ఏఐటీయూసీ వనపర్తి జిల్లా ప్రధాన కార్యదర్శిగా Kమోష ఎన్నిక వనపర్తి ఏఐటీయూసీ వనపర్తి జిల్లా 4వ మహాసభలు పెబ్బేరులో (శుక్రవారం) ముగిశాయి. నూతన జిల్లా కమిటీ ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా టి శ్రీహరి ప్రధాన కార్యదర్శిగా kమోష లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఉపాధ్యక్షులుగా రఘు, శ్యాంసుందర్, సహాయ కార్యదర్శిలుగా శ్రీరామ్, గోపాలకృష్ణ, కోశాధికారిగా ఏ భాస్కర్ 15 మందిని కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గం వేదికపై చేతులు కలిపి ఐక్యతను చాటారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజ్, ఉప ప్రధాని కార్యదర్శి ఎం నరసింహ మాట్లాడుతూ.. జిల్లాలో ఏఐటియుసి బలోపేతానికి కృషి చేయాలన్నారు. అసంఘటితరంగా కార్మికులను ఏకం చేసి వారి హక్కుల కోసం పోరాడాలన్నారు. బిజెపి కార్మిక ప్రజాస్వామ్యం వ్యతిరేక విధానాలను, పెట్టుబడి దారి అనుకూల విధానాలను అమలు చేస్తోందని ప్రతిఘటించి పోరాడేందుకు జిల్లాలో కార్మికులను ఏకం చేయటం అవసరమన్నారు.
Uncategorized
మోడీ ప్రభుత్వానికి కార్మికులు శత్రువులు, కార్పొరేట్ శక్తులు మిత్రులు వనపర్తి కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కార్మికులు శత్రువులు కార్మికుల శ్రమను దోచి సంపదను లూఠీ చేసే కార్పొరేట్ శక్తులు మిత్రులుగా మారారని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.బాలరాజ్ తీవ్రంగా ధ్వజమెత్తారు. ఆల్ ఇండియా ట్రేడియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) వనపర్తి జిల్లా నాలుగో మహాసభలు పెబ్బేరు మండల కేంద్రంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందుగా పెబ్బేర్ మార్కెట్ యార్డ్ నుండి సాయిరాం ఫంక్షన్ హాల్ వరకు వందలాదిమంది కార్మికులతో పట్టణంలో భారీ కార్మిక ప్రదర్శనగా నిర్వహించారు. మహాసభల ప్రారంభ సూచికంగా ఏఐటీయూసీ జెండాను ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎస్.బాలరాజ్ ఆవిష్కరించారు. మహాసభలకు ముఖ్య అతిథులుగా హాజరైన ఎస్.బాలరాజు మాట్లాడుతూ:- బ్రిటిష్ కాలం నుండే అనేక పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నిరంకుశంగా కార్మికుల సంక్షేమానికి సమాధి కట్టే విధంగా 29 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడులుగా తీసుకువచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. లేబర్ కోడులు కేవలం కార్పొరేట్ శక్తులు, దోపిడి యాజమాన్యాలకు అనుకూలంగా కార్మికులను కట్టు బానిసలుగా మార్చేందుకు తీసుకువచ్చారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై ఇప్పటికే అనేక పర్యాయాలు సార్వత్రిక సమ్మెలు జరిగాయని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బిజెపి విధానాలను నిరసిస్తున్నామని బయటకు చెబుతున్న అంతర్గతంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్లను రాష్ట్రంలో కూడా దశలవారీగా అమలు చేసేందుకు కుట్రలు చేసిందని అందులో భాగంగానే ఇండస్ట్రియల్ పాలసీలో 12 గంటల పని విధానం తప్పుడు జీవోను రేవంత్ రెడ్డి సర్కార్ దొడ్డిదారిన తీసుకొచ్చిందని ఆరోపించారు. 12 సంవత్సరాలుగా కార్మికులకు కనీస వేతనాలు పెరగలేదని తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం పెంచిన కనీస వేతనాలు కూడ తెలంగాణ రాష్ట్ర కనీస వేతనం బోర్డు సిఫారసులకు విరుద్ధంగా ఉన్నాయని వేతనాల పెంపు పారదర్శకత లేదని ఆరోపించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి యం.నరసింహ, సిపిఐ జిల్లా కార్యదర్శి విజయ రాములు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు శ్రీహరి, జిల్లా ప్రధాన కార్యదర్శి మోష, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీరాములు, జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రెటరీ గోపాలకృష్ణ, ఏఐటీయూసీ జిల్లా నాయకులు గాంధీ, పెద్ద మొగులయ్య,రాములు, శ్యాంసుందర్,భాస్కర్, భరత్,సిపిఐ జిల్లా నేత రమేష్,చిన్న కురుమయ్య, మహిళా సమాఖ్య ఉమ్మడి జిల్లా నేత పి.కళవతమ్మ,కృష్ణవేణి, మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పి.సురేష్, రవీందర్,శ్రీను,నరసింహ, నరేందర్,అంజి,ఇజ్రాయిల్, ప్రజానాట్యమండలి కళాకారులు గోపాల్,చందు వివిధ రంగాల అసంఘటిత రంగాల కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.
గడువులోపే సర్ ప్రక్రియను 100 శాతం పూర్తి చేయాలి వనపర్తి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఓటర్ల సర్వే ప్రక్రియను నియోజకవర్గంలో నూరు శాతం విజయవంతం చేయడానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పిలుపునిచ్చారు. మండల స్థాయి నాయకులు ఈ ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించి, బీఎల్ఏ-2 ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పూర్తి ఉత్సాహంతో పనిచేసేలా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. బుధవారం వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని సర్ ప్రక్రియ పురోగతిని సమీక్షించి పలు కీలక సూచనలు చేశారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయిలో పనిచేసే ప్రతి కార్యకర్తే బలమని అన్నారు పార్టీ కోసం అందరూ ఐక్యతతో, క్రమశిక్షణతో, సమన్వయంతో పనిచేసినప్పుడే విజయాన్ని సాధించగలమని పేర్కొన్నారు. ప్రస్తుతం సర్ ప్రక్రియకు సమయం చాలా తక్కువగా ఉన్నందున మనకు ఉన్న గడువులోనే 100 శాతం నమోదు పూర్తి చేయడం ప్రతి ఒక్కరి లక్ష్యంగా ఉండాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. బీఎల్ఏ-2 ప్రతినిధులు ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లను కలిసి ఎన్యూమరేషన్ ఫారాలను సక్రమంగా నింపించాలని సూచించారు. మండల నాయకులు ప్రత్యేక దృష్టి సారించి, బీఎల్ఏ-2ల పనితీరును ప్రతిరోజూ సమీక్షించాలని, అవసరమైన చోట మార్గనిర్దేశం చేయాలని అన్నారు. ప్రతి గ్రామం, ప్రతి బూత్లో సమన్వయంతో పనిచేస్తే లక్ష్యాన్ని సులభంగా చేరుకోవచ్చని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేన రెడ్డి, అసెంబ్లీ ఇన్చార్జ్ శత్రురావు బుజ్జి, ప్రజాప్రతినిధులు, వివిధ మండలాల అధ్యక్షులు, బీఎల్ఏ-2 ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
డబుల్ బెడ్రూం గృహాల నిర్మాణాలను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి వనపర్తి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటిస్తూ వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ పెబ్బేరు మండలం పాతపల్లి గ్రామంలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూం గృహాల పనులను పరిశీలించి నిర్మాణాల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా నిర్మాణాల ప్రస్తుత స్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 48 గృహాలు స్లాబ్ దశలో ఉండగా, మరో 2 గృహాలు బేస్మెంట్ దశలో ఉన్నట్లు అధికారులు కలెక్టర్కు వివరించారు. పనులు ఎప్పటి వరకి పూర్తవుతాయనే అంశంపై కాంట్రాక్టర్తో మాట్లాడిన కలెక్టర్, నిర్ణీత గడువులోగా అన్ని గృహాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటిస్తూ, పనుల వేగాన్ని మరింత పెంచాలని కాంట్రాక్టర్కు సూచించారు. పనులకు సంబంధించిన బిల్లులు త్వరితగతిన విడుదలయ్యేలా జిల్లా యంత్రాంగం తరఫున అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నిర్మాణాల అమలులో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని కాంట్రాక్టర్కు సూచించిన కలెక్టర్, అధికారులు కూడా పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు పురోగతిని సమీక్షించాలని ఆదేశించారు. ఈ పరిశీలనలో హౌసింగ్ పీడీ విటోభా, సంబంధిత శాఖ అధికారులు, పీ ఆర్ ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
నీట్ విద్యార్థుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలే : సిపిఐ వనపర్తి నీట్ విద్యార్థుల ఆత్మహత్యలు కేంద్ర ప్రభుత్వ హత్యలేనని సిపిఐ వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్ విమర్శించారు. సిపిఐ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు సిపిఐ వనపర్తి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో వనపర్తి అంబేద్కర్ చౌక్ లో నీట్ రద్దు వల్ల కలత చెంది ఆత్మహత్య చేసుకొని అమరులైన 23 మంది విద్యార్థులకు కొవ్వొత్తులతో సాయంత్రం నివాళులర్పించి వారి ఆశయాలను సాధిస్తామని నినాదాలు చేశారు. నీట్ మరో విద్యార్థిని కూడా ఆత్మహత్య చేసుకుందని కేంద్రపాపం ఎందరిని బలి తీసుకుంటుందో తెలియదని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, విద్యార్థి మృతులకు రూ. కోటి పరిహారంఇవ్వాలని, దేశవ్యాప్తంగా ఉద్యమంలో పాల్గొన్న యువకులు విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలన్న డిమాండ్లకు అంగీకరించిన కేంద్రం బీహార్ బెంగాల్ అస్సాం తదితర రాష్ట్రాల్లో విద్యార్థులపైఎఫ్ఐఆర్ నమోదు చేసిఅరెస్టు చేయటం దారుణం అన్నారు. రేపటిలోగాకేసులను ఎత్తేయకపోతే మళ్లీ ఉద్యమిస్తామని సీజెపి అల్టిమేట్ ఇచ్చిందని,ఇచ్చిన హామీలన్నీ చిత్తశుద్ధితో అమలు చేయాలని, విద్యా వ్యవస్థను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కళావతమ్మ, ఐప్సో సమన్వయ కార్యదర్శి శివ సామాజిక కార్యకర్తలు గంధం నాగరాజు, బాలెమియా ఎన్ఎఫ్ఐ డబ్ల్యు జిల్లా అధ్యక్షురాలు కృష్ణవేణి, ఉపాధ్యక్షురాలు జయమ్మ మాట్లాడుతూ.. కేంద్రం నిరుద్యోగ యువకులు విద్యార్థులపై కక్షపూరిత వైఖరిని అనుసరించటం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకపోవడం దారుణం అన్నారు. హామీలను అమలు చేయకుంటే మళ్లీ ఉద్యమం తప్పదని పార్టీ పూర్తిస్థాయిలో మద్దతు ఇచ్చి పోరాడుతుందన్నారు. సిపిఐ నేతలు కళావతమ్మ ,కృష్ణవేణి, జయమ్మ ,గంధం నాగరాజు, చిన్న కుర్మన్న, బాలేమియా, లక్ష్మీనారాయణ, సురేష్ ,మల్లెపు నరసింహ, చందు, మంద సురేష్ శివ వంశి సైదులు తదితరులు పాల్గొన్నారు.
భూ వివాదాల్లో చట్టాన్ని గౌరవించి కోర్టును ఆశ్రయించాలి : జిల్లా ఎస్పీ సునిత రెడ్డి వనపర్తి ప్రజలకు సత్వర, పారదర్శక, న్యాయబద్ధ సేవలు అందించాలనే లక్ష్యంతో జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సునిత రెడ్డి ప్రజల నుంచి నేరుగా 25 ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా భూ వివాదాలు సివిల్ స్వభావం కలిగినవని, వాటికి శాశ్వత పరిష్కారం కోర్టు ద్వారానే సాధ్యమని స్పష్టం చేసిన ఎస్పీ, భూ వివాదాల పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం, బెదిరింపులు, దౌర్జన్యాలు లేదా మోసాలకు పాల్పడితే పోలీసుశాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో పారదర్శకత, నిష్పక్షపాత ధోరణి, వేగవంతమైన స్పందనతో పోలీసుశాఖ ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటుందని జిల్లా ఎస్పీ తెలిపారు. ప్రజల భద్రత, న్యాయం మా ప్రధాన కర్తవ్యమని ప్రజల సమస్యల పరిష్కారంలో పారదర్శకత, వేగం, న్యాయం లక్ష్యంగా పోలీసుశాఖ ప్రజావాణి కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.
శ్రీమన్నారాయణుని దివ్యాశీషులతో ప్రజలంతా సౌభాగ్యంగా సుభిక్షంగా ఉండాలి వనపర్తి తొలి ఏకాదశి పండుగ సందర్భంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కానాయపల్లి కోటిలింగేశ్వర స్వామినీ దర్శించుకొని అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలి ఏకాదశి సందర్భంగా ఆ శ్రీమన్నారాయణుడు ప్రజల జీవితాలలో సుఖసంతోషాలతో,ఆయురారోగ్యాలతో,అష్టాయిశ్వర్యాలతో సౌభాగ్యంగా సుభిక్షంగా ఉండే విధంగా ఆశీర్వదించాలని ఆకాంక్షించారు.
ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులు సిద్ధం కావాలి : రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డా. జిలెల్ల చిన్నారెడ్డి వనపర్తి ఎల్నినో ప్రభావం, తక్కువ వర్షపాతం పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డా. జిలెల్ల చిన్నారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. శనివారం వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం జయన్న తిరుమలాపూర్ గ్రామంలో ఎల్నినో ప్రభావం, పంట మార్పిడి పై నిర్వహించిన రైతు గ్రామసభలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డా. జిలెల్ల చిన్నారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ముఖ్య అతిథులుగా పాల్గొని రైతులకు అవగాహన కల్పించారు. డా. జిలెల్ల చిన్నారెడ్డి మాట్లాడుతూ, వాతావరణ మార్పుల ప్రభావం కారణంగా సంప్రదాయ సాగు విధానాల్లో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. రైతులు కేవలం దిగుబడినే కాకుండా పెట్టుబడి, నీటి లభ్యత, మార్కెట్ అవకాశాలను కూడా దృష్టిలో ఉంచుకుని పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. ఎల్నినో ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి ప్రభుత్వం తీసుకుంటున్న అవగాహన కార్యక్రమాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఒకే పంటపై ఆధారపడకుండా పంట మార్పిడి ద్వారా నష్టాలను తగ్గించుకోవడంతో పాటు స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చని తెలిపారు. వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు ప్రతి గ్రామంలో రైతులకు అవసరమైన సాంకేతిక సూచనలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారని, ఏ సందేహం వచ్చినా అధికారులను సంప్రదించాలని సూచించారు. భూసార పరీక్షలు చేయించుకుని వాటి ఆధారంగా ఎరువులు వినియోగిస్తే సాగు వ్యయం తగ్గి దిగుబడి పెరుగుతుందని వివరించారు.వర్షపు నీటిని ప్రతి గ్రామంలో సంరక్షించుకోవడం భవిష్యత్ తరాలకు కూడా ఉపయోగపడుతుందని, రైతులు ఫార్మ్ పాండ్లు, ఇంకుడు గుంటలు, సూక్ష్మ నీటిపారుదల పద్ధతులను విస్తృతంగా వినియోగించాలని పిలుపునిచ్చారు. ప్రకృతి పరిస్థితులకు అనుగుణంగా శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తే ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా విజయవంతంగా ఎదుర్కోవచ్చని ఆయన అన్నారు. ఎల్నినో ప్రభావం వల్ల వర్షపాతం తగ్గే అవకాశాలు ఉన్నందున రైతులు వరి కాకుండా కందులు, పప్పుధాన్యాలు, కూరగాయలు, ఇతర ఉద్యాన పంటల సాగుపై దృష్టి పెట్టాలని సూచించారు. వ్యవసాయం, ఉద్యాన శాఖ అధికారుల సలహాలు తీసుకొని శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేయాలని, అధికారులు ఎల్లప్పుడూ రైతులకు అందుబాటులో ఉంటారని తెలిపారు. నీటి వృథాను నివారించి ప్రతి నీటి చుక్కను పొదుపుగా వినియోగించాలని, విద్యుత్ వినియోగంలో కూడా పొదుపు పాటించాలని సూచించారు. పంట పండించడంలో రైతులు ఎరువుల వినియోగాన్ని కూడా తగ్గించాలని, అధికంగా ఎరువుల వినియోగం వల్ల భవిష్యత్తులో భూముల సారం పై ప్రభావం పడే అవకాశం ఉందని సూచించారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటడం బాధ్యతగా తీసుకోవాలని మొక్కలు నాటడం వల్ల పర్యావరణం సమతుల్యత పెరిగి వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని తెలియజేశారు. జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ, రాష్ట్ర ఎల్నినో కమిటీ ఛైర్మన్గా డా. జిలెల్ల చిన్నారెడ్డి ఎంపిక కావడం జిల్లాకు ఎంతో గొప్ప విషయమని అన్నారు. జిల్లాలో ఈ సారి సుమారు 34 శాతం మేర కరవు పరిస్థితులు ఉన్నాయని, సంబంధిత మండలంలో అది 40 శాతం వరకు నమోదైందని తెలిపారు. ఈ ఏడాది వర్షపాతం ఆశించిన స్థాయిలో లేకపోవడంతో వర్షాధార సాగు చేసే రైతులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జయన్న తిరుమలాపూర్ గ్రామంలో సుమారు 3 వేల ఎకరాల్లో సాగు జరుగుతుండగా, అందులో 700 ఎకరాలు పూర్తిగా వర్షాధారంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వరి వంటి అధిక నీటి అవసరమున్న పంటల కంటే తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవడం రైతులకు ప్రయోజనకరమని సూచించారు. రాబోయే పరిస్థితులను ముందుగానే అంచనా వేసుకుని పంటల ప్రణాళిక రూపొందించుకోవాలని, సందేహాలుంటే వ్యవసాయ అధికారులను సంప్రదించి వారి సూచనల మేరకు సాగు చేపట్టాలని రైతులకు పిలుపునిచ్చారు. జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు, మండల ప్రత్యేక అధికారి, డివైస్ ఓ సుధీర్ రెడ్డి, మండల స్థాయి అధికారులు, స్థానిక గ్రామ సర్పంచ్ గోపాల్, నాయకులు యాదయ్య, ఇతర అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
ఏఐవైఎఫ్ వనపర్తి జిల్లా నూతన జిల్లా సమితి ఎన్నిక వనపర్తి ఏఐవైఎఫ్ జిల్లా మూడవ మహాసభలో నూతన జిల్లా అధ్యక్షులుగా మహేష్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎం.డి. కుతుబ్, జిల్లా ఉపాధ్యక్షులుగా విష్ణు, పరమేష్,జిల్లా సహాయ కార్యదర్శులుగా సంతోష్,యం.డి మహమూద్,జిల్లా కోశాధికారిగా ప్రసాద్,జిల్లా కౌన్సిల్ సభ్యులుగా వెంకటేష్, అశోక్,మోహన్, శ్రీకాంత్, బాలకృష్ణ,మురళి, భాను ప్రకాష్, రాజేష్, వెంకటేష్, రామాంజనేయులు, రాము రాములను ఏకగ్రీవంగా ఎన్నుకోగా ఏఐఎస్ఎఫ్ సంఘం నుంచి వంశీ నరేష్ శాశ్వత సమితి సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
భారత దేశం సమస్త రంగాల సంక్షోభానికి నైతిక బాధ్యత వహిస్తూ…మోడీ సర్కార్ గద్దె దిగాలి : సిపిఐ జిల్లా కార్యదర్శి కే.విజయ రాములు వనపర్తి సకల సంపదలు గల భారతదేశం నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న నయా ఉదారవాద ఆర్థిక విధానాలతో దేశంలోని సమస్త రంగాలు దివాలా తీస్తూ తీవ్రమైన సంక్షోభంలోకి వెళుతుందని సంక్షోభాలకు, ప్రజా తిరుగుబాట్లకు నైతిక బాధ్యత వహిస్తూ తక్షణమే మోడీ సర్కార్ గద్దె దిగాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కే. విజయరాములు డిమాండ్ చేశారు. వనపర్తి జిల్లా కేంద్రంలో రెండు రోజులగా జరుగుతున్న అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) మహాసభలు నూతన జిల్లా కౌన్సిల్ ఎన్నిక, పలు తీర్మానాలతో ఘనంగా ముగిశాయి.ముగింపు మహాసభలో కె. విజయరాములు మాట్లాడుతూ:- విద్యా వైద్యం ఉపాధి అవకాశాలు అందరిని ద్రాక్షగా మారిపోయాయని ముందు చూపులేని పాలకుల యువజన విధానంతో యువత శక్తి యుక్తులు నిర్వీర్యమైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఏట రెండు కోట్ల ఉద్యోగాలని హామీ ఎక్కడని నిలదీశారు. పరీక్ష పేపర్ల లీకేజీ సంఘటనపై దేశ విద్యార్థి యువత చేస్తున్న సమరశీల పోరాటం నేటి ప్రజా ఉద్యమాలకు ఎంతో ఆదర్శప్రాయం అని అన్నారు. సమాజ మార్పుపై భగత్ సింగ్ నుండి మొదలుకొని నేటి వరకు విద్యార్థి యువత లేని ఏ పోరాటం విజయం సాధించలేదని అన్నారు. యువత రాజకీయాల్లోకి రావాలని అప్పుడే దేశ రాజకీయ వ్యవస్థ లక్ష్యాలను జరగడం సాధ్యమని పిలుపునిచ్చారు. అనంతరం నూతన వనపర్తి జిల్లాలో పరిశ్రమల నెలకొల్పి స్థానికులకు 80 శాతం యువతకు ఉపాధి కల్పించాలని, స్వయం ఉపాధి రుణాలు ఇలాంటి బ్యాంక్ ఈశ్వర్ రెడ్డి లేకుండా అర్హులైన వారందరికీ ఇవ్వాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన జాబ్ క్యాలెండర్ వెంటనే ప్రకటించాలని, ప్రభుత్వ శాఖల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని తదితర తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బిజ్జ.శ్రీనివాస్, మాజీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పి.సురేష్, ఏఐవైఎఫ్ జిల్లా నేత జీ. రమేష్, ఏఐటీయూసీ జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రెటరీ గోపాలకృష్ణ, ఏఐఎస్ఎఫ్ జిల్లా నేత వంశీ, ఏఐవైఎఫ్ వివిధ మండలాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.