద ఎర్రజెండాలు ధరించి ధరల పెంపుపై నిరసన తెలిపారు. తెల్ల రాళ్లపల్లి బస్టాండ్ వద్ద పెంచిన పెట్రోల్ డీజిల్ వాణిజ్య వంట గ్యాస్ ధరలను తగ్గించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీరామ్, సిపిఐ వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ.. వంద రోజుల్లో ధరలు తగ్గిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను ఏకంగా రూ. 993 కు పెంచిందని దానితో హోటళ్లలో తినుబండారాలపై విపరీతంగా ధరలు పెరిగాయి అన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఉండటంతో డీజిల్ పెట్రోల్ ధరలు పెంచమని ప్రజలను మభ్యపెడుతూ వచ్చిన నరేంద్ర మోడీ ఎన్నికలు ముగియగానే లీటర్ పెట్రోల్ డీజిల్ పై ఏకంగా రూ.3.50 పెంచి ప్రజలను దగా చేశారన్నారు. పెట్రోల్ పై మరో వారం రోజుల్లో రూ. పది పెంచేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. రష్యా చమురును తక్కువ ధరకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరింపులకు భయపడి కొనడం లేదన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, స్విజర్లాండ్ నుంచి నల్లధనం తెచ్చి ప్రతి రైతు ఖాతాలో రూ. 15 లక్షలు వేస్తామని మోసం చేశారన్నారు. నరేంద్ర మోడీ ఏనాడూ కార్మికుల కర్షకుల సమస్యలను పట్టించుకోలేదని సంపన్నులకు ఊడిగం చేస్తున్నారన్నారు. కార్మిక చట్టాలను లేబర్ కోడులు తెచ్చి నిర్వీర్యం చేశారని, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వటం లేదని, పని గంటలు 8 నుంచి 12 కు పెంచారని మోదీ ప్రజా వ్యతిరేక పాలనకు ఇది నిదర్శనం అన్నారు. ప్రజా సమస్యలపై సిపిఐ పోరాడుతుందని బిజెపి ప్రజా సమస్యలను గాలికి వదిలి జైశ్రీరామ్ పేరుతో అధికారంలో కొనసాగుతోందని విమర్శించారు. బంగారం కొనదని, పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించాలని, పొదుపు పాటించాలంటున్నారని, సంసార జీవితం గడిపే వారికి వాటి అవసరం తెలుస్తుందనినరేంద్ర మోడీకి ఎలా తెలుస్తాయని ఎద్దేవా చేశారు. డీజిల్ పెట్రోల్ ధరల పెంపుతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్యుడు బతకలేని పరిస్థితి ఏర్పడుతుందని వెంటనే తగ్గించాలని లేదంటే ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ప్రజానాట్యమండలి జిల్లా ప్రధాన కార్యదర్శి వంక గోపాల్, చందు,సంగనమోని రాముడు తదితరులు ధరల పెంపుకు నిరసన తెలుపుతూ డప్పులు కొట్టుకుంటూ పాడిన పాటలు ప్రజలను ఆకట్టుకున్నాయి. సిపిఐ వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్, సిపిఐ పానగల్ మండల కార్యదర్శి డంగు కుర్మయ్య, వార్డు సభ్యురాలు కురుమమ్మ, మాజీ వార్డు సభ్యుడు కమ్మావుల పెంటయ్య, రామదాసు, చిన్న ముత్యాలు, మంగలి వెంకటయ్య, బుడ్డ బాలస్వామి, హోటల్ రాముడు, సంగనమోని రాముడు, దొడ్ల బీరయ్య, సిపిఐ వెంగలాయిపల్లి గ్రామ కార్యదర్శి మల్లెపు బాలస్వామి, తెల్ల రాళ్లపల్లి మాజీ ఉపసర్పంచ్ కాకం బాలస్వామి, గ్రామ శాఖ కార్యదర్శి సహదేవుడు సీనియర్ నాయకులు ఎర్రగుంట రాముడు, కాకంరాముడు, పరంధాములు, తదితరులు పాల్గొన్నారు.

Read More »

భారతదేశ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని వీఐపీలు ఖర్చులు తగ్గించుకోండి పొదుపు పాటించండి వనపర్తి భూగోళం లో జరుగుతున్న అనేక రకాల పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ప్రధానంగా ఇరాన్ అమెరికా యుద్ధ సమయంలో ఎగుమతి దిగుమతులు కూడా భారతదేశంపై ప్రభావం చూపాయిఇందులో ప్రధానమైనవి చమురు నిలువలు భారతదేశ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని భారతీయులందరూ ముఖ్యంగా విఐపి హోదా ఉన్న పెద్ద వాళ్ళందరూ తమ తమ కాన్వాయువులో ఉండే వాహనాల సంఖ్యను క్రమంగా తగ్గించుకుని ఆయిల్ నిల్వలను కాపాడుకోవాలని, పొదుపు పాటించాలని వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కోళ్ల వెంకటేష్ ,13 వార్డు కౌన్సిలర్ బొడ్డు. పరశు రామ్,11 వార్డు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నంది పేట్ తిరుపతయ్య యాదవ్, మాజీ మార్కెట్ కమిటీ మెంబర్ నడిమింటి శివ శంకర్ కోరారు. అందులో భాగంగా ప్రధానమంత్రి, ఇతర కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ తమ కాన్వాయులను 90 శాతం తగ్గించుకొని ఆర్థిక మాంద్యాన్ని కాపాడుకొనుటకు ప్రాధాన్యత ఇవ్వాలని కోళ్ల కోరారు. కాన్వాయిల్లో డీజిల్, పెట్రోలు వాడకం ఎక్కువ అవుతున్నందున వాహనాల సంఖ్యను తగ్గించుకుంటే చమురు నిలువలు పెరుగుతాయని కోళ్ల వెంకటేష్ చెప్పారు. దేశ భవిష్యత్తు దృష్ట్యా ప్రధాని మోదీ సూచనలు పాటిస్తే బాగుంటుందని, రాజకీయ పార్టీలు వేరైనా సలహాలు సూచనలు అవసరం ఎంతైనా ఉందని కోళ్ళ వెంకటేష్ చెప్పారు. డీజిల్, పెట్రోల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగంలోకి తేవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. ఇందన పొదుపు, విదేశీ మరక ద్రవ్య సంరక్షణ కోసం ప్రతి ఒక్కరు తమ వంతుగా ఆలోచించి స్వీయ నిర్ణయం తీసుకొని దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోళ్ళ వెంకటేష్ కోరారు. భారత ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపును ప్రతి భారతీయుడు రాజకీయ పార్టీలకు అతీతంగా పాటించాలని ఇవి రాజకీయాలు కాదు, దేశ అభివృద్ధి కోసం, దేశ రక్షణ కోసం పాటించాలని కోళ్ళ వెంకటేష్ తెలిపారు

Read More »

Scroll to Top