మల్లయ్య దేవుడి పండగ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
వనపర్తి
పెబ్బేరు మండలం కంచిరావుపల్లి గ్రామంలో గురువారం ప్రారంభమైన మల్లయ్య దేవుడి పండగల కార్యక్రమంలో వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మల్లయ్య ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. గ్రామాల్లో నిర్వహించుకునే ఇలాంటి పండగల ద్వారా గ్రామస్తుల మధ్య ఐక్యత నెలకొంటుందని, ఇలాంటి పండుగలు జరుపుకోవడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో పెబ్బేరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యాపర్ల రాంరెడ్డి, గ్రామ సర్పంచ్ అరుణ జయపాల్ రెడ్డి, గ్రామ వార్డు సభ్యులు గ్రామ పెద్దలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
