VETA NEWS MEDIA

2026-06-18
Offcanvas
Edit Template

Uncategorized

విద్యా సంవత్సరం ఇంటర్ యధావిధి అడ్మిషన్లు సీఎం ప్రకటన పట్ల వనపర్తి ప్రభుత్వ గెజిటెడ్ అధ్యాపకుల సంఘం -475 హర్షం వనపర్తి ఈ విద్యా సంవత్సరం ఇంటర్ యధావిధి అడ్మిషన్లు సీఎం ప్రకటన పట్ల వనపర్తి ప్రభుత్వ గెజిటెడ్ అధ్యాపకుల సంఘం -475 హర్షం ఈ విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ విద్యార్థుల అడ్మిషన్లు గత సంవత్సరం మాదిరిగా యధావిధిగా కొనసాగిస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, విద్యాశాఖ మాత్యులు, రేవంత్ రెడ్డి ప్రకటించడం పట్ల వనపర్తి జిల్లా ప్రభుత్వ గజిటెడ్ అధ్యాపకులు హర్షం వ్యక్తం చేయడం జరిగింది. 10 లక్షల మంది విద్యార్థులు, తల్లిదండ్రులు విద్యభవిష్యత్తు నిర్ణయంపై ఎలాంటి ఆలోచన చేయకుండా ఇంటర్ విద్య విలీనంపై తొందరపడవద్దని భాగస్వామ్య పక్షాలతో మేధావులతో సమావేశం ఏర్పాటు చేయాలని, ఈ విద్యా సంవత్సరంలో యధావిధిగా గత సంవత్సరం మాదిరిగా అడ్మిషన్ నిర్వహించాలని తమ సంఘం తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగిందని వనపర్తి జిల్లా అధ్యక్షులు కృష్ణయ్య కార్యదర్శి వెంకటరెడ్డి తెలియజేస్తూ, విద్యార్థుల డ్రాప్స్ కి కారణం ఇంటర్ విలీన మార్గం ఒక్కటే కాదని ,తల్లిదండ్రులు విద్యార్థుల యొక్క ఆలోచన, ఆర్థిక ,సామాజిక కారణాలు అనేకం ఉన్నాయని వీటి గురించి చర్చించకుండా ఇంటర్ విలీనమే అన్ని సమస్యలకు మార్గమని చెప్పటం ఏకపక్షంగా ఉంటుందని తెలియజేస్తూ ,సీబీఎస్సీ చదువుతున్న స్కూల్లో టెన్త్ తర్వాత 11 వచ్చే ముందు డ్రాప్స్ ఉందో లేదో ఒక సర్వే నిర్వహించాలని కోరారు. అదేవిధంగా సిబిఎస్ స్కూల్ అనేవి మధ్యతరగతి పై వర్గాలకు మాత్రమే అందుబాటులో ఉంటుందని , గ్రామప్రాంత విద్యార్థులకు సీబీఎస్సీ స్కూల్స్ , సిలబస్ అందుబాటులో ఉండకపోవటంతోపాటు ఆ సంస్కృతి, సిలబస్ తెలంగాణ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సరి కాదని తెలిపారు. విద్య అనేది ఉమ్మడి జాబితాలో రాష్ట్ర పరిధిలో ఉంటుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిధులు సాధించడానికి సరైన మార్గం అవలంబించాలని అవసరమైతే విద్యార్థులు మేధావులతో చర్చించి కేంద్ర ప్రభుత్వాన్ని అప్పిలు చేయాలని తెలిపారు. ముఖ్యమంత్రి విద్యార్థులు ,తల్లిదండ్రులు, అధ్యాపకులు ఆందోళన గమనించి యధావిధిగా ఇంటర్ అడ్మిషన్లకు అనుమతించడం పట్ల మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పటికైనా అధికారుల కొంతమంది ఏకపక్ష నిర్ణయాలు చేస్తున్నారని ,అదేవిధంగా ఇంటర్ విద్యలో ఒక్క సంఘాన్నే ప్రోత్సహించకూడదని, మెజార్టీ సభ్యులతో కూడిన సంఘాలు కూడా ఉన్న విషయాన్ని ప్రభుత్వం, అధికారులు గమనించాలని కోరారు. ఈ విషయంలో విద్యార్థులు తల్లిదండ్రులు సంఘాల యొక్క ఆందోళన ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లడానికి ఎలక్ట్రానిక్ మీడియా, పత్రికలు చాలా సహకరించాయని వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు వనపర్తి జిల్లా తెలంగాణ ప్రభుత్వ గజిటెడ్ అధ్యాపకుల సంఘం 475 , అధ్యక్షులు సి కృష్ణయ్య ప్రధాన కార్యదర్శి వెంకట్ రెడ్డి తెలిపారు.

Read More »

నూతన వధూవరులను ఆశీర్వదించిన రావుల వనపర్తి శాసన మండలి సభ్యులు కోటిరెడ్డి గారి కుమారుడు అజిత్ రెడ్డి వివాహం లక్ష్మి సౌజన్యతో హైటెక్స్ లో ఇరువురు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషుల సమక్షంలో వివాహం ఘనంగా జరిగింది. ఈ వివాహ శుభకార్యానికి మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి, శాసనమండలి సభ్యులు ఎల్.రమణ హాజరై నూతన వధూవరులను అక్షింతలు వేసి నూతన వధూవరులకు ఆశీర్వదించి వారికి వివాహ శుభాకాంక్షలు తెలిపారు.

Read More »

ఘనంగా గ్రామదేవతల పండగ పూజలు చేసిన మంత్రి జూపల్లి, ఎమ్మెల్యే మేఘారెడ్డి వనపర్తి గ్రామదేవతల పండుగలు గ్రామస్తుల మధ్యన ఐక్యతను పెంపొందిస్తాయని ఈ పండగలు గ్రామస్తుల ఐక్యతను చెబుతాయని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం వనపర్తి జిల్లా గ్రంధాలయాల అధ్యక్షులు గోవర్ధన్ సాగర్ ఆహ్వానం మేరకు పాన్గల్ మండలం మందాపురం గ్రామంలో నిర్వహించిన నాభి శిల పున ప్రతిష్ట కార్యక్రమానికి వారు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీల కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బండలాగుడు పోటీలకు ఒక ప్రత్యేకత ఉంటుందని ఈ పోటీల్లో పోటీపడే వృషభరాజాలను ప్రత్యేక శ్రద్ధతో పెంచుతారని వృషభరాజాలపై మక్కువ ఉన్న రైతులు మాత్రమే ఇలాంటి పోటీలలో పాల్గొంటారని వారు పేర్కొన్నారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు మహిళలు యువకులు గ్రామ పెద్దలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Read More »

రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజలు కొంటాం – రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు వనపర్తి రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజలను ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందని, రైతులు ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. ఆదివారం అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్, సివిల్ సప్లై అధికారి, వ్యవసాయ, కోపరేటివ్, తహసీల్దార్లు, మిల్లర్లు, ఐ. కె.పి. సహకార సంఘాల వడ్లు కొనుగోలు కేంద్రాల సభ్యులతో వెబ్ కాన్ఫరెన్స్ నిర్వహించి వరి కొనులు ప్రక్రియను సమీక్షించారు. రైస్ మిల్లులో ధాన్యం త్వరగా దించుకోకుండా రోజుల తరబడి లారీలు ఆగిపోవడం, కొనుగోలు కేంద్రాల్లో తూకం వేయకపోవడం పై వివరాలు అడిగారు. లారీల్లో తెచ్చిన వడ్లు నాణ్యత లేవని, తాలు, చెత్త ఎక్కువగా ఉండటం వల్ల ఎఫ్.సి.ఐ కి నాణ్యమైన బియ్యం తిరిగి ఇవ్వడం సాధ్యం కాదని, అందుకే రైతులు నిబంధనల ప్రకారం నాణ్యమైన వడ్లు ఇవ్వాల్సిందిగా కోరుచున్నట్లు మిల్లర్లు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. స్పందించిన కలెక్టర్ రైతులు సైతం సహకరించి తూర్పారబట్టిన వడ్లను కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని నాణ్యమైన వడ్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వెంటనే కొనుగోలు చేసి డబ్బులు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ట్యాబ్ ఎంట్రీ చేయడంలో జాప్యం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. మిల్లర్లు వచ్చిన లారీలను త్వరగా ఖాళీ చేసి పంపించాలని, రోజుల తరబడి మిల్లుల వద్ద ధాన్యం లారీలు పెట్టుకోవద్దని ఆదేశించారు. కొనుగోలు ప్రక్రియను యుద్ధప్రాతిపదికన నిర్వహించాలని, అకాల వర్షాలు ఎప్పుడైనా వచ్చే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. సంబంధిత అధికారులు అందరూ సమన్వయంతో పనిచేసి రబీ కొనుగోలు ప్రక్రియను విజయవంతం చేయాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్, సివిల్ సప్లై అధికారి కాశి విశ్వనాథ్, డి.సి.ఓ రాణి, తహసీల్దార్లు, మిల్లర్లు, ఐ.కే.పి, సహకార సంఘం కొనుగోలు కేంద్రాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Read More »

ధ్వజ స్తంభ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్న మాజీ మంత్రి వనపర్తి పెబ్బేరు మండలం తోమాలపల్లి శ్రీ శ్రీ శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయ కమిటీ ఆహ్వానం మేరకు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవంలో పాల్గొని దేవతా మూర్తుల విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని ఆలయ మర్యాదలతో ఆహ్వానించి సన్మానించారు అనంతరం వేదపండితులు ఆశీర్వచనం ఇచ్చి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ధ్వజస్తంభ,బొడ్రాయి స్థాపనలతో గ్రామ ప్రజలు ఐక్యతగా మెలిగి సుఖసంతోషాలతో, సౌభాగ్యంగా ఉంటారని అన్నారు. మాజీ మంత్రి వెంట బి.ఆర్.ఎస్ నాయకులు,ఆహ్వాన కమిటీ సభ్యులు ఉన్నారు.

Read More »

ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నిర్వహించిన మారథాన్ కార్యక్రమం వనపర్తి జనగణన 2027 లో భాగంగా ప్రజలు స్వీయ గణన (Self Enumeration) ద్వారా తమ వివరాలను తామే నమోదు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందని, ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి విజ్ఞప్తి చేశారు. శనివారం జిల్లా కేంద్రంలో జనగణన-2027లో భాగంగా స్వీయ గణనపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నిర్వహించిన మారథాన్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పాల్గొన్నారు. బాలుర జూనియర్ కళాశాల మైదానం నుండి ప్రారంభమైన మారథాన్ పాలిటెక్నిక్ కళాశాల వరకు కొనసాగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కరోనా కారణంగా 2021 లో నిర్వహించాల్సిన జనగణన ప్రక్రియ ఆలస్యమైందని, ఇప్పుడు దేశవ్యాప్తంగా డిజిటల్ విధానంలో జనగణన చేపడుతున్నట్లు తెలిపారు. మే 11 నుండి జూన్ 10 వరకు జిల్లాలో సుమారు 13 వేల మంది సిబ్బంది ఇంటింటికి వెళ్లి హౌస్ లిస్టింగ్ కార్యక్రమంలో పాల్గొని వివరాలు సేకరిస్తారని చెప్పారు. ప్రజలు స్వీయ గణన (Self Enumeration) ద్వారా తమ వివరాలను తామే నమోదు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందని, ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములు కావాలని కోరారు. సరైన సమాచారం ద్వారా అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పన మరింత సమర్థవంతంగా జరుగుతుందని తెలిపారు. ప్రజల వివరాలు పథకాల నమోదులో ఎక్కడ వినియోగించడం జరగదని ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా తమ సమాచారాన్ని ఎన్యూమరేటర్లకు తెలియజేయాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. జనగణన విజయవంతానికి మీడియా ద్వారా విస్తృతంగా అవగాహన కల్పించాలని, ప్రజలందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డిఎస్పి గిరిబాబు, సిపిఓ హరికృష్ణ, డివైస్ ఓ సుధీర్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజలు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Read More »

ప్రతి చివరి ధాన్యపు గింజ వరకు కొంటాం వనపర్తి ఆరుగాలం శ్రమించి పండించిన పంటను చివరి దాన్యపు గింజ వరకు కొంటామని రైతులు ఎక్కడ అధైర్య పడాల్సిన అవసరం లేదని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పెద్దమందడి మండలం వీరాయపల్లి గ్రామంలో FPO (రైతు ఉత్పత్తిదారుల సంఘం) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్య కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళా సమైక్య, PACS, మెప్మా, ల తో పాటు FPO లను సైతం ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో వీరాయపల్లిలో వారి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందని ఎక్కడ ఎలాంటి సమస్యలు లేకుండా అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కార చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కొనుగోలు నిరంతరాయంగా కొనసాగుతున్న వలన అక్కడక్కడ లారీలు, గన్ని బస్తాల సమస్య ఉన్న అధికారులు వెంటనే పరిష్కరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అధికారులు ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అన్నదాతలు ఎలాంటి ఆందోళనలకు గురికాకూడదనీ మీరు కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చే ప్రతి ప్రతి ధాన్యపు గింజలు కొనుగోలు చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు రాజప్రకాష్ రెడ్డి, వనపర్తి మార్కెట్ యార్డ్ ఉపాధ్యక్షులు రామకృష్ణారెడ్డి. డైరెక్టర్లు వెంకటయ్య, వెంకటరామిరెడ్డి, బాల్ రెడ్డి, లక్ష్మణ్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు సత్యారెడ్డి మాజీ జెడ్పిటిసి వెంకటస్వామి, సర్పంచులు మాజీ సర్పంచులు మాజీ ఎంపిటిసిలు, నాయకులు కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు

Read More »

సమీకృత మార్కెట్ సముదాయాన్ని వ్యాపారస్థులు, వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలి వనపర్తి సకల సదుపాయాలతో రూపొందించిన సమీకృత మార్కెట్ సముదాయాన్ని వ్యాపారస్థులు, వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని స్థానిక శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి కోరారు. వనపర్తి పట్టణంలోని పాత మార్కెట్ యార్డు ప్రాంతంలో నూతనంగా సకల సదుపాయాలతో నిర్మించిన సమీకృత మార్కెట్ సముదాయంలోని మొదటి అంతస్తులో శుక్రవారం రిజిస్ట్రేషన్ అస్యూరెన్స్ కార్యాలయాన్ని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కొత్తకాపు శివసేనారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ మాధవితో కలిసి ప్రారంభోత్సవం చేశారు. అర్చకులు వేద మంత్రాలతో ఈ సందర్భంగా శాసన సభ్యులు మాట్లాడుతూ సమీకృత మార్కెట్ సముదాయం పూర్తి అయి దాదాపు సంవత్సరం పైగా అవుతున్నప్పటికీ షాపుల అద్దె ఎక్కువగా ఉండటంతో షాపులు తీసుకోడానికి వ్యాపారస్తులు ఎవరు ముందుకు రాలేదన్నారు. పరిస్థిని గమనించి జిల్లా కలెక్టర్ తో సమన్వయం చేసుకొని నిర్ణయించిన రేట్లలో సగానికి తగ్గించి ప్రతిపాదనలు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ను పంపించగా అట్టి ప్రతిపాదనలు ఆమోదించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సమీకృత మార్కెట్ లో షాపులు పొంది ప్రార్భోత్సవాలు చేసుకున్న రిజిస్ట్రేషన్ కార్యాలయ సిబ్బంది, దస్తావేజు లేఖరులకు శుభాకాంక్షలు తెలిపారు. సమీకృత మార్కెట్ సముదాయంలో ఇంకా డిమాండు ఉందని, జిల్లా కలెక్టర్ తో మాట్లాడి అవసరమైన వారందరికీ షాపులు కేటాయించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సమీపంలో ఉన్న టౌన్ హాల్ ను సైతం వినియోగంలోకి తీసుకువస్తామని అదేవిధంగా దాని చుట్టూ ఉన్న ఖాళీ స్థలంలో బంగారు షాపులను నిర్మించి ఇక్కడే గోల్డ్ బజార్ ఏర్పాటుకి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు. ప్రస్తుతం కొన్ని వసతి గృహాలు అద్దె భవనాల్లో ఉన్నాయని, త్వరలోనే ప్రభుత్వ భవనాల్లోకి మార్చేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు . స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కొత్తకాపు శివసేనారెడ్డి మాట్లాడుతూ సమీకృత మార్కెట్ సముదాయంలో షాపులు పొందిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ దాదాపు ఒకటిన్నర సంవత్సరాల నుండి నిరుపయోగంగా పడిఉన్న సమీకృత మార్కెట్ సముదాయాని శాసన సభ్యులు ప్రత్యేక చొరవ తీసుకోవడం వల్ల షాపు ధరలు తగ్గించి లాటరీ పద్ధతి ద్వారా పారదర్శకంగా షాపుల కేటాయింపు చేయడం జరిగిందన్నారు. సామాన్యంగా గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న షాపులకు మాత్రమే డిమాండు ఉంటుందనీ కానీ పై అంతస్తులో తీసుకోడానికి సామాన్యంగా ఎవరు ఇష్టపడరు అన్నారు. అందుకే పై అంతస్తులో రిజిస్ట్రేషన్ శాఖ పెట్టడం వల్ల డిమాండు పెరిగి అన్ని షాపులకు డిమాండు పెరిగిందన్నారు. పట్టణం మధ్యలో సమీకృత మార్కెట్ ఉండటం చాలా బాగుందని తెలిపారు. వనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గత పాలకులు అసంపూర్తిగా వదిలిన భవనానికి దాదాపు 23 లక్షలు అదనంగా ఖర్చు చేసి ట్రాన్స్ ఫార్మా సైతం ఏర్పాటు చేసి నేడు వినియోగంలో తెచ్చినందుకు శాసన సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మాధవి, జిల్లా రిజిస్ట్రార్ ఫణీంద్ర, సబ్ రిజిస్ట్రార్ చంద్రశేఖర్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

Read More »

సమీకృత మార్కెట్ సముదాయాన్ని వ్యాపారస్థులు, వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలి : ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి వనపర్తి సకల సదుపాయాలతో రూపొందించిన సమీకృత మార్కెట్ సముదాయాన్ని వ్యాపారస్థులు, వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని స్థానిక శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి కోరారు. వనపర్తి పట్టణంలోని పాత మార్కెట్ యార్డు ప్రాంతంలో నూతనంగా సకల సదుపాయాలతో నిర్మించిన సమీకృత మార్కెట్ సముదాయంలోని మొదటి అంతస్తులో శుక్రవారం రిజిస్ట్రేషన్ అస్యూరెన్స్ కార్యాలయాన్ని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కొత్తకాపు శివసేనారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ మాధవితో కలిసి ప్రారంభోత్సవం చేశారు. అర్చకులు వేద మంత్రాలతో ఈ సందర్భంగా శాసన సభ్యులు మాట్లాడుతూ సమీకృత మార్కెట్ సముదాయం పూర్తి అయి దాదాపు సంవత్సరం పైగా అవుతున్నప్పటికీ షాపుల అద్దె ఎక్కువగా ఉండటంతో షాపులు తీసుకోడానికి వ్యాపారస్తులు ఎవరు ముందుకు రాలేదన్నారు. పరిస్థిని గమనించి జిల్లా కలెక్టర్ తో సమన్వయం చేసుకొని నిర్ణయించిన రేట్లలో సగానికి తగ్గించి ప్రతిపాదనలు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ను పంపించగా అట్టి ప్రతిపాదనలు ఆమోదించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సమీకృత మార్కెట్ లో షాపులు పొంది ప్రార్భోత్సవాలు చేసుకున్న రిజిస్ట్రేషన్ కార్యాలయ సిబ్బంది, దస్తావేజు లేఖరులకు శుభాకాంక్షలు తెలిపారు. సమీకృత మార్కెట్ సముదాయంలో ఇంకా డిమాండు ఉందని, జిల్లా కలెక్టర్ తో మాట్లాడి అవసరమైన వారందరికీ షాపులు కేటాయించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సమీపంలో ఉన్న టౌన్ హాల్ ను సైతం వినియోగంలోకి తీసుకువస్తామని అదేవిధంగా దాని చుట్టూ ఉన్న ఖాళీ స్థలంలో బంగారు షాపులను నిర్మించి ఇక్కడే గోల్డ్ బజార్ ఏర్పాటుకి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు. ప్రస్తుతం కొన్ని వసతి గృహాలు అద్దె భవనాల్లో ఉన్నాయని, త్వరలోనే ప్రభుత్వ భవనాల్లోకి మార్చేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు . స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కొత్తకాపు శివసేనారెడ్డి మాట్లాడుతూ సమీకృత మార్కెట్ సముదాయంలో షాపులు పొందిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ దాదాపు ఒకటిన్నర సంవత్సరాల నుండి నిరుపయోగంగా పడిఉన్న సమీకృత మార్కెట్ సముదాయాని శాసన సభ్యులు ప్రత్యేక చొరవ తీసుకోవడం వల్ల షాపు ధరలు తగ్గించి లాటరీ పద్ధతి ద్వారా పారదర్శకంగా షాపుల కేటాయింపు చేయడం జరిగిందన్నారు. సామాన్యంగా గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న షాపులకు మాత్రమే డిమాండు ఉంటుందనీ కానీ పై అంతస్తులో తీసుకోడానికి సామాన్యంగా ఎవరు ఇష్టపడరు అన్నారు. అందుకే పై అంతస్తులో రిజిస్ట్రేషన్ శాఖ పెట్టడం వల్ల డిమాండు పెరిగి అన్ని షాపులకు డిమాండు పెరిగిందన్నారు. పట్టణం మధ్యలో సమీకృత మార్కెట్ ఉండటం చాలా బాగుందని తెలిపారు. వనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గత పాలకులు అసంపూర్తిగా వదిలిన భవనానికి దాదాపు 23 లక్షలు అదనంగా ఖర్చు చేసి ట్రాన్స్ ఫార్మా సైతం ఏర్పాటు చేసి నేడు వినియోగంలో తెచ్చినందుకు శాసన సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మాధవి, జిల్లా రిజిస్ట్రార్ ఫణీంద్ర, సబ్ రిజిస్ట్రార్ చంద్రశేఖర్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

Read More »

ప్రజా నాయకునికి రిటైర్డ్ ఉద్యోగికి సతీష్ యాదవ్ సన్మానం వనపర్తి నిత్యం ప్రజల్లో ఉండి పోరాటాలు చేస్తున్న నాయకుడు, తెలుగుదేశం ఎన్నికల అధికార ప్రతినిధి కొత్త గొల్ల శంకర్ జన్మదిన సందర్భంగా ఉదయం ఆయనకు శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సత్కరించారు. ఇటీవలే ఆర్టీసీ ఉద్యోగిగా రిటైర్డ్ అయిన R.T.C కార్మిక నాయకులు మూర్తి ని మర్రికుంట దగ్గర ఉన్న బెల్లం టీ హోటల్ దగ్గర అఖిలపక్ష ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ మాట్లాడుతూ, ఇద్దరూ కార్మిక నాయకులను సన్మానించడం మా అదృష్టమని అందులో టిడిపి నాయకులు కొత్త గొల్ల శంకర్ గారిని, ఆర్టీసీ నాయకుడు మూర్తి ని సన్మానించడం ప్రజల దృష్టిలో ఒక గొప్ప అవకాశం అని భావిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటేశ్వర్లు, నాయిగంటి నరసింహ శర్మ, శివకుమార్, రామస్వామి, నాగరాజు, అశోక్, శివ, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Read More »

Scroll to Top