ప్రజాసేవే మా లక్ష్యం ప్రజావాణిలో ప్రజలతో నేరుగా సంభాషించిన : జిల్లా అదనపు ఎస్పీ రాజేష్ మీనా
వనపర్తి
ప్రతి సోమవారం రోజు వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయములో నిర్వహించే ప్రజావాణిలో భాగంగా జిల్లాలో సోమవారం వివిధ ప్రాంతాల నుండి 25మంది పిర్యాదుదారులు వివిధ సమస్యలపై నేరుగా జిల్లా అదనపు ఎస్పీ రాజేష్ మీనా కి ఫిర్యాదులు అందించారు. ఫిర్యాదు చేసిన ప్రతి ఫిర్యాదుపై వనపర్తి అదనపు ఎస్పీ స్పందించి స్వయంగా ఫిర్యాదును పరిశీలించి సంబంధిత పోలీస్టేషన్ అధికారులకు తక్షణమే సదరు ఫిర్యాదులపై చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని అదేశాలు జారీ చేశారు. దీనితో ఫిర్యాదుదారులకు న్యాయం జరుగుతుందనే బరోసాను కలిగించే విధంగా జిల్లా అదనపు ఎస్పీ గారు చర్యలు తీసుకోవడంపై వచ్చిన ఫిర్యాదుదారులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. సోమవారం ప్రజావాణిలో మొత్తం 25 ఫిర్యాదుల్లో 18- భూతగాదాల ఫిర్యాదులు, 05 భార్యభర్తల పిర్యాదులు 02 – పరస్పర గొడవలకు సంబంధించిన ఫిర్యాదులు వున్నాయి.
