VETA NEWS MEDIA

2026-06-18
Offcanvas
Edit Template

Uncategorized

పెండింగ్‌లో ఉన్న అన్ని దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి

వనపర్తి తహసిల్దార్ కార్యాలయాల్లో పెండింగ్‌లో ఉన్న అన్ని దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్ ఆదేశించారు. బుధవారం అదనపు కలెక్టర్ ఆత్మకూర్ తహసిల్దార్ కార్యాలయంలో భూభారతి పెండింగ్ దరఖాస్తులు, సాదా బైనమా పెండింగ్ దరఖాస్తులు సహా ఇతర పెండింగ్ అంశాలపై సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామాల్లో ప్రజలకు అందుతున్న సేవలను మరింత మెరుగుపరచడం కోసం సంబంధిత అధికారులు కృషి చేయాలని సూచించారు. ముఖ్యంగా గ్రామ పంచాయతీల పరిధిలో జరిగే పనులు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల అమలు విషయంలో నిర్లక్ష్యం లేకుండా పని చేయాలని ఆదేశించారు. తహసిల్దార్ కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్న అన్ని దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. భూభారతి, సాదా బైనమా దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజల సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని వెంటనే స్పందించాలన్నారు. గ్రామాల్లో జరుగుతున్న పనులను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని సూచించారు. అధికారుల మధ్య సమన్వయం పెంచి సమర్థవంతమైన సేవలు అందించాలన్నారు. SIR ప్రక్రియ నేపథ్యంలో BLOలు తమ విధులను సమర్థవంతంగా నిర్వహించాలని, మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశించారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల సందర్శన బుధవారం అదనపు కలెక్టర్ అమరచింత మండల పరిధిలోని నాగల కడుమూరు, పామిరెడ్డిపల్లి, ఈర్లదిన్నె గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి కొనుగోళ్లు జరుగుతున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. టార్పాలిన్ కవర్లు, గన్ని బ్యాగులు అందుబాటులో ఉంచడంలో సమస్య లేకుండా చూడాలని ఆదేశించారు. హమాలీలకు సంబంధించి ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే లోడింగ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో తహసిల్దార్ జె కే మోహన్, రెవెన్యూ అధికారులు, GPOలు పాల్గొన్నారు.

పెండింగ్‌లో ఉన్న అన్ని దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి Read More »

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

వనపర్తి వనపర్తి టౌన్ రాజనగరం 12 వార్డు మరియు గోపాల్పేట మండల కేంద్రంలో మరియు తాడిపత్రి, పోల్క్ పహాడ్ గ్రామాలలో, రేవల్లి మండల కేంద్రంలో మహిళా సమైక్య, సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రలను సోమవారం వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని, కేంద్రం వద్ద రైతులు సేద తీరేందుకు నీడ, నీరు ఏర్పాటు చేయాలన్నారు. తేమ శాతం వచ్చిన వెంటనే వడ్లను కొనుగోలు చేయాలంటూ నిర్వాహకులకు ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో సర్పంచులు, అధికారులు మహిళా సమైక్య సభ్యురాలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే Read More »

నిర్లక్ష్యానికి మారుపేరు మున్సిపల్ శాఖ

వనపర్తి నిర్లక్ష్యానికి మారుపేరు మున్సిపల్ శాఖ పార్కుల పేరుతో కోటానుకోట్ల ఖర్చు నిర్వహణ మాత్రం శూన్యం…. సూరవరం ప్రతాపరెడ్డి పార్కు అందుకు నిదర్శనం అని ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ అన్నారు. మార్నింగ్ వాక్ లో వెళ్తున్న ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ కు సూరవరం ప్రతాపరెడ్డి పార్క్ ను చూసి అధికారుల నిర్లక్ష్యంపై మండిపడుతూ, ప్రజల సొమ్ము గాలికి వదిలేస్తూ, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పక్కన ఉన్న పత్రిక సంపాదకుడు, రచయిత, వనపర్తి మొదటి ఎమ్మెల్యే సురవరం ప్రతాపరెడ్డి గారి పార్కు నిర్లక్ష్యంగా వదిలివేయడo చూస్తే అర్థమవుతుంది మిగతా పార్కుల పరిస్థితి అని అన్నారు. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి వెంటనే పరిశీలించి పార్కును అభివృద్ధి చేయాలని, పార్కును అభివృద్ధి చేసి అక్కడ కూర్చోవడానికి బెంచీలు ఏర్పాటు చేసి, మధ్యలో రేకులతో నీడ కల్పించాలని, ఈ పార్కును సీనియర్ సిటిజన్స్ కు అప్పజెప్పాలని దాని నిర్వహణ వారే చూసుకుంటారని, అఖిలపక్ష ఐక్యవేదిక తరపున జిల్లా కలెక్టర్ కి, ఎమ్మెల్యే కి విజ్ఞప్తి చేస్తున్నామని అఖిలపక్ష ఐక్యవేదిక తరపున డాక్టర్ సతీష్ యాదవ్ డిమాండ్ చేశారు.

నిర్లక్ష్యానికి మారుపేరు మున్సిపల్ శాఖ Read More »

ప్రజావాణి ఫిర్యాదులు పరిష్కరించాలి

వనపర్తి ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులు, అర్జీలను వేగంగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖీమ్య నాయక్ ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, జెడ్పి సీఈవో యాదయ్యతో కలిసి హాజరై ప్రజల నుంచి అర్జీలు, వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో 41 దరఖాస్తులు వచ్చాయని అదనపు కలెక్టర్ తెలిపారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు, అర్జీలను పరిశీలించి, సత్వర పరిష్కారం చూపేలా సంబంధిత శాఖల జిల్లా స్థాయి అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి, వెంటనే పరిష్కరించేలా తగు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. సీఎం, జిల్లా మంత్రి ప్రజావాణి నుంచి వచ్చిన, పెండింగ్ లో ఉన్న అర్జీలను సైతం వారంలో పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ప్రజావాణి ఫిర్యాదులు పరిష్కరించాలి Read More »

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

వనపర్తి వనపర్తి మండలం చందాపూర్ గ్రామంలో జరిగిన భాను ప్రకాష్ భవ్య శ్రీ ల వివాహ కార్యక్రమానికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరై నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వెంట కౌన్సిలర్ శ్రీకర్, చింటూ,కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్థానిక నాయకులు మరియు ఆహ్వానితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి Read More »

ఆత్మశుద్ధి,పవిత్ర సంకల్పం కోసమే హజ్ యాత్ర

వనపర్తి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మైనారిటీ అధ్యక్షులు జోహెబ్ హుస్సేన్ ఆధ్వర్యములో జరిగిన హజ్ యాత్రికుల అభినందన సభలో పాల్గొని హజ్ యాత్రికులను ఘనంగా సన్మానించారు.హజ్ యాత్ర చేస్తున్న ఇంతియాజ్,గూడు.మహమూద్,అజీమ్,అబూ బకర్, అనీస్,సలీం,మతీన్,ఫరూక్,అజీజ్ ఖాన్,మాలిక్ ఖాన్,ఫైజాన్,మహమూద్,అజ్మత్ మరియు కుటుంబ సభ్యులను అభినందించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఆత్మశుద్ధి మరియు పవిత్ర జీవిత సంకల్పం కోసమే ముస్లిం సోదరులు హజ్ యాత్ర చేస్తారని అన్నారు. హజ్ యాత్రతో శక్తివంతమైన ఆత్మస్థైర్యం కలిగి లోక కళ్యాణం కోసం కృషి చేస్తారని పవిత్ర లక్ష్యంతో సాగే యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు. రాబోవు రోజులలో తెలంగాణలో సుపరిపాలన రావాలని అల్లాను ప్రార్థించాలని ఆకాంక్షించారు. హజ్ యాత్రికులకు సన్మానం,విందు ఏర్పాటు చేసిన జోహెబ్ హుస్సేన్ ను అభినందించారు. ఈ కార్యక్రమములో గట్టు యాదవ్ వాకిటి శ్రీధర్ పలుస రమేష్ గౌడ్ నందిమల్ల అశోక్,కౌన్సిలర్.శ్రీకర్ గౌడ్,బండారు.కృష్ణ,సమద్,స్టార్.రహీమ్,చిట్యాల రాము, యూసుఫ్, డ్యానియల్,హారీఫ్,ఏ.కె.పాషా,ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు.

ఆత్మశుద్ధి,పవిత్ర సంకల్పం కోసమే హజ్ యాత్ర Read More »

త్యాగనిరతికి ప్రతీకగా నిలిచిన పవిత్ర దేవతామూర్తి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత

వనపర్తి అహింస, ఆత్మగౌరవం మరియు త్యాగనిరతికి ప్రతీకగా నిలిచిన పవిత్ర దేవతామూర్తి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత అని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి కొనియాడారు. ఆదివారం జిల్లా కలెక్టరేట్‌లో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై వాసవి కన్యకా పరమేశ్వరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే తో పాటు అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వినోద్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి మాట్లాడుతూ, అహింస, ఆత్మగౌరవం మరియు త్యాగనిరతికి ప్రతీకగా నిలిచిన పవిత్ర దేవతామూర్తి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత అని కొనియాడారు. వాసవి మాత సమాజానికి ధర్మం, అహింస, సత్యం వంటి గొప్ప విలువలను బోధించిన మహనీయురాలని అన్నారు. ఆమె చూపించిన మార్గం ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. సమాజంలో ఐక్యత, సేవాభావం పెంపొందించుకోవాలని, వాసవి మాత బోధనలు అందరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. అదనపు కలెక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ, వాసవి మాత జయంతి వేడుకలు సమాజంలో సత్సంకల్పాలు పెంపొందించేలా ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి సుధీర్ రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, ఆర్యవైశ్య సంఘం నాయకులు, ఇతర ప్రజా సంఘాల నాయకులు, అధికారులు, సిబ్బంది, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు

త్యాగనిరతికి ప్రతీకగా నిలిచిన పవిత్ర దేవతామూర్తి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత Read More »

మేడే వారోత్సవాలను జయప్రదం చేయండి

వనపర్తి శనివారం సిఐటియు వనపర్తి జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం సిఐటియు జిల్లా కార్యాలయం వనపర్తి లో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్యన్ రమేష్ అధ్యక్షతన నిర్వహించాము ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి మండ్ల రాజు మాట్లాడుతూ కార్మికుల దీక్ష దినమైన మేడే వారోత్సవాలు మే 1 నుండి 7 వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టాలని, లేబర్ కోర్స్ రద్దు అయ్యే వరకు ఉద్యమిస్తామని అన్నారు, పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం పని చేస్తుందని, కార్మికుల శ్రమను పెట్టుబడిదారులకు దోచిపెడుతుందని అన్నారు, 12 గంటల పని విధానానికి వ్యతిరేకంగా పోరాడుదమని, కార్మిక హక్కుల కోసం, ఎనిమిది గంటల పని దినం రక్షణ కోసం, ప్రతి కార్మికునికి 28 వేల వేతనం వచ్చే వరకు పోరాటం నిర్వహిద్దామని, మే డే ను ప్రతి గ్రామంలో ఘనంగా నిర్వహించుకుందామని. ప్రతి మండల కేంద్రంలో మే 1న జెండా ఆవిష్కరణ సభలు నిర్వహించుకోవాలని కార్మికులకు తెలియజేశారు, మే డే స్ఫూర్తితో జిల్లాలో ఉన్న కార్మికులు ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని కార్మికులను కోరారు సమావేశానికి సిఐటియు జిల్లా ఆఫీస్ బేరర్స్ బొబ్బిలి నిక్సన్, పుట్ట ఆంజనేయులు. ఎస్ రాజు, మదన్, సూర్యవంశం రాము, బాల గౌడు, కవిత, సునీత, బుచ్చమ్మ తదితరులు పాల్గొన్నారు

మేడే వారోత్సవాలను జయప్రదం చేయండి Read More »

వివాహ ప్రథనం కార్యక్రమంలో పాల్గొని నూతన వధువును ఆశీర్వదించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

వనపర్తి పెబ్బేరు మండలంలోని అయ్యవారిపల్లి గ్రామ అధ్యక్షుడు రవి గారి కుమార్తె మౌనిక వివాహ ప్రథనం కార్యక్రమంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొని వధువును అక్షింతలు వేసి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గారి వెంట కౌన్సిలర్ శ్రీకర్ చింటూ, చిట్యాల రాము, గ్రామ మాజీ ఎంపీటీసీ మద్దిలేటి గోవిందు, ఖాదర్ బాషా, కురుమూర్తి, ముజీపు, యుగేందర్, ఆంజనేయులు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

వివాహ ప్రథనం కార్యక్రమంలో పాల్గొని నూతన వధువును ఆశీర్వదించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి Read More »

ఓటరు మ్యాపింగ్ పకడ్బందీగా నిర్వహించాలి

వనపర్తి జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో భాగంగా ఓటరు మాపింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ (రెవిన్యూ) టి. వినోద్ కుమార్ అధికారులకు ఆదేశించారు. శనివారం అదనపు కలెక్టర్ వనపర్తి మండలం పెద్దగూడెం గ్రామాన్ని ఆకస్మికంగా సందర్శించి ఓటరు మాపింగ్ ప్రక్రియను పరిశీలించారు. గ్రామ పాలన అధికారులు ఈ కార్యక్రమంపై ప్రత్యేక శ్రద్ధ వహించి యుద్ధ ప్రాతిపదికన మాపింగ్ పూర్తి చేయాలని ఆదేశించారు. కళ్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ పథకాల కింద వచ్చిన దరఖాస్తులను సత్వరం పరిశీలించి అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ , సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న సాధా బైనామా మరియు భూ భారతి దరఖాస్తులను కూడా త్వరితగతిన పరిశీలించి నివేదికలు సమర్పించాలని సూచించారు. తహసీల్దార్ కార్యాలయంలో విచారణలో ఉన్న అన్ని రకాల సేవలకు సంబంధించిన దరఖాస్తులను వేగంగా పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా, ఓటరు మాపింగ్ పనుల పురోగతిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, గ్రామ పాలన అధికారులతో సమీక్షించారు. జిల్లాలో అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి ఓటరు మాపింగ్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా పూర్తి చేయాలని సూచించారు.

ఓటరు మ్యాపింగ్ పకడ్బందీగా నిర్వహించాలి Read More »

Scroll to Top