యువత భవిష్యత్తును దోచుకుంటున్న పాలకులపై ఉద్యమిద్దాం వనపర్తి యువత భవిష్యత్తును దోచుకుంటున్న పాలకులపై ఉద్యమించాలని, బీజేపీ నిరంకుశ విధానాలు దేశానికి ప్రమాదకరమని అఖిల భారత యువజన సమాఖ్య (ఎఐవైఎఫ్) తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర అన్నారు. ఎఐవైఎఫ్ వనపర్తి జిల్లా 3వ మహాసభ వనపర్తి లోని సిపిఐ కార్యాలయం కటికనేని గోపాల్ రావ్ భవన్ లో జిల్లా అధ్యక్షుడు మహేష్ అధ్యక్షతన శుక్రవారం జరిగింది. మహాసభల సూచికగా యువజన సంఘ జెండాను ఎఐవైఎఫ్ మాజీ రాష్ట్ర సహాయ కార్యదర్శి సురేష్ ఎగురవేశారు. ఈ సందర్బంగా ఎఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర. మాట్లాడుతూ వనపర్తి జిల్లా యువత నేడు తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోందన్నారు, నిరుద్యోగం, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో జాప్యం, కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ విధానాలు, పరిశ్రమల కొరత, నైపుణ్యాభివృద్ధి అవకాశాల లేకపోవడం, రైతు కుటుంబాల యువత ఉపాధి కోసం వలస వెళ్లాల్సిన పరిస్థితి, ప్రభుత్వ విద్య,వైద్య రంగాల నిర్లక్ష్యం, గిగ్ వర్కర్ల దోపిడీ వంటి సమస్యలు యువత భవిష్యత్తును చీకటిలోకి నెట్టుతున్నాయన్నారు . ప్రజల పన్నులతో నడవాల్సిన ప్రభుత్వ వ్యవస్థలను నిర్వీర్యం చేసి, కార్పొరేట్ ప్రయోజనాల కోసం యువత జీవితాలతో చెలగాటమాడుతున్న పాలకులను AIYF తీవ్రంగా ఖండిస్తోందన్నారు. జిల్లా అభివృద్ధి అంటే కేవలం ప్రకటనలు కాదని, శాశ్వత ఉద్యోగాలు, పరిశ్రమలు, ప్రభుత్వ విద్యా సంస్థలు, నాణ్యమైన వైద్యం, క్రీడా నైపుణ్య కేంద్రాలు కల్పించడమే నిజమైన అభివృద్ధి అని వారు స్పష్టం చేశారు.దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణలో పారదర్శకత, విద్యార్థులకు న్యాయం, విద్యా వ్యవస్థ పరిరక్షణ కోసం ఢిల్లీలో కొనసాగుతున్న విద్యార్థి–యువజన ఉద్యమాలు దేశ యువత ఆవేదనకు ప్రతీకగా నిలుస్తున్నాయన్నారు. విద్యను హక్కుగా కాకుండా వ్యాపారంగా మార్చే విధానాలు, పరీక్షల నిర్వహణలో లోపాలు, విద్యార్థుల భవిష్యత్తును అనిశ్చితిలోకి నెట్టే పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం వెంటనే బాధ్యత వహించి సమగ్ర సంస్కరణలు చేపట్టాలని AIYF డిమాండ్ చేస్తోందన్నారు. విద్యను కార్పొరేట్ లాభాల సాధనంగా కాకుండా రాజ్యాంగబద్ధమైన హక్కుగా పరిరక్షించాలన్నదే AIYF ఉద్యమాల ప్రధాన లక్ష్యమన్నారు.సీపీఐ వనపర్తి జిల్లా కార్యదర్శి కే. విజయరాములు. మాట్లాడుతూ నేటి యువత కేవలం ఉద్యోగం సాధించడం మాత్రమే కాకుండా, సమాజాన్ని శాస్త్రీయ దృక్పథంతో అర్థం చేసుకునే సైద్ధాంతిక అవగాహన కూడా అత్యంత అవసరమని పేర్కొన్నారు. “శాంతి,అభ్యుదయం, శాస్త్రీయ సోషలిజం” అనే AIYF సిద్ధాంతాన్ని యువతలో విస్తృతంగా తీసుకెళ్లి, ప్రజా సమస్యలపై చైతన్యం పెంపొందిస్తూ ఉద్యమాలను బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. రాష్ట్ర మహాసభలు యువతకు సైద్ధాంతిక దిశానిర్దేశం చేసి, ప్రజా ఉద్యమాలను మరింత శక్తివంతం చేసే వేదికగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు.ఎఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బిజ్జ శ్రీనివాసులు. మాట్లాడతూ దేశంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రైవేటీకరణ, కార్మిక వ్యతిరేక విధానాలు, విద్య–ఉపాధి రంగాలపై పెరుగుతున్న కార్పొరేట్ ఆధిపత్యం యువత ఆశయాలను దెబ్బతీస్తున్నాయన్నారు . మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను వేగంగా అమలు చేయాల్సిన బాధ్యత నుంచి తప్పించుకోకూడదన్నారు. ఈ పరిస్థితుల్లో యువతను ఐక్యం చేసి, విద్య–ఉపాధి–సామాజిక న్యాయం కోసం ఉద్యమాలను మరింత ఉధృతం చేయడం ఎఐవైఎఫ్ తీసుకుందన్నారు. సెప్టెంబర్ 8, 9, 10 తేదీలలో యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగే AIYF తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభలను విజయవంతం చేసి, వనపర్తి నుంచే ప్రజా ఉద్యమాల కొత్త అధ్యాయాన్ని ప్రారంబించాలని వారు ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ మహాసభలో ఎఐవైఎఫ్ వనపర్తి జిల్లా కార్యదర్శి ఎండీ. కూతుబ్, సీపీఐ జిల్లా నేత, ఎఐవైఎఫ్ జిల్లా నిర్మాణ భాద్యులు రమేష్,ఎఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు నరేష్,ఎఐవైఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు విష్ణు, మహబూబ్, పరమేష్, సంతోష్, ప్రసాద్, వెంకటేష్, అశోక్, మోహన్, శ్రీకాంత్, బాలకృష్ణ, మురళి, రాజేష్, భాను ప్రకాష్, వెంకట్ స్వామి, రాము, రామాంజనేయులు లతో పాటు వివిధ మండలాల నుండి కార్యకర్తలు పాల్గొన్నారు.
Uncategorized
జిల్లాలో బాధితులు పోగొట్టుకున్న/చోరికి గురైన (65 లక్షల విలువ గల) 236 మొబైల్ ఫోన్లు బాధితులకు తిరిగి అందజేత జిల్లా ఎస్పీ సునిత రెడ్డి వనపర్తి ప్రజల కష్టార్జిత ఆస్తిని తిరిగి వారికి చేర్చడం పోలీసుల బాధ్యత మాత్రమే కాదు, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే బాధ్యత కూడా. ఆధునిక సాంకేతికతను సమర్థంగా వినియోగిస్తూ సీఈఐఆర్ వ్యవస్థ ద్వారా పోయిన, చోరీకి గురైన మొబైల్ ఫోన్లను గుర్తించి బాధితులకు అందించడం వనపర్తి జిల్లా పోలీసుల సేవాభావానికి నిదర్శనమని జిల్లా ఎస్పీ సునిత రెడ్డి అన్నారు. ప్రస్తుత సమాజంలో మొబైల్ ఫోన్ లేనిదే ఎలాంటి పని జరగని సందర్భంలో మన కు అత్యంత విలువైనది, తక్కువ సమయంలో ఎక్కువ పని చేసే సాంకేతిక పరికరం మొబైల్ ఫోన్. మొబైల్ ఫోన్లో అన్ని వివరాలు, అన్ని జ్ఞాపకాలు, అన్ని లావాదేవీలకు సంబంధించిన అప్లికేషన్లు ఉంటాయి, సాధారణంగా ప్రజలు మొబైల్ ఫోన్లు పోగొట్టుకోవడం, దొంగలించబడటం జరుగుతుంది. తిరిగి వాటిని సంపాదించాలంటే, తిరిగి వాటిని సంపాదించాలంటే, ఈ సందర్భంలో బాధితులు వెంటనే https://www.ceir.gov.in అనే వెబ్సైట్ లో లేదా దగ్గర్లో ఉన్న పోలీస్టేషన్లో సంప్రదించాలని ఎస్పీ గారు తెలియజేశారు. శుక్రవారం రోజున జిల్లా పోలీసు కార్యాలయం సమావేశ భవనంలో మొబైల్ ఫోన్ రికవరీ మేళా ఏర్పాటు చేసి జిల్లాలో ప్రజలు వివిధ బాధితులు దాదాపు మధ్యతరగతి కుటుంబీకులు, బీదవారు వారు ఎంతగానో కష్టపడి కొనుకుని వివిధ రూపాల్లో పోగొట్టుకున్న, దొంగలించబడిన, మొబైల్ ఫోన్లను తిరిగి సంపాదించడం కోసం జిల్లా ఎస్పీ సునిత రెడ్డి ప్రత్యేక చొరవతో వనపర్తి సిసిఎస్ సీఐ, పవార్ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లాలోని కొత్తకోట, వనపర్తి, ఆత్మకూరు, 3సర్కిళ్ళ నుంచి 10మంది అధికారుల సిబ్బందితో కలిసి 3 ప్రత్యేక రికవరీ బృందాలను ఏర్పాటు చేసి నెల రోజుల వ్యవధిలో దాదాపు వివిధ రాష్ట్రాల నుండి జిల్లాలో మొబైల్ ఫోన్లను రికవరీ చేసి పోగొట్టుకున్న, చోరీకి గురైనటువంటి బాధితులకు 236 మొబైల్ ఫోన్లు (దాదాపు 65 లక్షల విలువ చేసే ) వివిధ ప్రాంతాల నుండి తెప్పించి బాధితులకు తిరిగి అందజేశారు, అట్టి మొబైల్ ఫోన్లు, తెలంగాణ -196 (ఫోన్లు), ఆంధ్రప్రదేశ్ -15, కర్ణాటక- 08 , కేరళ-02 , మధ్యప్రదేశ్-06, మహారాష్ట్ర – 09 , రాష్ట్రాల నుండి ఈ మొబైల్స్ ను రికవరీ చేశారు. జిల్లాలో ఈ సంవత్సరం ఇప్పటివరకు 500 మొబైల్ ఫోన్లను బాధితులకు తిరిగి అందజేయడం జరిగింది. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని పోగొట్టుకున్నటువంటి మొబైల్ ఫోన్లను తిరిగి రాబట్టి బాధితులకు అందజేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ హామీ ఇచ్చారు. బాధితులు మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న వెంటనే పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని ఫిర్యాదుకు ఎలాంటి మీసేవ సెంటర్లలో చలాన్లు కట్టవలసిన అవసరం లేదని జిల్లా ఎస్పీ తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో మొబైల్ ఫోన్ ప్రతి ఒక్కరికీ నిత్యవసరమైనది, దీనిని కమ్యూనికేషన్ కోసం, ఆన్లైన్ విద్య కోసం వినియోగిస్తున్నాం, మన యొక్క విలువైన సమాచారం బ్యాంక్ అకౌంట్స్, పాస్ వర్డ్స్, సోషల్ మీడియా అకౌంట్స్, వ్యక్తిగత ఫోటోలు మొదలైన వంటివి ఫోన్ లో నిక్షిప్తం చేసుకుంటున్నాము అన్నారు, మొబైల్ చోరికి గురైనా, పోగొట్టుకున్నా అందులో ఉన్న సమాచారం పోతుంది. నేరగాళ్లు మొబైల్ దొంగిలించి, వీక్ పాస్ వర్డ్స్ లను బ్రేక్ చేసి ఫోన్ పే, గూగుల్ పే తదితర మద్యమాల ద్వారా డబ్బులు కాజేస్తున్నారన్నారు. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తులు కేవలం మొబైల్ ఫోన్ మాత్రమే కాకుండా తమ వ్యక్తిగత సమాచారంతో సహ డబ్బులను కూడా కోల్పోవడం జరుగుతున్నారు. సెల్ ఫోన్ దొంగతనాల నుండి విముక్తి కల్పించడానికై DOT (డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీ-కమ్యూనికేషన్) CEIR పోర్టల్ ను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈపోర్టల్ ద్వారా మంచి ఫలితాలు రాబట్టడం జరుగుతుందని ఎస్పీ గారు వివరించారు. ఒక్కో మొబైల్ రికవరీ చేయడానికి సైబర్ వారియర్స్ పోలీస్, టెక్నికల్ టీం పోలీసు సిబ్బంది చాలా కృషి చేశారు. పోలీసు ప్రజల ఆస్తుల రక్షణలో అనుక్షణం ప్రజల పక్షాన పని చేస్తుంది, తప్పుడు ప్రవర్తన కలిగిన వ్యక్తులకు, నేరాలకు పాల్పడే వారికి ఫ్రెండ్లీ పోలీస్ ఉండదు, సామాన్యుల పట్ల మాత్రమే ఫ్రెండ్లీ పోలీస్ అన్నారు. ఎవరైన మొబైల్ పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన వెంటనే CEIR పోర్టల్ ( https://www.ceir.gov.in ) నందు నమోదుచేసి , సంభందిత పోలీసు స్టేషన్ లో సమాచారం ఇచ్చి మొబైల్ ను బ్లాక్ చేయించాలన్నారు. ప్రజలు, వినియోగదారులు ఎవరైనా సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్ లను కొనుగోలు చేసినట్లైతే అట్టి షాప్ యజమాని నుండి రసీదు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. సెల్ ఫోన్ దొంగలు దొంగిలించిన ఫోన్ లను మొబైల్ షాప్ లలో అమ్ముతున్నారని, తక్కువ ధరకు వస్తుందని దొంగిలించబడిన ఫోన్ అని తెలియక కొనుగోలు చేసి అమాయక ప్రజలు మోసాలకు గురి అవుతున్నారని అన్నారు. ఎవరైన దొంగిలించబడిన ఫోన్ అని తెలిసి కూడా కొనుగోలు చేసినట్లైతే అట్టి వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. పోలీసుశాఖ కృత నిచ్చయంతో పనిచేసి ఈరోజు పెద్దమొత్తంలో ఫోన్స్ రికవరీ చేసి ఇక్కడ భాదితులకు అందించడం జరిగినది జిల్లా ఎస్పీ అన్నారు. పోలీసుశాఖకు ధన్యవాదాలు తెలిపిన మొబైల్స్ పొందిన బాధితులు.. పోయిన మొబైల్ ఫోన్లు మళ్లీ దొరకదనుకున్న బాధితులు జిల్లా పోలీసులు టెక్నాలజీ ఉపయోగించి ఫోన్ రికవరీ చేసి అందించినందుకు సంభందిత బాధితులు జిల్లా ఎస్పీ గారికి, పోలీస్ సిబ్బందికి కృతజ్ఞతలు జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ చోరీ మొబైల్స్ రికవరీలో ప్రతిభ చూపిన సీసీఎస్, పోలీసు మరియు ప్రత్యేక పోలీసు బృందాలు సిసిఎస్ సీఐ, పవార్ అశోక్ కుమార్, ఎస్సై, రామరాజు, ఏఎస్సై, తిరుపతిరెడ్డి, హెడ్ కానిస్టేబుళ్లు: ఎన్.రాజగౌడ్, శ్రీనివాస్ రెడ్డి, కృష్ణయ్య, బాలయ్య, రాఘవేందర్, కానిస్టేబుళ్లు: బెద్దడి స్వామి, మురళి కృష్ణ, సమరసింహారెడ్డి, మురళి, సత్యనారాయణ, భూపాల్ లను ఎస్పీ క్యాష్ రివార్డ్ అందజేసి ప్రత్యేకంగా అబినధించారు.ఈ కార్యక్రమంలో వనపర్తి డిఎస్పీ, గిరిబాబు, వనపర్తి డిసిఆర్భీ డిఎస్పీ, బాలాజీ నాయక్, సిసిఎస్ సీఐ, పవార్ అశోక్ కుమార్, స్పెషల్ బ్రాంచ్ సీఐ, నరేష్, వనపర్తి సీఐ, సుగంధర రత్నం, కొత్తకోట సీఐ, రాంబాబు, ఆత్మకూరు సీఐ, శివకుమార్, వనపర్తి సిసిఎస్ ఏఎస్సై, తిరుపతి రెడ్డి, ప్రత్యేక బృందం పోలీసు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ వసతి గృహల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి : జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి వనపర్తి వనపర్తి పట్టణంలోని బాలుర గిరిజన సంక్షేమ వసతి గృహంలో విద్యార్థులకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేలా ప్రతిరోజూ శుభ్రత చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ రాంనగర్ కాలనీలోని కళాశాల విద్యార్థుల గిరిజన సంక్షేమ హాస్టల్ను జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా హాస్టల్లోని వంటగది, స్టోర్రూమ్ను పరిశీలించి ఆహార పదార్థాల నిల్వ, పరిశుభ్రతను తనిఖీ చేశారు. అనంతరం హాస్టల్ ఆవరణ, డ్రైనేజీ వ్యవస్థ, మరుగుదొడ్లు, ఇతర వసతులను పరిశీలించారు. హాస్టల్లో మొత్తం ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అని ఆరా తీయగా.. 140 మంది సామర్థ్యానికి గాను ప్రస్తుతం 111 మంది విద్యార్థులు ఉన్నారని వార్డెన్ను సమాధానమిచ్చారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేలా హాస్టల్లో ప్రతిరోజూ శుభ్రత చర్యలు చేపట్టాలని వార్డెన్ను ఆదేశించారు. మరుగుదొడ్లు, హాస్టల్ గదులు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. హాస్టల్ సమీపంలోని నాలా చెత్త, పూడికతో ఉండటాన్ని గమనించిన కలెక్టర్ వెంటనే మున్సిపల్ కమిషనర్కు నాలాను శుభ్రం చేయించి డ్రైనేజీ సమస్యను పూర్తిగా పరిష్కరించాలని ఆదేశించారు. హాస్టల్ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవడంతో పాటు నీటి సమస్య కూడా లేకుండా చూడాలని సూచించారు.అనంతరం విద్యార్థులతో కలెక్టర్ ముఖాముఖి మాట్లాడి హాస్టల్లో అందుతున్న వసతులు, భోజన నాణ్యత, తాగునీరు, ఇతర సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా గిరిజన సంక్షేమ అధికారి మధు, మున్సిపల్ కమిషనర్, ఇతర అధికారులు తదితరులు కలెక్టర్ ఉన్నారు.
నిర్లక్ష్యం వీడి “సర్”(ఓటర్ జాబితా సవరణ) వేగవంతం చేయాలి వనపర్తి ఓటర్ జాబితా సవరణ ను రాజకీయ పార్టీలు ఒక బాధ్యత స్వీకరించి “సర్”ప్రక్రియను వేగవంతం చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. అచ్యుతాపురం,రాజానగరం గ్రామాలలో పర్యటించి సర్ ప్రక్రియను పరిశీలించి పలు సూచనలు చేశారు. వనపర్తి పట్టణములో 63,246ఓటర్లను ఆన్ లైన్ చేయాల్సి ఉండగా కేవలం 57శాతం పూర్తి అయ్యిందని అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలో ఓటర్ జాబితా సవరణ ఒక సామాజిక భాధ్యతగా తీసుకొని ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు గ్రామాలలో ఉన్న సమస్యలు తెలుసుకొని ప్రజలకు అండగా ఉండాలని బి.ఆర్.ఎస్ శ్రేణులను,జిల్లా,మండల,గ్రామ స్థాయి నాయకులకు దిశా నిర్దేశం చేస్తూ పరుగులు పెట్టించడంతో నియోజకవర్గంలో” సర్”ప్రక్రియ జోరు అందుకుంటుంది. స్వయంగా సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గ్రామ, గ్రామాల్లో పర్యటనలు చేయడంతో ప్రజల్లో అవగాహన కలిగి ఓటర్ జాబితా సవరణలో పాల్గొనడం హర్షణీయం. లక్ష్యాన్ని పూర్తి చేయడానికి నాయకులు శ్రమించాలని మాజీ మంత్రి పిలుపునిచ్చారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెంట గట్టు యాదవ్ వాకిటి శ్రీధర్ పలుస రమేష్ గౌడ్,కె.మాణిక్యం,విజయ్ కుమార్,ధర్మా నాయక్ ,మాధవ్ రెడ్డి,మహేశ్వర్ రెడ్డి, దేవర్ల.నరసింహ, సుదర్శన్ రెడ్డి,హేమంత్ ముదిరాజ్,శారద ఆశన్న, సర్పంచి బాలయ్య,చిట్యాల.రాము,శంకర్ గౌడ్,క్రాంతి, తదితరులు ఉన్నారు.
ఓటు పరిరక్షణలో బి.ఎల్. ఏలు కీలకంగా వ్యవహరించాలి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వనపర్తి SIR సర్ ప్రక్రియ జరుగుతున్న విధానాన్ని వనపర్తి మండలం అంజని గిరి వెంకటాపూర్ అంకూర్ పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి, దొడగుంటపల్లి, ముందరి తండా, చీకురు చెట్టు తండా, స్కూల్ తండా గట్ల ఖానాపూర్ గోపాల్ పేట్ మండలంలో మున్ననూరు, చెన్నూరు ,తాడిపర్తి , తిరుమలాపూర్ గ్రామాలలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పర్యవేక్షించి బి.ఎల్.ఓ మరియు బి.ఎల్.ఏ ప్రజా ప్రతినిధులకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన ఓటు కాపాడుకునే బాధ్యత మనది అని ప్రతి , ఓటరుకు బిఎల్ఓ లను సంబంధిత అధికారులను బి.ఆర్.ఎస్ పార్టీ బి.ఎల్.ఏలు ప్రత్యక్షంగా కలసి సమాచారం ఇచ్చి సర్ ప్రక్రియలో పాల్గొనే విధంగా అప్రమత్తం చేయాలని అన్నారు. కార్యక్రమంలో వనపర్తి జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, మండల పార్టీ అధ్యక్షుడు మాణిక్యం. రఘు వర్ధన్ రెడ్డి, మాధవరెడ్డి, రవి ప్రకాష్ రెడ్డి డేగ మహేశ్వర్ రెడ్డి, నరేష్ చిట్యాల రాము, పెద్దమందడి మండలం జగదీశ్వర్ రెడ్డి, రఘుపతి రెడ్డి, రవీందర్ రావు, లక్ష్మణ్ గౌడ్ ,శంకర్ నాయక్, రమేష్ హనుమంతు, శ్రీనివాస్ రెడ్డిగోపాల్ పేట్ మండలం తిరుపతయ్య
బాలికల విద్యాభివృద్ధికి అందరూ తోడ్పడాలి – జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి వనపర్తి బాలికల విద్యను ప్రోత్సహించేందుకు స్వచ్ఛంద సంస్థలు వారికి అండగా నిలబడి ఉన్నత చదువులకు తోడ్పాటు నివ్వడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పేర్కొన్నారు.బాలికల విద్యాభివృద్ధి, ఉన్నత విద్యపై వారిలో మరింత ప్రోత్సాహం కల్పించే లక్ష్యంతో విలేజెస్ ఇన్ పార్ట్నర్షిప్ (VIP) గ్రామీణ భాగస్వామ్య సంస్థ వ్యవస్థాపకులు నాగేంద్ర స్వామి ఆధ్వర్యంలో మంగళవారం వనపర్తిలోని దాచా లక్ష్మయ్య ఫంక్షన్ హాల్లో ప్రతిభా పురస్కారాల కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, బాలికల విద్యను ప్రోత్సహించేందుకు స్వచ్ఛంద సంస్థలు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని అన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి విద్యార్థిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థినులు కష్టపడి చదివి తమ లక్ష్యాలను సాధించాలని, సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం విద్యార్థుల అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగుతూ కవిత వంటి విజేతలను స్ఫూర్తిగా తీసుకుని మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థినులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ప్రతి మండలం నుంచి పదో తరగతిలో తెలుగు మాధ్యమంలో అత్యధిక మార్కులు సాధించిన 15 మంది విద్యార్థినులను సత్కరించారు. వారికి ప్రశంసాపత్రాలు, నగదు బహుమతులు, మొక్కలు అందజేశారు. అలాగే ప్రతిభ కనబరిచిన విద్యార్థినుల తల్లిదండ్రులు, సంబంధిత పాఠశాల ఉపాధ్యాయులను కూడా ప్రత్యేకంగా సన్మానించారు. ఈ సందర్భంగా వి ఐ పి స్వచ్ఛంద సంస్థ భాగస్వామ్యంతో ఉన్నత చదివులు చదువుకుని తోటి విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచిన కవిత అనే అమ్మాయి ప్రసంగం అందరిని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య, జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ అధికారి సుధారాణి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ రంజిత్ రెడ్డి, విలేజెస్ ఇన్ పార్ట్నర్షిప్ (VIP) వ్యవస్థాపకులు నాగేంద్ర స్వామి తదితరులు పాల్గొన్నారు.
అక్రమంగా వసూలు చేసిన డబ్బులు రికవరీ చేయాలి వనపర్తి భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్ )సీపీఎం పెబ్బేరు మండల కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం పెబ్బేరు మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం పెబ్బేరు మండల కన్వీనర్ మండ్ల రాజు సిపిఎం మాజీ ఎంపీటీసీ జి బాలయ్య గార్లు మాట్లాడుతూ పెబ్బేరు సంత 2025 జనవరి నుండి 2026 నేటి వరకు మున్సిపల్ నుంచి టెండర్ వేయడం లేదు కానీ కొంతమంది సంత కాంట్రాక్టర్లు పురపాలక సంఘం పేరుతో రసీదులు ముద్రించి మున్సిపాలిటీకి సంబంధం లేకుండానే అక్రమంగా రసీదులు ఇచ్చి డబ్బులు వసూలు చేస్తున్నారు ప్రతివారం 12 లక్షల నుంచి 14 లక్షల వరకు ఆదాయం వస్తుందని ఇప్పటికీ సంత అక్రమంగా వసూలు చేసిన డబ్బులు మున్సిపల్ కు రావలసినది ఐదు కోట్ల 50 లక్షల రూపాయలు వసూలు చేసుకుని అటు మున్సిపాలిటీకి ఎటు ప్రభుత్వానికి కట్టకుండా అక్రమంగా వసూలు చేసుకుని కాంట్రాక్టర్లు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారు ఇప్పటివరకు వసూలు చేసిన డబ్బులను వారిచే రికవరీ చేయాలని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని వారిని కఠినంగా శిక్షించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నాం సంతలో అక్రమంగా వసూలు చేస్తున్న కొందరిపై మున్సిపల్ కమిషనర్ గారు ఫిర్యాదు చేయగా వారిపై కేసులు నమోదైనట్టు కమిషనర్ చెప్పారు అయినా వారిలో మార్పు రాకుండా ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు
యాత్ర విషాద బాధితులకు ఎమ్మెల్యే మేఘా రెడ్డి అండ వనపర్తి తమిళనాడులో ఆధ్యాత్మిక యాత్రలో సోమవారం రోడ్డు ప్రమాదంలో వనపర్తి పట్టణానికి చెందిన చీర్ల శ్యామ్ సాగర్ (స్వామి) మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో గాయపడిన వనపర్తికి చెందిన బాధితులను స్వస్థలానికి తీసుకురావడం, మృతదేహాన్ని వనపర్తికి తరలించడం, బాధిత కుటుంబాలపై పడిన ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి వెంటనే స్పందించారు. బాధితుల రవాణా, చికిత్స, మృతదేహం తరలింపు తదితర అత్యవసర ఖర్చుల కోసం మొత్తం రూ.1.15 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఎమ్మెల్యే, ఇలాంటి క్లిష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయ సహకారాల కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాలు ధైర్యంగా ఉండాలని, తాను ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటానని ఎమ్మెల్యే భరోసా కల్పించారు. ఎమ్మెల్యే మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి అందించిన సహాయానికి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక ప్రజలు కూడా ఎమ్మెల్యే స్పందనను అభినందించారు.
ప్రజాస్వామ్య స్పూర్తిలో ఓటు హక్కు కీలకం వనపర్తి అర్హులైన ఓటర్లు ప్రజాస్వామ్య వ్యవస్థకు స్పూర్తిగా నిలుస్తారు. అర్హులైన ఓటర్ల నమోదు తుది జాబితాలో ఖచ్చితంగా ఉండేవిధంగా కృషి చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు. వనపర్తి మండలంలో పలు గ్రామాలలో సర్ ప్రక్రియ జరుగుతున్న విధానాన్ని పరిశీలించి బి.ఎల్.ఓ,బి.ఎల్. ఏలకు పలు సూచనలు చేశారు. మాజీ మంత్రి వెంట కె.మాణిక్యం,రఘువర్ధన్ రెడ్డి,దేవర్ల.నరసింహ,మాధవ్ రెడ్డి,వివిధ గ్రామాల సర్పంచులు,నాయకులు కార్యకర్తలు ఉన్నారు.
ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యానికి తావులేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలి : జిల్లా ఎస్పీ వనపర్తి ప్రతి సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 17 మంది ఫిర్యాదుదారులు తమ సమస్యలను జిల్లా ఎస్పీ సునిత రెడ్డికి నేరుగా వినిపించారు. ప్రతి ఫిర్యాదును జిల్లా ఎస్పీ స్వయంగా శ్రద్ధగా పరిశీలించి, సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో వెంటనే ఫోన్లో మాట్లాడి, ఫిర్యాదులపై చట్టబద్ధంగా, పారదర్శకంగా , వేగవంతంగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజావాణిలో వచ్చిన ప్రతి ఫిర్యాదును అత్యంత ప్రాధాన్యతతో పరిగణించి, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని అధికారులను స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, “ప్రజల సమస్యలను వినడం మాత్రమే కాకుండా, వాటికి త్వరితగతిన పరిష్కారం చూపడమే ప్రజావాణి నిర్వహణ యొక్క అసలు ఉద్దేశ్యం. ప్రతి ఫిర్యాదును సున్నితంగా పరిశీలించి, బాధితులకు న్యాయం జరిగేలా పోలీసులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. జిల్లా ఎస్పీ తక్షణ స్పందన, సమస్యల పరిష్కారానికి చూపిన చొరవపై ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదుదారులు హర్షం వ్యక్తం చేస్తూ, తమకు న్యాయం జరుగుతుందనే పూర్తి విశ్వాసం కలిగిందని జిల్లా ఎస్పీ తెలిపారు.