VETA NEWS MEDIA

2026-06-18
Offcanvas
Edit Template

Uncategorized

మన అభివృద్ధి సమాజ సేవకు ఉపయోగపడాలి

వనపర్తి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పానగల్ మండలం గోప్లాపూర్ గ్రామానికి చెందిన మిద్దె సుదర్శన్ హైదరాబాదులోని రాజేంద్ర నగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా అభినందించి సన్మానించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ మన మండలం నుండి హైదరాబాద్ లో వృత్తిరీత్యా స్థిరపడి ఉన్నత స్థానమైన బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎన్నిక కావడం మనకు గర్వకారణం అని అన్నారు. జీవితములో ఉన్నతంగా ఎదిగిన తర్వాత పుట్టిన ఊరికి తల్లిదండ్రులకు మంచి పేరు తెస్తూనే సమాజ సేవకు అంకితం కావాలని కోరారు. న్యాయవాద వృత్తిలో ఉన్నత స్థాయిలో సుదర్శన్ రాణించాలని ఆకాంక్షించారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెంట నందిమల్ల అశోక్ ఉన్నారు.

మన అభివృద్ధి సమాజ సేవకు ఉపయోగపడాలి Read More »

కాంగ్రెస్ సేవాదళ్ సీనియర్ నాయకుడు సీతారాములు గౌడ్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

_వనపర్తి పెద్దమందడి మండలం మణిగిల్ల కాంగ్రెస్ సేవాదల్ సీనియర్ నాయకుడు సీతారాములు గౌడ్ ఇటీవలే గుండెపోటుతో అకాల మరణం చెందారు, ఇట్టి విషయాన్ని మణిగిల్ల కాంగ్రెస్ నాయకుల ద్వారా తెలుసుకున్న ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి శుక్రవారం వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం చేశారు. వారి కుటుంబానికి ఎల్లవేళలా తోడుగా ఉంటానని కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మనిగిళ్ల గ్రామ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ సేవాదళ్ సీనియర్ నాయకుడు సీతారాములు గౌడ్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే Read More »

రెవెన్యూ డివిజన్ స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం

వనపర్తి ప్రజల సమస్యల పరిష్కారానికి మరింత పారదర్శకమైన, బాధ్యతాయుతమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం “ప్రజావాణి” కార్యక్రమాన్ని రెవెన్యూ డివిజన్ స్థాయిలో నిర్వహించాలని నిర్ణయించినట్లు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి నేడొక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి అదనంగా, వెంటనే అమలులోకి వచ్చే విధంగా ప్రతి రెవెన్యూ డివిజన్ స్థాయిలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ మేరకు జిల్లాలోని అన్ని రెవెన్యూ డివిజన్‌ కార్యాలయలలో ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 4వ తేదీ (సోమవారం) నుంచి ప్రారంభించి, నిరంతరంగా నిర్వహించేలా సంబంధిత అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో అందిన పిటిషన్ల సంఖ్యను అదే రోజు ముగింపు నాటికి సేకరించి, ప్రభుత్వం సూచించిన నమూనా ప్రకారం నివేదికగా పంపించాల్సిందిగా తెలిపారు. ఈ ఫార్మాట్ త్వరలో తెలియజేయబడుతుందని చెప్పారు. అలాగే, ఫిర్యాదుల నమోదు, పరిశీలన, పరిష్కార ప్రక్రియను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు సీజీజీ (CGG) ద్వారా వెబ్ ఆధారిత అప్లికేషన్ అభివృద్ధి చేయబడుతున్నదని కలెక్టర్ పేర్కొన్నారు.జిల్లాలోని ప్రజలు ఆర్ డి వో కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని తమ సమస్యలను తెలియజేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి కోరారు.

రెవెన్యూ డివిజన్ స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం Read More »

నూతన మహేంద్ర ట్రాక్టర్ ప్రారంభోత్సవానికి హాజరైన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

వనపర్తి వనపర్తి పట్టణంలో ఏదుల మండలం మాసుపల్లి గ్రామనికి చెందిన మహేంద్ర ట్రాక్టర్ ఓనర్స్ రాములు రమేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన మహేంద్ర ట్రాక్టర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ట్రాక్టర్ యజమానిని శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వ్యాపారం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ధర్మారెడ్డి, పురుషోత్తం, చారి, బుద్ధయ్య, నరసింహ, ఏదుల పార్టీ అధ్యక్షులు అబ్దుల్లా,,బాల్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

నూతన మహేంద్ర ట్రాక్టర్ ప్రారంభోత్సవానికి హాజరైన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి Read More »

ప్రభుత్వ ఉద్యోగులందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలి

వనపర్తి వనపర్తి ప్రభుత్వ పాఠశాలలో మొదటి సంవత్సరం మార్కులు తెచ్చుకున్న జీవన్ సాయి 536 మార్కులు, గురు రాఘవేంద్ర 519 మార్కులు తెచ్చుకున్న విద్యార్థులను బుద్ధారం ప్రభుత్వ పాఠశాలలో మొదటి మార్కులు తెచ్చుకున్న భారతి 518 మార్కులతో , పోల్కపాడులో ప్రభుత్వ పాఠశాలలో మొదటి స్థానం సంపాదించిన విద్యార్థిని మౌనిక లను అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ ఘనంగా సన్మానించారు. పోల్కపాడు సర్పంచ్ బంగారయ్య, 22 వార్డు కౌన్సిలర్ భర్త శ్రీనివాసులు, బీఎస్పీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి మై బూస్, టిడిపి నాయకులు కొత్తగొల్ల శంకర్, సుంద రామస్వామి, ఖాజా WNP ZPHS B ఉపాధ్యాయులు గోపాలకృష్ణ, రవీందర్ గౌడ్, నరేష్,గురు రాజు యాదవ్, వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సతీష్ యాదవ్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగులు తమ తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లలో కాకుండా ప్రభుత్వ స్కూల్లోని చదివించాలని వారిని మిగతావారు కూడా అనుసరిస్తారని ఎందుకంటే ప్రభుత్వ స్కూలల్లో నాణ్యవంతమైన టీచర్లు ఉంటారు… విద్యార్థులు డబ్బులు లేకుండా పాస్ అవుతున్నారు…. ప్రైవేట్ స్కూళ్లలో లక్షలు పెట్టి అన్యాయం అవుతున్నారు కనుక హైదరాబాదులో చదివించేవారు ఆలోచించి వనపర్తి లోనే చదివించాలని మేము విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వ ఉద్యోగులందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలి Read More »

 ప్రతి పౌరుడు తన హక్కులతో పాటు బాధ్యతలను కూడా తెలుసుకొని సమాజ అభివృద్ధికి తోడ్పడాలి

వనపర్తి ప్రతి పౌరుడు తన హక్కులతో పాటు బాధ్యతలను కూడా తెలుసుకొని సమాజ అభివృద్ధికి తోడ్పడాలని అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వినోద్ కుమార్ విజ్ఞప్తి చేశారు. గురువారం పెద్దమందడి మండల పరిధిలో పర్యటించిన అదనపు కలెక్టర్, జగత్పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన పౌర హక్కుల దినం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు పౌర హక్కుల ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ కీలక సూచనలు చేశారు. ప్రతి పౌరుడు తన హక్కులతో పాటు బాధ్యతలను కూడా తెలుసుకొని సమాజ అభివృద్ధికి సహకరించాలని పేర్కొన్నారు. అనంతరం ఆయన మణిగిల్ల, చిన్నమందడి, వెళ్టూర్, పెద్దమందడి గ్రామాల్లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రాల్లో ధాన్యం నిర్వహణపై ఆరా తీసి, రిజిస్టర్లు పరిశీలించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా మరియు వేగవంతంగా నిర్వహించాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కేంద్రాల ఇన్‌చార్జ్‌లకు ఆదేశించారు. రైతుల నుంచి ధాన్యం స్వీకరణలో నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందిగా సూచించారు.అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వినోద్ కుమార్ క్షేత్ర స్థాయిలో ఇంధన సరఫరా పరిస్థితులను సమీక్షించారు. ఈ సందర్భంగా కొత్తకోట మరియు వెల్టూరు ప్రాంతాల్లోని పెట్రోల్ బంకులను ఆయన తనిఖీ చేశారు. డి సి ఎస్ ఓ కాశీ విశ్వనాథ్, తహసీల్దార్ పాండు నాయక్, ఎంపీడీవో పరిణత, ఇతర అధికారులు తదితరులు ఉన్నారు.

 ప్రతి పౌరుడు తన హక్కులతో పాటు బాధ్యతలను కూడా తెలుసుకొని సమాజ అభివృద్ధికి తోడ్పడాలి Read More »

వివాహానికి హాజరై నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

పెబ్బేరు పెబ్బేరు పట్టణంలో పుల్లారెడ్డి రాంరెడ్డి ఫంక్షన్ హాల్ లో జరిగిన మహేష్ & రాజేశ్వరి ల వివాహ కార్యక్రమానికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరై నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. పెబ్బేరు పట్టణంలోని సహారాఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన రంజిత్ & మనోజ్ఞ ల వివాహ కార్యక్రమానికి మాజీ మంత్రి హాజరై నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వెంట మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

వివాహానికి హాజరై నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి Read More »

గృహ ప్రవేశం కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

వనపర్తి వనపర్తి పట్టణం 2వ వార్డుకు చెందిన హౌదికారి రాజన్న గారి ఆహ్వానం మేరకు నూతనంగా నిర్మించిన గృహ ప్రవేశం కార్యక్రమం ఘనంగా నిర్వహించగా, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొని గృహ యజమానులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబం సుఖశాంతులతో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వెంట పట్టణ పార్టీ అధ్యక్షులు పలస రమేష్ గౌడ్, జిల్లా మీడియా సెల్ అధ్యక్షులు నందిమల్ల అశోక్, ప్రేమ్ నాథ్ రెడ్డి కౌన్సిలర్స్ పలస శ్రీకర్ గౌడ్, మాజీ కోఆప్షన్ ఇమ్రాన్, ప్రభాకర్,నాయకులు తదితరులు పాల్గొన్నారు

గృహ ప్రవేశం కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి Read More »

వివాహానికి హాజరై నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించిన రావుల చంద్రశేఖర్ రెడ్డి

వనపర్తి వనపర్తి జిల్లా కేంద్రంలోని కానాయపల్లి గ్రామానికి చెందిన ఉప్పరి శ్రీనివాస్ గారి కూతురు సుదీక్ష & అజయ్ సాగర్ గార్ల వివాహం ఎంబి గార్డెన్ లో ఘనంగా జరిగింది ఈ వివాహానికి మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి , దేవరకద్ర మాజీ శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర్ రెడ్డి ,హాజరై నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఈ వివాహానికి వారితోపాటు కొత్తకోట మండలం కానాయపల్లి గ్రామ మాజీ సర్పంచ్ పోతులపల్లి యాదయ్య సాగర్ , కొత్తకోట మాజీ ఎంపీపీ గుంత మౌనిక , నందిమల్ల అశోక్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు , కార్యకర్తలు వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

వివాహానికి హాజరై నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించిన రావుల చంద్రశేఖర్ రెడ్డి Read More »

జానీమియా(బ్రాడ్ వే టైలర్)కుటుంబ సభ్యులను పరామర్శించిన రావుల

వనపర్తి ఇటీవల మరణించిన జానీమియా కుటుంబసభ్యులను గౌరవ రావుల చంద్రశేఖరరెడ్డి పరమార్శించినారు. ఈ సందర్భంగా రావుల జానీమియా గారి సతీమణి రహీమున్నిసా బేగం గారితో మాట్లాడుతూ జానీ బాయ్ నాకు అత్యంత ఆప్తుడు,సన్నిహితుడని వారు లేనిలోటు తీర్చలేనిదని అన్నారు. ఎప్పుడు ఏమి అవసరం ఉన్నా తాను తోడుగా ఉంటానని భరోసా ఇచ్చారు. చింతకుంట. ఆంజనేయులును పరామర్శించిన రావుల. రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స తీసుకొని విశ్రాంతి తీసుకుంటున్న చింతకుంట.ఆంజనేయులు మరియు చింతకుంట.శ్రీనివాసులు గార్లను వారి ఇంటి దగ్గర పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకొని ఆర్థిక సహాయం అందజేశారు. రావుల వెంట నందిమల్ల అశోక్,సయ్యద్. జెమిల్,నందిమల్ల.రమేష్,ముద్దుసార్ ,మోహన్,సంపత్ తదితరులు ఉన్నారు.

జానీమియా(బ్రాడ్ వే టైలర్)కుటుంబ సభ్యులను పరామర్శించిన రావుల Read More »

Scroll to Top