VETA NEWS MEDIA

2026-06-18
Offcanvas
Edit Template

Uncategorized

సామూహిక కార్మికుల పండగలలో పాలుపంచుకుంటే ఆత్మసంతృప్తి మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి వనపర్తి పట్టణ తోపుడు బండ్ల సంఘం ప్రతి ఏటా నిర్వహించే “కోట మైసమ్మ పండుగకు”అనవాయితీ ప్రకారం మాజీ ఎంపి రావుల చంద్రశేఖర్ రెడ్డి 10వేల ఆర్థిక సహకారం జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ ద్వారా అందజేశారు. రావుల.చంద్రశేఖర్ రెడ్డి కార్మికులతో ఫోన్ లో మాట్లాడుతూ గ్రామ దేవతల్ని ప్రతి సంవత్సరం ఆరాధించడం వల్ల కార్మిక కుటుంబాలతో పాటు పట్టణ ప్రజలు సుభిక్షంగా ఉంటారని అభిప్రాయపడ్డారు. ఈ పండుగలు కార్మికుల మధ్య ఐక్యత,స్నేహభావం పెరుగుతాయని అన్నారు. ఈ కార్యక్రమములో తోపుడు బండ్ల సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నాగశేషన్న,రాఘవేంద్ర మరియు రాములు,మల్లయ్య కార్మికులు ఉన్నారు

Read More »

ప్రత్యేక ఓటరు జాబితా సవరణ(ఎస్ ఐ ఆర్) కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలి వనపర్తి రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్దేశిత ప్రణాళికా ప్రకారం ప్రత్యేక ఓటరు జాబితా సవరణ(ఎస్ ఐ ఆర్) కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్ ఆదేశించారు. జూన్ నెలలో ప్రారంభం కానున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై జిల్లా కలెక్టర్లతో తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి సూర్యప్రకాష్, ఆర్డీవో సుబ్రహ్మణ్యంతో కలిసి వీసిలో పాల్గోన్నారు. సీఈఓ మాట్లాడుతూ తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియను చేపడుతూ భారత ఎన్నికల కమిషన్ కీలక షెడ్యూల్‌ను విడుదల చేసిందన్నారు. ఈ షెడ్యూల్ ప్రకారం, 2026 జూన్ 15 నుండి 24 వరకు బీ ఎల్ వో లకు, సంబంధిత సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. అనంతరం, జూన్ 25 నుండి జూలై 24 వరకు నెల రోజుల పాటు క్షేత్రస్థాయిలో బీ ఎల్ వో లు ఇంటింటి సర్వే నిర్వహించి వివరాలను సేకరించడం జరుగుతుందన్నారు. సర్వే అనంతరం, జూలై 31న ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేయడం జరుగుతుందన్నారు. ఈ జాబితాపై ఏవైనా అభ్యంతరాలు లేదా సవరణలు ఉంటే ఆగస్టు 30 వరకు స్వీకరించడం జరుగుతుందని, అభ్యంతరాల్ని సెప్టెంబర్ 28 వరకు పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. అన్ని అభ్యంతరాలను పరిశీలించి, పరిష్కరించిన తర్వాత, చివరగా అక్టోబర్ 1న తుది ఓటర్ల జాబితాను (Final Voter List) అధికారికంగా విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ షెడ్యూల్ ప్రకారం ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం నిర్వహణ విజయవంతం చేయాలన్నారు. జూన్ నెలలో ప్రారంభం కానున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నేపథ్యంలో ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేసి పూర్తిచేయాలని ఆదేశించారు. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ షెడ్యూల్ తెలియజేయాలనీ సూచించారు. అదేవిధంగా, రాజకీయ పార్టీలు బిఎల్ఎ లను నియామకం చేసుకొని వారి జాబితా సమర్పించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా, పెండింగ్ లో ఉన్న ఫారం 6, 7, 8 అప్లికేషన్లను త్వరితగతిన పరిష్కారం చేయాలని ఆదేశించారు. వీసీ అనంతరం జిల్లా అధికారులతో అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్దేశిత ప్రణాళికా ప్రకారం ప్రత్యేక ఓటరు జాబితా సవరణ(ఎస్ ఐ ఆర్) కార్యక్రమాన్ని నిర్వహించి, విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ(ఎస్ ఐ ఆర్)కు సంబంధించి ఎన్నికల సంఘం వెలువరించిన షెడ్యూల్ ను ప్రజలందరికి తెలియజేయాలన్నారు. ఇక ఎస్ ఐ ఆర్ లో భాగంగా నిర్వహిస్తున్న మాపింగ్ ప్రక్రియ వనపర్తి లో 79.81 శాతం పూర్తి అయిందని, ఇంకా వేగవంతం చేసి మాపింగ్ పూర్తి చేయాలన్నారు. ప్రజలు కూడా ఈ కార్యక్రమానికి పూర్తి సహకారం అందించి తమ ఓటరు వివరాలను సరిచేసుకోవాలని, అవసరమైన పత్రాలను అందుబాటులో ఉంచాలని అదనపు కలెక్టర్ కోరారు. సమావేశం లో సి సెక్షన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, డి సెక్షన్ సూపరింటెండెంట్ మదన్, జిల్లా ఎన్నికల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Read More »

ప్రజా పోరాటాలకు ఊపిరులూదిన ప్రజానాట్యమండలి : శ్రీనివాసులు వనపర్తి దేశ స్వాతంత్రం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమాలకు ప్రజా పోరాటాలకు ప్రజలను చైతన్యం చేసి ముందుకు నడిపించిన ఘన చరిత్ర ప్రజానాట్యమండలి సొంతమని తెలంగాణ ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్రం సిపిఐ ఆఫీస్ వద్ద ప్రజానాట్యమండలి 4వ జిల్లా మహాసభ సందర్భంగా పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రజానాట్యం మండలి జిల్లా అధ్యక్షుడు గోపాల అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ.. 1943లో ప్రజానాట్యమండలి ఏర్పడిందని దేశ స్వాతంత్రం కోసం ఆటపాటతో ప్రజల్లో స్వాతంత్ర ఆకాంక్షను రగిలించి, పోరాటాల్లోకి నడిపించిందన్నారు. ‘బాంచన్ నీ కాల్మొత్త దొర’అని పెట్టి చేసి జీవిస్తున్న తెలంగాణ ప్రజల విముక్తికి ఆటపాటతో ప్రజానాట్యమండలి ప్రజలను చైతన్యం చేసి నిజాం పాలనను కూల్చిందన్నారు. ఆనాడు కవులు కళాకారులు ఒక చేత పెన్ను ఒక చేత గన్ను పట్టుకొని పోరాడారన్నారు. తెలంగాణ తొలి దశ మలిదశ ఉద్యమంలో ప్రజానాట్యమండలి కవులు కళాకారులు ఆటపాటలతో ప్రజల్లో చైతన్యం రగించారన్నారు. ధూమ్ దాం పేరుతో ఊరువాడ ప్రతిధ్వనించిందన్నారు. ప్రజల సమస్యలపై జరిగిన పోరాటాల్లోను ప్రజానాట్యమండలి కీలకపాత్ర పోషించింది అన్నారు. ఎర్రజెండా బిడ్డలుగా ప్రజానాట్యమండలిని ప్రజల కోసం బలోపేతం చేసుకోవలసిన అవసరం ఉందన్నారు. జిల్లాలో పార్టీ ఉన్న ప్రతి గ్రామంలో ప్రజానాట్యమండలి కళాకారులను తయారు చేయాలన్నారు. విద్యార్థులు యువతను ఆకర్షించేందుకు కళాశాలల్లో పాఠశాలలను పాటల పోటీలు కవితల పోటీలు పెట్టాలన్నారు. వారికి ప్రజా, విద్యార్థుల సమస్యలను వివరించి శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. వచ్చే ఐదో మహాసభ నాటికి జిల్లా ప్రజానాట్యమండలిని బలోపేతం చేయాలన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి విజయరాములు, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు వంకా గోపాల్, ప్రధాన కార్యదర్శి ఎర్రన్న, సిపిఐ పట్టణ కార్యదర్శి రమేష్, సిపిఐ జిల్లా నాయకులు కళావతమ్మ, విజయుడు, శ్రీరామ్, రవీందర్, జయమ్మ, శ్యాంసుందర్, శిరీష, కుతుబు, వెంకటేష్, చందు, లక్ష్మీనారాయణ, ఇజ్రాయిల్, కుమార్, రూప తదితరులు పాల్గొన్నారు.

Read More »

పెట్రోల్ ధర పెంపు, నీట్ పేపర్ పైసిపిఐ తీవ్ర నిరసన వనపర్తి వనపర్తి అంబేద్కర్ చౌక్ లో సిపిఐ వనపర్తి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పెట్రోల్ ధర పెంపు, నీట్ పేపర్ లీక్ పై నిరసన తెలిపారు. పెట్రోల్ లీటర్కు రూ. మూడు చొప్పున పెంచిన ధరను తగ్గించాలని, నీట్ పేపర్ లీక్ బాధ్యులను కఠినంగా శిక్షించాలని, కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని, నీట్ రద్దు వల్ల నష్టపోయిన ప్రతి విద్యార్థికి NTA నుంచి రూ. లక్ష నష్టపరిహారం ఇప్పించాలని నినాదాలు చేశారు. సిపిఐ వనపర్తి పట్టణ కమిటీ కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ.. చమురు నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, పశ్చిమాసియాలో యుద్ధం ఉన్న ధరలు పెంచబోమని చెబుతూ వచ్చిన కేంద్రం ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగియగానే పెట్రోల్ ధర రూ. మూడు పెంచి ప్రజలను నిలువున మోసం చేసిందన్నారు. ఇప్పటికే వాణిజ్య సిలిండర్ పై ఏకంగా రూ. 993 పెంచడమే గాక వంట గ్యాస్ కూడా సరఫరా లో విఫలమైందన్నారు. అవసరానికి సరిపడా వంట గ్యాస్ ఇవ్వటం లేదన్నారు. ఇప్పుడు పెట్రోల్ ధర రూ. మూడు పెంపుతో నిత్యవసరం వస్తువుల ధరలు పెరిగి సామాన్యునిపై భారం పడుతుందని, ధరలను తగ్గించాలన్నారు. నీట్ పరీక్ష పత్రం లీక్ తో కష్టపడి చదువుకున్న విద్యార్థుల బతుకులు ఆగమయ్యాయి అన్నారు. సామాన్య మధ్యతరగతి ప్రజలు రెక్కలు ముక్కలు చేసుకుని తమ పిల్లలకు రూ. లక్షలు అప్పు తెచ్చి కోచింగ్ ఇప్పించాలని నీట్ రద్దుతో వారిపై మళ్లీ కోచింగ్ భారం పడనుందని, ఎన్టిఏ నుంచి ప్రతి విద్యార్థికి రూ. లక్ష నష్టపరిహారంగా ఇప్పించాలని డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం పరీక్ష ప్రశ్నాపత్రాల లీక్ ప్రభుత్వంగా మారిందన్నారు. నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా నేతలు కళావతమ్మ విజయుడు రవీందర్ గోపాలు లక్ష్మీనారాయణ జయమ్మ శిరీష కృష్ణయ్య చందు వెంకటేష్ ఎర్రన్న శ్యాంసుందర్ వంశీ కుమార్ బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

Read More »

జిల్లాలో ఇండ్ల గణన ప్రక్రియకు ప్రజలు సహకరించాలి : అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) ఖిమ్యా నాయక్ వనపర్తి జిల్లాలో 2027 జనగణనలో భాగంగా మే 11 నుండి ఇంటింటి గణన కార్యక్రమం ప్రారంభమైందని, ఇందుకోసం ఇళ్లకు వచ్చే ఎన్యూమరేటర్లకు ప్రజలు సహకరించి, ఖచ్చితమైన సమాచారాన్ని తెలియజేయాలని అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) ఖిమ్యా నాయక్ నేడొక ప్రకటనలో తెలిపారు. ఈ గణనలో భాగంగా ప్రతి ఇంటి పరిస్థితి, ఇంటి నిర్మాణ స్వభావం, గదుల సంఖ్య, తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు, విద్యుత్, వంట ఇంధనం (LPG, కట్టెలు, విద్యుత్), వాహనాలు, ఇంటర్నెట్ సదుపాయం వంటి వివరాలను సేకరిస్తారని తెలిపారు. అలాగే కుటుంబ సభ్యుల వివరాలు, మొబైల్ ఫోన్లు, టెలివిజన్, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ తదితర గృహోపకరణాల వివరాలను కూడా నమోదు చేయనున్నట్లు చెప్పారు. మొత్తం 33 ప్రశ్నల ద్వారా ఇంటి వివరాలను సేకరించే ఈ ప్రక్రియలో అధికారులు అడిగే ప్రశ్నలకు ప్రజలు సరైన సమాచారం అందించాలని సూచించారు. జనగణనలో భాగంగా ఇళ్లకు వచ్చే ఎన్యూమరేటర్లకు ప్రభుత్వ అధికారిక గుర్తింపు కార్డు ఉంటుందని సూచించారు. జనగణన ద్వారా ప్రభుత్వానికి సమగ్ర సమాచారం అందుబాటులోకి వచ్చి, భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలు రూపొందించేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు.జిల్లా ప్రజలందరూ సహకరించి గణన ప్రక్రియను విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ విజ్ఞప్తి చేశారు.

Read More »

తెలంగాణలోనే టాప్ 10 మార్కులు సాధించిన పేద మైనార్టీ విద్యార్థిని సన్మానించిన ఐక్యవేదిక అధ్యక్షుడు డా” సతీష్ యాదవ్ వనపర్తి శుక్రవారం ఉదయం మొహమ్మద్ ఇంటికి వెళ్లి వారి కూతురు , జీనత్ 10 వ తరగతి లో 585 మార్కులతో తెలంగాణలో టాప్ టెన్ మార్కులు సాధించినందున వారికి శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు. వనపర్తికి సంబంధించి ఒక పేద కుటుంబానికి చెందిన విద్యార్థిని తెలంగాణ టాప్ లో నిలబడడం వనపర్తికి గర్వకారణమని తెలుపుతూ, చాలామంది ఇలాంటి విద్యార్థులు మార్కులు తెచ్చుకుని వనపర్తికి విద్యాపర్తి అనే పేరును సార్ధకర్థం చేస్తున్నారని మాకు ఇలాంటి విద్యార్థినీ విద్యార్థుల వివరాలు ఇస్తే అందరికీ సన్మానం చేస్తామని ఈ సందర్భంగా సతీష్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారు.

Read More »

మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడిగా గోపాల్ ఏకగ్రీవ ఎన్నిక వనపర్తి పెద్దమందడి మండలం దొడగుంటపల్లి మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడిగా జంగం గోపాల్ s/o చెన్నప్ప, ఉపాధ్యక్షుడిగా బూసని శ్రీకాంత్ s/o ఆంజనేయులు , కార్యదర్శిగా k కృష్ణయ్య S/O బాలయ్య, కోశాధికారిగా నందమోని వెంకటయ్య s/o కరెన్నలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా సహకార సంఘం ఎన్నికల అధికారి కవిత ఆధ్వర్యంలో శుక్రవారం దొడగుంటపల్లి గ్రామంలోని మత్స్య పారిశ్రామిక సహకార సంఘ భవనంలో ఎన్నికలు నిర్వహించారు. అనంత ఏకగ్రీవంగా ఎన్నికైన అధ్యక్షుడికి నియామక పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో సహకార సంఘం సభ్యులు నాగన్న, నందమోని తిరుపతయ్య, జంగం పెద్ద నాగరాజు, జంగం చిన్న గోపాల్, ఆంజనేయులు, బి ఆంజనేయులు, దండు చిన్న రాములు, దండు చెన్నారాయుడు, దండు పెద్ద కురుమన్న, టైలర్ కురుమయ్య, రాజశేఖర్, తోకల సైదులు, బి శ్రీనివాసులు, బి సైదులు, డి కృష్ణ, జంగం నాగరాజు, జేబి రాములు, సంఘం సభ్యులు మహిళలు యువకులు తదితరులు పాల్గొన్నారు

Read More »

అభివృద్ధి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డిది…ఆర్భాటాలు ఎమ్మెల్యే వి వనపర్తి నియోజకవర్గంలో మాజీ మంత్రి తన మేధస్సుతో అవసరమైన శాశ్వత పథకాలకోసం నిధులు సాధించి పూర్తి చేశారు. ఎంతో ఆర్భాటంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డిప్రారంభించిన డిజిటల్ జిల్లా గ్రంథాలయం మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి సాధించిన విషయం గుర్తెరగాలని వాకిటి.శ్రీధర్ అన్నారు. ఏ లక్ష్యంతో కోట్ల రూపాయలతో నిర్మించిన మార్కెట్ సముదాయాన్ని ఆ లక్ష్యసాధనకు అసమర్థత ఈనాటి ఎం.ఎల్.ఏ గారిది అని వాకిటి విమర్శించారు. ఎం.ఎల్.ఏ ఎన్నికైన నాటి నుండి నేటి వరకు ఒక్క కొత్త అభివృద్ధి పథకం తీసుకురాలేదు కానీ పత్రికా ప్రకటనలలో మాత్రం వేల కోట్ల అంకెల గారడి చేసి ప్రజలను మభ్యపెట్టాలని చేస్తున్నారని దుయ్యబట్టారు. 90శాతం పూర్తి అయిన రోడ్ల విస్తరణ మిగిలిన 10శాతం పనులు పూర్తి చేయాలని అసమర్థత నేటి పాలకులది అని దుయ్యబట్టారు. ఈ ప్రభుత్వంలో సంక్షేమ పథకాల విషయములో అరకొర ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు తప్ప ఒక్క కొత్త సంక్షేమ పథకం అమలు కాలేదని ఇచ్చిన 6 గ్యారంటీలు, 11డిక్లరేషన్లు,420హామీలు గాలికి వదిలేసింది ప్రభుత్వం అని విమర్శించారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి సాధించిన పథకాలకు ప్రారంభోత్సవాలు చేయడం మాని కొత్త పథకాలు తెచ్చి చూపాలని డిమాండ్ చేశారు. రైతులు ధాన్యం కొనుగోళ్లు లేక పడిగాపులు కాస్తూ ఉంటే రైతులను పాటించుకోకుండా మంది మార్భలాన్ని వేసుకొని హంగామా చేసుకుంటూ కాలం గడుపుతున్న ఎం.ఎల్.ఏ గారికి ప్రజలు తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని వాకిటి.శ్రీధర్ హెచ్చరించారు.

Read More »

వనపర్తి చరిత్రను ఎలిగెత్తి చూపే విధంగా జిల్లా గ్రంథాలయాన్ని తీర్చిదిద్దుకుందాం వనపర్తి ఎంతో ఘన కీర్తి కలిగిన వనపర్తి జిల్లా చరిత్రను కళ్లకు కట్టినట్లుగా చూపించేలా జిల్లా గ్రంధాలయాన్ని తీర్చిదిద్దుకుందమని, సాంస్కృతిక పర్యాటక శాఖ మాత్యులు గౌరవ శ్రీ జూపల్లి కృష్ణారావు గారు రూ. రెండు కోట్ల రూపాయలను మంజూరు చేయాలని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి కోరారు. గురువారం వనపర్తి జిల్లా గ్రంథాలయంలో కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన మొదటి అంతస్తును ప్రారంభ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శివసేన రెడ్డి, గార్లతో పాటు ఆయన పాల్గొని మాట్లాడారు కవులు, కళాకారులు, సప్త సముద్రాలు కలిగియుండి వందల సంవత్సరాల ముందే ఎంతో ఘనకీర్తి గలిగిన వనపర్తి చరిత్రను గ్రంథాలయంలో ప్రస్ఫుటీంచే విధంగా తీర్చిదిద్దుకుందామని ఎమ్మెల్యే పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి డిజిటల్ లైబ్రరీని వనపర్తి గ్రంధాలయంలోనే ప్రారంభించుకున్నట్లు ఆయన జ్ఞాపకం చేశారువిద్యాపర్తిగా పేరుందిన వనపర్తి జిల్లాలో పూర్వ విద్య నుంచి ఉన్నత విద్య వరకు విద్యను అభ్యసించేందుకు ప్రభుత్వపరమైన అన్ని విద్యాసంస్థలను వనపర్తిలో ఏర్పాటు చేసుకున్నమని ఎమ్మెల్యే తెలిపారు. సమావేశంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాద్, వనపర్తి మున్సిపల్ చైర్పర్సన్ మాధవి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, గ్రంథాలయ సంస్థ కార్యదర్శి, కౌన్సిలర్లు ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు

Read More »

విద్యారంగంలో దేశంలో నెంబర్-1 రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి వనపర్తి తెలంగాణను విద్యారంగంలో దేశంలో నెంబర్-1 రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు.గురువారం పెబ్బేరు పట్టణంలో మోడల్ అంగన్వాడీ కేంద్రాల ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి లు ముఖ్య అతిథులుగా హాజరై మోడల్ అంగన్వాడీ కేంద్రాలను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. పెబ్బేరు మండలంలో ఏబిడి లిక్కర్ ఫ్యాక్టరీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద రూ. 49 లక్షల నిధులతో మండల పరిధిలో 13 అంగన్వాడీ కేంద్రాలను ఆధునికరించి మోడల్ అంగన్వాడీ కేంద్రాలుగా తీర్చిదిద్దారు. గురువారం ప్రారంభించిన వాటిలో పెబ్బేరు మండల పరిధిలోని కంచిరావుపల్లి మండల పరిషత్ పాఠశాల ఆవరణలో ఉన్న మోడల్ అంగన్వాడీ కేంద్రం, పెబ్బేరు లోని రెండో వార్డులో అంగన్వాడీ కేంద్రం, చెలిమిల్లలో ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఈ సందర్భంగా పెబ్బేరు పట్టణంలోని 2వ వార్డులో ఏర్పాటు చేసిన మోడల్ అంగన్‌వాడీ కేంద్రంలో ఎమ్మెల్యే ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో తెలంగాణను విద్యారంగంలో నెంబర్-1 రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అల్పాహార పథకం త్వరలోనే అమలు చేయనున్నట్లు తెలిపారు. సన్న బియ్యం, మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెంపు వంటి పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా అభివృద్ధి చేసే లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేకంగా పెట్టుబడులు పెడుతోందని పేర్కొన్నారు. ప్రజలు ప్రభుత్వ పాఠశాలలను ప్రోత్సహించాలని కోరారు. అలాగే ఏబిడి కంపెనీ వారు సీఎస్ఆర్ నిధుల కింద రెండు శాతం నిధులను, పెబ్బేరు మండలంలో విద్యారంగం మరియు పాఠశాలల అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. పాఠశాలలకు కాంపౌండ్ వాల్, రవాణా సౌకర్యాలను మెరుగుపరిచే విధంగా వారు చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఏ బీడీ లిక్కర్ కంపెనీ ఆధ్వర్యంలో పెబ్బేరు, శ్రీరంగాపూర్ మండల పరిధిలో 13 అంగన్వాడి కేంద్రాలను మోడల్ అంగన్వాడీ కేంద్రాలుగా తీర్చిదిద్దడం అభినందనీయమని తెలిపారు. ఈ సౌకర్యాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాష్ట్ర క్రీడాపాధికార సంస్థ చైర్మన్ శివసేన రెడ్డి మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రాలను మోడల్ అంగన్వాడీలుగా తీర్చిదిద్దినందుకు ఏబీడీ సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సౌకర్యాలను ప్రజలు సంరక్షించుకోవాలని బాగా వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎబిడి లిక్కర్ కంపెనీ డైరెక్టర్ రాజేష్, కంపెనీ ప్రతినిధులు ఉమాశంకర్, వెంకటేశ్వర్ రెడ్డి, పెబ్బేరు మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్ పర్సన్ సుమిత్ర, జిల్లా సంక్షేమ శాఖ అధికారిని సుధారాణి, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Read More »

Scroll to Top