శ్రీరంగాపురం మండల కేంద్రంలో కిరాణం & జనరల్ స్టోర్ ప్రారంభించిన మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వనపర్తి శ్రీరంగాపురం మండల కేంద్రంలో తెరాస నాయకుడు జలీలు (మాజీ ఎంపిటిసి) గారి కిరాణం అండ్ జనరల్ స్టోర్ ను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కిరాణం షాపును ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి గారి వెంట ఆర్ .వెంకట్ స్వామి మండల అధ్యక్షులు బిఆర్ఎస్, ఆర్. పృథ్వి రాజు సీనియర్ నాయకులు, గౌడ నాయక్, విజయ్ కుమార్ రెడ్డి సర్పంచ్, సుదర్శన్ రెడ్డి, రాధాకృష్ణ, మహేశ్వర్ రెడ్డి మాజీ వైస్ ఎంపీపీ, పర్వతాలు బక్కయ్య కృష్ణయ్య విష్ణు, కాజా, శివ సాగర్ గుంటి వెంకటేష్ ఎర్ర కృష్ణయ్య రాజు కిరాణం షాప్ ప్రొప్రైటర్ జలీల్ కుటుంబ సభ్యులు మరియు శ్రీరంగాపురం మండల *బిఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
Uncategorized
ఒంటరి అయినా చిన్నారి(భవ్య శ్రీ )కి ఆర్థిక సహాయం వనపర్తి వనపర్తి జిల్లా పెద్దమందడి జిల్లా పరిషత్ పాఠశాల 2005- 2006 బ్యాచ్ పూర్వ విద్యార్థులు తోటి స్నేహితురాలి కూతురికి అండగా నిలిచి ఆర్థిక సహాయాన్ని అందించారు. పెద్దమందడి మండలం దొడగుంటపల్లి గ్రామానికి చెందిన (రేణుక ) పెద్దమందడి మండల ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2005-06 లో పదో తరగతి చదివారు . నెల క్రితం అనారోగ్యంతో అమె మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న తోటి స్నేహితులు ఒంటరి అయిన తన స్నేహితురాలి కూతురి కి తమ వంతు ఏమైనా సహాయం చేయాలని అనుకున్నారు. రేణుక కుటుంబానికి అండగా ఉండాలని నిర్ణయించుకున్న స్నేహితులు, తమతో పాటు చదువుకున్న స్నేహితురాలి కూతురు భవ్య శ్రీ కి స్నేహితులు అందరూ కలిసి జమ చేసుకున్న 50,000/వేల రూపాయలను ఆర్థిక సహకారాన్ని అందించారు.ఈ నగదు మొత్తాని (భవ్య శ్రీ )పేరు మిద బ్యాంకు లో ఫిక్స్ డిపాజిట్ చెయ్యలని నిర్ణంచారు. భవిష్యత్తులో కూడా (రేణుక)కూతురు (భవ్య శ్రీ )చదువుల విషయంలో ఎలాంటి సహకారం కావాలన్నా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చిన్నారిని ధైర్యాన్ని కల్పించారు.ఈ కార్యక్రమంలో 2005-06 బ్యాచ్ స్నేహితులు అందరు పాల్గొన్నారు.
కోట మైసమ్మ దేవత ఆరాధనకు రావుల చేయూత వనపర్తి హమాలీ యూనియన్ (పాత గంజి) కార్మికులు ప్రతి సంవత్సరం ఆనవాయితీగా కోట మైసమ్మ పండుగను ఘనంగా నిర్వహించుకుంటున్నారు. కార్మికుల విజ్ఞప్తి మేరకు మాజీ పార్లమెంటు సభ్యులు రావుల చంద్రశేఖర రెడ్డి పండుగ నిర్వహణకు ఆర్థిక సహాయం అందించి తమ ఉదారతను చాటుకున్నారు. ఈ సందర్భంగా అందించిన నగదును నాయకులు నందిమల్ల అశోక్, మార్క్ఫెడ్ డైరెక్టర్ విజయ్ కుమార్, సయ్యద్ జమీల్ కలిసి హమాలీ యూనియన్ అధ్యక్షుడు బాబుకు అందజేశారు. కార్మికుల సంక్షేమం, సంప్రదాయాల పరిరక్షణ పట్ల రావుల చంద్రశేఖర రెడ్డి గారి సహకారం అభినందనీయమని కార్మికులు హర్షం వ్యక్తం చేశారు.
ప్రతి నెల ఒకటో తేదీని వేతనాలు చెల్లించాలి_మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలి వనపర్తి తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ &వర్కర్స్ యూనియన్( CITU) వనపర్తి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ యూనియన్ జిల్లా అధ్యక్షులు హనీప్ అధ్యక్షతన ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షడు, కార్యదర్శి, ఆర్యన్ రమేష్, మండ్ల రాజు మాట్లాడుతూ,, రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఇచ్చిన మాట ప్రకారం గ్రామపంచాయతీ కార్మికులకు ప్రతి నెల ఒకటో తేదీని జీతాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు,కనీస వేతనం 26,000 ఇవ్వాలి,51 జీవో ను రద్దచేయాలని,మరణించిన కార్మికుల కుటుంబానికి దహన సంస్కారాలకు 30 వేల రూపాయలు ఇవ్వాలని,గ్రామపంచాయతీ నిధుల నుండి పోస్టల్ ఇన్సూరెన్స్ చేయించాలని,కారోబార్ బిల్ కలెక్టర్లకు ప్రత్యేక స్టేటస్ ఇవ్వాలని ,ఆన్లైన్లో లేని కార్మికుల పేర్లు వెంటనే ఆన్లైన్లోచేయాలని ,పెండింగ్ వేతనాలుచెల్లించాలని,కార్మికులందరికీ గుర్తింపు కార్డులు ఈఎస్ఐపిఎఫ్ బీమా సౌకర్యం కల్పించాలని పనిచేస్తున్న ప్రతి గ్రామపంచాయతీ కార్మికునికి శానిటేషన్ వస్తువులు సభ్యులు నూనెలు చెప్పులు దుస్తులు ఇతర సామాగ్రి ఇవ్వాలని,ప్రజా ప్రతినిధుల వేధింపులు అరికట్టాలని ఆక్రమ తొలగింపులను నిలపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే రానున్న కాలంలో కార్మికులను సమీకరించి ప్రభుత్వమేన పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి బొబ్బిలి నిక్సన్, జిల్లా సహాయ కార్యదర్శి సూర్యవంశం రాము, గ్రామపంచాయతీ యూనియన్ జిల్లా అధ్యక్షులు అనీఫ్ జిల్లా ఉపాధ్యక్షులు జి పుష్ప నారాయణ శీను రామచంద్రయ్య చెన్నమ్మ విజయలక్ష్మి ఎల్లయ్య సుగ్రీవుడు పుల్లయ్య రాములు సిఐటియు జిల్లా నాయకులు మధు, తదితరులు పాల్గొన్నారు
వనపర్తి జిల్లాను మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలి వనపర్తి ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా డ్రగ్స్ నిర్మూలన, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాల్య వివాహాల నివారణపై అవగాహన కల్పించేందుకు వనపర్తి జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కొత్తకోట పట్టణంలో 2కే రన్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా ఎస్పీ సునీతా రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కొత్తకోట చౌరస్తా వద్ద జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన అతిథులు, ఏటీఆర్ కన్వెన్షన్ వరకు నిర్వహించిన 2కే రన్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రజలందరితో కలిసి యాంటీ డ్రగ్స్ ప్రతిజ్ఞ చేయించారు. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో రూపొందించిన బాల కార్మిక, బాల్య వివాహాల నిర్మూలన అవగాహన పోస్టర్లను ముఖ్య అతిథులు ఆవిష్కరించారు. ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, డ్రగ్స్ బారిన పడి ఎంతోమంది యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రగ్స్ నియంత్రణ విషయంలో అత్యంత సీరియస్గా ఉన్నారని, ఈగల్ పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. డ్రగ్స్ను అరికట్టడం ప్రభుత్వంతో పాటు సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. డ్రగ్స్కు సంబంధించిన సమాచారం అధికారులకు అందించాలని, సమాచారాన్ని గోప్యంగా ఉంచబడుతుందని హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ, ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం చివరి రోజున డ్రగ్స్ నిర్మూలనపై ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషకరమన్నారు. డ్రగ్స్ అనే మహమ్మారి పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చుట్టుపక్కల అనుమానాస్పద వ్యక్తులు, కార్యకలాపాలపై పర్యవేక్షణ ఉంచి అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. వనపర్తి జిల్లాను పూర్తిగా డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సునీతా రెడ్డి మాట్లాడుతూ, యువత డ్రగ్స్కు దూరంగా ఉండాలని సూచించారు. యువత తెలియకుండానే డ్రగ్స్కు బానిసలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్ సేవించేవారు, లేదా సరఫరా చేసేవారికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే 1908 నంబర్కు ఫోన్ చేసి తెలియజేయాలని, వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యా సంస్థలు, గ్రామాలు, కాలనీల్లో యాంటీ డ్రగ్స్ కమిటీలను ఏర్పాటు చేసి డ్రగ్స్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రాజేష్ మీనా, కొత్తకోట మున్సిపల్ చైర్ పర్సన్ అరుణ శ్రీనివాస్, వైస్ చైర్ పర్సన్ సునీత పల్లవి, మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రశాంత్, పోలీసు శాఖ అధికారులు, కొత్తకోట వాకింగ్ అసోసియేషన్ల సభ్యులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు, యువత మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
పుట్టు చీర కార్యక్రమానికి హాజరై చిన్నారిని అక్షింతలు వేసి ఆశీర్వదించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వనపర్తి కొత్తకోటలోని ఆర్కే గార్డెన్లో శ్రీమతి మాలతి నరసింహ రెడ్డి గార్ల ఆహ్వానం మేరకు నిర్వహించిన పుట్టు చీర కార్యక్రమానికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారికి అక్షింతలు వేసి ఆశీర్వదించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చిన్నారి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, విద్యా విజ్ఞానాలతో ఉన్నత స్థాయికి ఎదిగి కుటుంబానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అనంతరం కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసి ఆత్మీయంగా ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు, నాయకులు, కార్యకర్తలు, ఆహ్వానితులు తదితరులు పాల్గొన్నారు
ఫ్రీ ప్రైమరీ విద్యను అంగన్వాడీల నుండి తొలగించే నిర్ణయాన్ని ఉపసంహరించాలి వనపర్తి తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ & హెల్పర్స్ యూనియన్ సిఐటియు వనపర్తి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు గురువారం సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్యన్ రమేష్ అధ్యక్షతన ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిఐటియు రాష్ట్ర నాయకులు పుట్ట ఆంజనేయులు, మండ్ల రాజు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ,, గతం, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసిన ప్రీ ప్రైమరీ పీఎం శ్రీ కేంద్రాలను తక్షణమే రద్దు చేయాలని, ఈ కేంద్రాలను అంగన్వాడీలకు అప్పగిస్తూ వెంటనే ప్రభుత్వం నిర్ణయం చేయాలని, ఐసిడిఎస్ ను బలోపేతం చేసి, కాంగ్రెస్ ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, ప్రతి నెల ఒకటో తేదీన అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ కు వేతనాలు చెల్లించాలని, 15 వేల కాళీ పోస్టుల నీటిని ఒకేసారి భర్తీ చేయాలని ఈ సమస్య పరిష్కారం కోసం తక్షణమే చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు, కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 18 వేల వేతనం పెంచాలని పీఎఫ్ సౌకర్యం కల్పించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ కు గ్రాడి డ్యూటీ అమలు చేయాలని డిమాండ్ చేశారు, పెండింగ్లో ఉన్న రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలని, ఎలాంటి షరతులు లేకుండా ఆసరా పెన్షన్లు అమలు చేయాలని, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఎన్ ఈ పి 2020 చట్టాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు, కొత్తగా ఇచ్చిన సెల్ ఫోన్స్ పనిచేయట్లేదు, వీటిని వెంటనే వెనక్కి తీసుకోవాలి అన్ని యాప్స్ మరియు సౌకర్యాలతో 5జి నెట్వర్క్ ఫోన్స్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు, అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ కు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్నిటిని అమలు చేయాలని, అంగన్వాడి కేంద్రాలకు పక్కా భవనాలు నిర్మించాలని మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, ప్రీ ప్రైమరీ విద్య రద్దయి ఎంతవరకు సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు ఉదృతంగా చేస్తామని తక్షణమే ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు, అంగన్వాడి ఉద్యోగులపై అధికారుల వేధింపులు ఆపాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి వినతి పత్రం కలెక్టర్ గారికి అందజేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి బొబ్బిలి నిక్సన్ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ రాజు సహాయ కార్యదర్శి సూర్యవంశం రాము యూనియన్ జిల్లా కార్యదర్శి బి కవిత జిల్లా నాయకులు నాగేంద్రమ్మ భాగ్య రమాదేవి కృష్ణవేణి మంజుల మహేశ్వరి విజయ గోవిందమ్మ సుగుణ బాయ్ తదితరులు పాల్గొన్నారు
ఖాళీ ఉద్యోగ పోస్టులపై శ్వేత పత్రం విడుదల చేయాలి వనపర్తి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులపై ప్రభుత్వం తక్షణమే శ్వేత పత్రం విడుదల చేయాలని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎం.డి.కుతుబ్ డిమాండ్ చేశారు.గురువారం అఖిలభారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) ఆధ్వర్యంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి బదులు శాశ్వత నియామకాలు చేపట్టాలని, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వనపర్తి జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించి అనంతరం కలెక్టర్ కార్యాలయ సిబ్బందికి విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎం.డీ.కుతుబ్ మాట్లాడుతూ:-నీళ్లు నిధులు నియామకాల ఆకాంక్షల పునాదులపై పురుడు పోసుకున్న 12 ఏళ్ల తెలంగాణ రాష్ట్రంలో నేటికీ నిరుద్యోగ యువత కలలు నీటి మీద రాతలు వలె మారాయని వాపోయారు. ప్రజాపాలన పేరుతా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వమైన చిత్తశుద్ధితో ఉద్యోగుల భర్తీ ప్రక్రియ యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లేక వారి శక్తి యుక్తులు నిర్వీర్యం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో సహజ సంపద పుష్కలంగా ఉన్న పాలకుల చిత్తశుద్ధి లేని విధానాల ఫలితంగా నూతన పరిశ్రమల ఏర్పాటు ఉద్యోగుల కల్పన నిరుద్యోగ యువత యువకులకు అందని ద్రాక్షగా మారాయని వాపోయారు. కార్పొరేట్ ప్రైవేట్ విద్యాసంస్థల ఆగడాలు అరికట్టాలని ఫీజులో నియంత్రణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు మహేష్ మాట్లాడుతూ:- రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు చేసిన వాగ్దానం ప్రకారం టిఎస్పిఎస్సి శాశ్వత జాబ్ క్యాలెండర్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగ యువత యువకులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయాలకు మాత్రమే వాడుకుంటూ నిరుద్యోగులను దగా చేస్తుందని అన్నారు. ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని శాఖల్లో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని లేనిచో ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు గోపాలకృష్ణ,ఏఐవైఎఫ్ నాయకులు ఎత్తు విష్ణు, ముస్తఫా,వినోద్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
బిజెపి పాలనలో కష్టజీవుల బతుకు అధోగతి: సిపిఐ వనపర్తి బిజెపి 12 ఏళ్ల పాలనలో దేశం పరిస్థితి, కష్టజీవుల బతుకు అధోగతి పాలైందని సిపిఐ జిల్లా కార్యదర్శి విజయరాములు, నియోజకవర్గ కార్యదర్శి రమేష్, ఎన్ఎఫ్ఐ డబ్ల్యు ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షురాలు కళావతమ్మ మండిపడ్డారు. రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు పెరిగిన ధరలకు నిరసనగా వనపర్తి జిల్లా కలెక్టర్ ఆఫీస్ కార్యాలయాన్ని సిపిఐ నేతలు కార్యకర్తలు ముట్టడించారు. ధర్నా చౌక్ నుంచి నేతలు కార్యకర్తలు ఎర్రజెండాలు ఎర్ర షర్టులు ఎర్ర చీరలు ధరించి భారీ ర్యాలీగా కలెక్టర్ ఆఫీస్కు చేరుకున్నారు. ముట్టడి సందర్భంగా నేతలు కార్యకర్తలు గేట్లు తోసుకొని లోపలికి వెళ్లకుండా ప్రధాన గేటు వేసి అడ్డుకున్నారు. కార్యకర్తలు గేటు ముందు బైఠాయించి నిరసన కొనసాగించారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసిన నచ్చజెప్పి తమ ప్రసంగాలను కొనసాగించారు. నరేంద్ర మోడీ 12 ఏళ్ల క్రితం ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, స్విస్ బ్యాంకు నుంచు నల్లధనం తెచ్చి ప్రతి రైతు ఖాతాలో రూ. 15 లక్షలు వేస్తామని, ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. పైగా పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలను భారీగా పెంచాలని ఫలితంగా రవాణా చార్జీలు పెరిగి నిత్యవసర వస్తువుల ధరలు చుక్కలు అంటాయని, సామాన్యుడు నిత్యవసర వస్తువులను కొని తినలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ధరలు తగ్గించాలని విపక్షాలు ప్రజలు గగ్గోలు పెడుతున్న పట్టించుకోవడం లేదని ధరలు తగ్గించే దాకా పోరాటం చేస్తామన్నారు. ధరల పెంపుతో సామాన్యుల కష్టాన్ని దోచి సంపన్నులకు సంపద పెంచుతున్నారని, కార్మిక చట్టాలను కాలరాచారని, వ్యవసాయ నల్ల చట్టాలు తెచ్చి రైతుల కడుపు కొట్టేందుకు పూనుకున్నారని విమర్శించారు. రైతుల ఏడాది పోరాటంతో తోకమడిచి నల్ల చట్టాలను ఉపసంహరించుకున్నారన్నారు. ప్రజల కనీస అవసరాల విషయంలో కూడా ప్రజలు పొదుపు పాటించాలని చెబుతున్న నరేంద్ర మోడీ రోజుకో దేశం తిరుగుతూ ప్రజాసమము దుర్వినియోగం నీళ్లలా ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. దేశ సార్వభౌమత్వానికి చేటు తెచ్చే విధంగా ట్రంప్ కు భయపడుతున్నారు అన్నారు. తక్కువ ధరకు రష్యా చమురు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని కొనవద్దని మోడీకి ట్రంప్ హుకుం జారీ చేస్తున్న బెదిరించలేని అసహయ స్థితిలో మోడీ ఉన్నారన్నారు. దేశభక్తి హిందూ మతం ముసుగులో ఇచ్చిన హామీల నుంచి ప్రజల సమస్యల నుంచి దృష్టి మరలచే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రజలకు కనీస ఓటు హక్కును కూడా సర్ పేరుతో కాలరాసే ప్రయత్నం చేస్తున్నారని ప్రజలు గమనించి ప్రతిఘటించి బిజెపికి బుద్ధి చెప్పాలన్నారు. వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్, జిల్లా నేతలు కళావతమ్మ, చంద్రయ్య, కృష్ణవేణి, గీత, మోష అబ్రహం ,రాబర్ట్, శ్రీహరి ,పృధ్వి నాదం, భాస్కర్, రవీందర్,డంగు కుర్మయ్య, వంక గోపాల్, గోపాలకృష్ణ, జయమ్మ,శ్రీదేవి, కురువమ్మ,డంగ్గులక్ష్మి,శిరీష, ఎం.కురుమయ్య,పెంటయ్య,చిన్న నారాయణ,శివకుమార్,కాకం బాలస్వామి, లక్ష్మీనారాయణ, శ్యాంసుందర్, సహదేవుడు, కాశన్న,మహేష్, వెంకటమ్మ, శంకరమ్మ,కుతుబ్, వంశీ, ఎర్ర కుర్మయ్య తదితరులు పాల్గొన్నారు.
వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కి దక్కిన అత్యున్నత రక్తదాత ప్రోత్సాహక పురస్కారం వనపర్తి వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డికి అత్యున్నత రక్తదాత ప్రోత్సాహక పురస్కారం లభించడం వనపర్తి జిల్లాకు గర్వకారణంగా నిలిచింది. సమాజంలో స్వచ్ఛంద రక్తదానంపై అవగాహన కల్పిస్తూ, యువతను రక్తదానం వైపు ప్రోత్సహించడంలో ఎమ్మెల్యే చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో అత్యధిక యూనిట్ల రక్తాన్ని సేకరించడం జరిగింది. ఈ రక్తదాన శిబిరం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో ఉన్న అనేక మంది రోగులకు ప్రాణదానంగా నిలిచే రక్తాన్ని అందించగలిగారు. రక్తదాన ఉద్యమాన్ని విజయవంతం చేయడంలో ఎమ్మెల్యే గారి నాయకత్వం, యువతలో సామాజిక బాధ్యతను పెంపొందించేందుకు చేసిన కృషి విశేష ప్రశంసలు అందుకుంది ఈ నేపథ్యంలో గౌరవనీయ గవర్నర్ గారి చేతుల మీదుగా అత్యున్నత రక్తదాత ప్రోత్సాహక పురస్కారాన్ని అందుకోవాల్సిందిగా ఎమ్మెల్యే మేఘారెడ్డి గారికి ఆహ్వానం అందడం మరింత గర్వకారణంగా మారింది. మానవతా విలువలను చాటిచెప్పే ఈ గుర్తింపు వనపర్తి ప్రజలందరికీ ఆనందాన్ని కలిగిస్తుండగా, భవిష్యత్తులో కూడా రక్తదాన ఉద్యమాన్ని మరింత విస్తృతంగా కొనసాగిస్తూ ప్రాణాలను కాపాడే సేవా కార్యక్రమాలకు కట్టుబడి ఉంటామని ఎమ్మెల్యే తెలిపారు. రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసిన, యువకులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలియజేశారు