వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతం గా జరగాలి వనపర్తి జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతం గా జరగాలని, అదేవిధంగా మిల్లుల వద్ద ధాన్యం బస్తాల అన్లోడింగ్ ప్రక్రియ కూడా వేగంగా జరగాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ ఏఎస్పి రాజేష్ మీనా తో కలిసి పెద్దమందడి మండల పరిధిలోని పామిరెడ్డిపల్లి పాక్స్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రం, వీరాయిపల్లి సమీపంలోని ఎఫ్ పి ఓ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఆయా కొనుగోలు కేంద్రాల్లో దాన్యం నమోదు రిజిస్టర్లను కలెక్టర్ తనిఖీ చేశారు. అనంతరం ఇన్చార్జ్ లకు పలు సూచనలు చేశారు.కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతంగా జరగాలని సూచించారు. తేమశాతం నిర్ధారించుకుని వేగంగా కాంటాక్ట్ చేసి కేటాయించిన మిల్లుకు తరలించే విధంగా చూడాలన్నారు. రెవెన్యూ శాఖ తరపున కేటాయించిన ప్రత్యేక అధికారి కొనుగోలు కేంద్రం వద్ద ఈ పది రోజులు నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు. రైతులకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని కలెక్టర్ ఆరా తీయగా, ఈ క్రమంలో రైతులు కలెక్టర్ తో మాట్లాడుతూ లారీల ట్రాన్స్పోర్ట్ సమస్య ఉందని, అందువల్లనే ధాన్యం మిల్లులకు తరలించడం ఆలస్యం అవుతుందని తెలియజేశారు. దీంతో కలెక్టర్ స్పందిస్తూ లారీలను అదనంగా కేటాయించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఖిలా గణపురం మండల పరిధిలోని సోలిపురం గ్రామ శివారులో ఉన్న సింధు ఆగ్రో రైస్ మిల్లు ను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. మిల్లు ఆవరణలో వేచి ఉన్న ధాన్యం లారీలను వేగంగా అన్లోడ్ చేయించాలని సూచించారు. అదేవిధంగా గోదాంలో ధాన్యం బస్తాల అన్లోడింగ్ ప్రక్రియను పరిశీలించారు. మిల్లు వద్ద మిల్లర్లు ధాన్యంలో తాలు చెక్ చేసే విధానాన్ని స్వయంగా పరిశీలించి పలు సూచనలు చేశారు. జిల్లా పౌరసరఫరాల అధికారి కాశీ విశ్వనాథ్, ఇతర అధికారులు తదితరులు ఉన్నారు.
Uncategorized
డెంటల్ హాస్పిటల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే వనపర్తి దినదినాభివృద్ధి చెందుతున్న వనపర్తి పట్టణంలో మనిషి అవసరార్థం ఉపయోగపడేందుకు ఆసుపత్రులు ఎంతో అవసరమని ప్రజాసేవలో ఆసుపత్రులే మొదటి వరుసలో ఉంటాయని, వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. బుధవారం వనపర్తి పట్టణంలోని 23 వార్డులో దంత వైద్యుడు ప్రణయ్ కుమార్ రెడ్డి గారు నూతనంగా ఏర్పాటు చేసిన సమర్త్ సాయినాథ్ డెంటల్ హాస్పిటల్ ను ఎమ్మెల్యే గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య వృత్తి ఎంతో పవిత్రమైనదని వైద్య వృత్తిలో ఉండి నిరుపేదలకు సేవ చేయడం గర్వించదగిన విషయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వైద్యులు నిస్వార్ధంగా వైద్య సేవ చేయాలని సూచించారు. కార్యక్రమంలో వనపర్తి పట్టణ కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
ప్రజా చైతన్యంలో కళలది ప్రత్యేక పాత్ర: వంక గోపాల్ వనపర్తి సమాజంలో ప్రజలను చైతన్యవంతం చేయటంలో కళలకు ప్రత్యేక స్థానం ఉందని ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు వంకా గోపాల్ అన్నారు. బుధవారం వనపర్తి ఆఫీసులో ప్రజానాట్యమండలి నాలుగవ రాష్ట్ర మహాసభ గోడపత్రికలను కళాకారులు, నేతలతో కలిసి ఆవిష్కరించారు. మాట్లాడుతూ.. ఒక గొప్ప ఉపన్యాసం కంటే పాట, నాటకం, ఒగ్గు కథ, గొల్ల సుద్దులు వివిధ రూపాల కళలు ఎక్కువగా ప్రజలను కదిలిస్తాయన్నారు. అందువల్ల జిల్లాలో ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో కళలు కళారూపాల అభివృద్ధికి విశేష కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా చైతన్యంతో పాటు పార్టీ అభివృద్ధికి కళలు పట్టుగొమ్మలుగా ఉపయోగపడతాయని, జిల్లాలో కళాబృందాల ఏర్పాటుకు అందరూ తోడ్పాటు అందించాలన్నారు. జీవితకాలం ఆటపాటలతో ప్రజలను చైతన్యపరిచిన వృద్ధ కళాకారులు జీవించలేని స్థితిలో ఉన్నారని వారిని ఆదుకునేందుకు పెన్షన్ ఇవ్వడంతో పాటు ఇండ్లు, ఇళ్లస్థలాలు మంజూరిలో వారికి ప్రత్యేక కోటా కేటాయించాలన్నారు. తెలంగాణ ప్రజా నాట్యమండలి ఆవిర్భావం మే 25న జరిగిందని, ఆరోజు హైదరాబాద్ మగ్దుంభవన్ లో రాష్ట్ర నాలుగవ మహాసభ జరుగుతుందని 26న ప్రతినిధుల సభ ఉంటుందని జిల్లా కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. కళావతమ్మ, శ్రీరామ్, రమేష్, కృష్ణవేణి, జయమ్మ, గంధం నాగరాజు,శేఖర్, చిన్న కుర్మన్న, వంశీ తదితరులు పాల్గొన్నారు.
కేంద్రమంత్రి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి : NFIW,CPI వనపర్తి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు సాయి భగీరథ మైనర్ బాలికపై లైంగిక దాడికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఎన్ఎఫ్ఐ డబ్ల్యు జిల్లా అధ్యక్షులు, కేతేపల్లి ఉప సర్పంచ్ కృష్ణవేణి, ఎన్ ఎఫ్ ఐ డబ్ల్యూ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షురాలు మాజీ సర్పంచ్ కళావతమ్మ, సిపిఐ జిల్లా కార్యదర్శి కే శ్రీరామ్, సిపిఐ వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్ డిమాండ్ చేశారు. పానగల్ మండలం కేతేపల్లి బస్టాండ్ లో బండి సాయి భగీరథ్ మైనర్ బాలికపై లైంగిక దాడికి ఎన్ఎఫ్ఐ డబ్ల్యు, సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళలను పూజించే గౌరవించే దేశం మనదని, సనాతన ధర్మాన్ని కాపాడుతామని బిజెపి నేతలు గొప్పలు చెబుతారని, ఆచరణలో నీచంగా వ్యవహరిస్తారని విమర్శించారు.కరీంనగర్లో మైనర్ బాలికపై కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడి దురాగతం దీనికి తాజా ఉదాహరణ అన్నారు. బిజెపి పాలిత మణిపుర్ రాష్ట్రంలో గతంలో ఇద్దరుమహిళలను నగ్నంగా ఊరేగించారని గుర్తు చేశారు. ఆర్ఎస్ఎస్ నేపథ్యంలో ఎదిగిన బండి సంజయ్ తన కుమారుడికి సత్ప్రవర్తన నేర్పించడంలో ఎందుకు విఫలమయ్యారని ప్రశ్నించారు. తండ్రిగా కుమారునికి సత్ప్రవర్తన నేర్పించడంలో వైఫల్యానికి ఆయన నైతిక బాధ్యత వహించాన్నారు. లైంగిక దాడిపై బాలిక కుటుంబ సభ్యులు సాయి భగీరథ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఫోక్సో కేసు నమోదు చేసినా ఇంతవరకు ఎందుకు అరెస్టు చేయలేదన్నారు. సామాన్యుల పిల్లలు లైంగిక దాడి నేరానికి పాల్పడితే ఫోక్సో కేసు పెట్టి, వెంటనే నిందితులను అరెస్టు చేస్తారని దొరకకపోతే తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారని మరి బండి సంజయ్ కుమారుని అరెస్ట్ చేయకుండా పోలీసులు ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు. సామాన్యుడికి ఒక నీతి ఉన్నత పదవుల్లో ఉన్న వారికి మరొక నీతా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా సాయి భగీరథ అరెస్టుపై ఆలస్యాన్ని ఖండించారు. బాధ్యత గల కేంద్ర మంత్రిగా తన కొడుకును పోలీసులకు సరెండర్ చేయాలని లేదా నైతిక బాధ్యత వహించి కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయాలన్నారు. రాజీనామా చేయకుంటే ప్రధాని జోక్యం చేసుకొని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. సాయి భగీరథ కూడా తనపై హానీ ట్రాప్ జరిగిందని పోలీస్ స్టేషన్లో బాలిక కుటుంబంపై ఫిర్యాదు చేశారని ఇంతకంటే దారుణం మరొకటి ఉండదన్నారు. ఇది కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం అని, సాయి భగీరథను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని లేదంటే సిపిఐ, అనుబంధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎన్ఎఫ్ఐ డబ్ల్యు ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షురాలు కళావతమ్మ ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు శ్రీరామ్ సిపిఐ వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్ ,సిపిఐ మండల కార్యదర్శి డంగు కుర్మయ్య, మాజీ వార్డు సభ్యుడు కమ్మావులపెంటయ్య ,వార్డు మెంబర్ మాల కురువమ్మ, సిపిఐ కేతపల్లి గ్రామ శాఖ కార్యదర్శికాకం చిన్న నారాయణ, కాకం కాశన్న, రామాంజనేయులు, బాలస్వామి, ఎల్లయ్య, ఎల్లమ్మ, రామదాసు, కాకం కాశన్న, నీలమ్మ ,బొక్కలమ్మ, సాయి లీల ,బోయ చిన్న కుర్మయ్య ,బీరయ్య, ధర్మయ్యతదితరులు పాల్గొన్నారు
కళాశాల లో కొత్తగా AEDP కోర్స్ ల ను ప్రారంభించటం ఆనందదాయకం వనపర్తి ప్రజా పాలనా – ప్రగతి ప్రణాళిక విద్యా వారాత్సవాల లో భాగంగా సోమవారం వనపర్తి మహిళా డిగ్రీ కళాశాలలో నియోజకవర్గ శాసన సభ్యులు తుడి మేఘారెడ్డి కరపత్రాలను విడుదల చేశారు.ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ కళాశాల లో కొత్తగా AEDP కోర్స్ ల ను ప్రారంభించటం ఆనందదాయకమని, విద్యార్థులకు స్థాయిపండ్ బాగా ఉపయోగ పడుతుంది అని అన్నారు.ఇంటర్ పూర్తి అయిన విద్యార్థులు ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో అధిక సంఖ్య లో చేరి కళాశాల లో ఉండే వనరుల ను సద్వినియోగం చేసుకోవాలి అని సూచించారు అదేవిదంగా కళాశాల సిబ్బంది విద్యార్థుల అడ్మిషన్ సంఖ్యను వచ్చే విద్యా సంవత్సరం లో మరింత పెంచుటకు సమిష్టిగా కృషి చేయాలి అని MLA సూచించారు ఈ కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్. B. ఈశ్వరయ్య, అసిస్టెంట్ ప్రొఫెసర్ లు రామరాజు యాదవ్, దామోదర్ రెడ్డి, విష్ణుమూర్తి, శ్రీనివాసులు, యువరూప లక్ష్మి, గోవర్ధన్, విజయలక్ష్మి, మన్నేమన్నా, మణిదీప, సీనియర్ అసిస్టెంట్ వెంకటయ్య, బోధనేతర సిబ్బంది, విద్యార్ధినులు పాల్గొన్నారు.
రైతులు వారు పండించిన వడ్లను అమ్ముకోవడానికి ఎవరిని బతిమాలాల్సిన అవసరం లేదు వనపర్తి రైతులు పండించిన వడ్లను అమ్మడానికి రైతులు ఎవరిని బతిమాలాల్సిన అవసరం లేదనీ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పండించిన మొత్తం ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేసి రైతులకు పూర్తి భరోసా కల్పిస్తుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఆబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని కల్యాణ సాయి గార్డెన్ ఫంక్షన్ హాల్లో యాసంగి సీజన్కు సంబంధించిన వరి, మొక్కజొన్న కొనుగోళ్లపై వనపర్తి శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి, దేవరకద్ర శాసన సభ్యులు జి. మధుసూదన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతు పండించిన ప్రతి గింజకు గిట్టుబాటు ధర కల్పించి, అన్నదాతల శ్రేయస్సును కాపాడటమే రాష్ట్ర ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రైతులకు భరోసా ఇచ్చారు. రైతులు, కొనుగోలుదారులు, రైస్ మిల్లర్లు సమన్వయంతో వ్యవహరించాలని, ఎక్కడా పారదర్శకత లోపించకూడదని ఆదేశించారు. రైతు కష్టానికి తగిన ప్రతిఫలం దక్కేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, కొనుగోలు ప్రక్రియలో ఎవరూ ఎవరినీ బతిమాలుకునే పరిస్థితి రాకూడదని హితవు పలికారు. కొనుగోలు కేంద్రంలోనే నిబంధనల ప్రకారం వడ్లు నాణ్యత చూసుకొని తూకం చేసి రైతుకు అక్కడే రశీదు ఇచ్చేయాలని అంతే తప్ప రైతు లారీ వెంబడి మిల్లుకు వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. వడ్లు నాణ్యతను బట్టి తరుగు తాలు కొనుగోలు కేంద్రంలోనే జరగాలని, ఎట్టిపరిస్థితుల్లోనూ లారీ మిల్లుకు వచ్చిన తర్వాత తరుగు అనే మాట మాట్లాడకుండా వడ్లు దించుకోవాలని మిల్లర్లను ఆదేశించారు. రైతులు నాణ్యమైన వడ్లు ఇవ్వడం లేదని, ఇచ్చిన ధాన్యం మిల్లు ఆడించి ఎఫ్.సి.ఐ.కి క్వింటాలుకు 68 కిలోల చొప్పున తిరిగి ఇవ్వాల్సి ఉంటుందని, నాణ్యమైన వడ్లు ఇవ్వకపోవడం వల్ల మిల్లర్లు నష్టపోతున్నారని మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శేఖర్ రెడ్డి మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన మంత్రి ఎఫ్.సి.ఐ.కి ఇచ్చే 68 కిలోల బియ్యంలో నూకలు, సరిగ్గా గింజలు నిండనివి, ఇతరత్రా కలుపుకొని దాదాపు 23 శాతం ఉంటుందని అందువల్ల మిల్లర్లు నష్టపోయే అవకాశమే లేదని, రైతులకు సహకరించి వారిని ఇబ్బంది పెట్టవద్దని కోరారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్ , మార్కెట్ కమిట్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ మాధవి, గ్రంథాలయ చైర్మన్ గోవర్ధన్ సాగర్, సివిల్ సప్లైస్ అధికారులు, మార్కెటింగ్, రవాణా శాఖల అధికారులు, రైస్ మిల్లుల ప్రతినిధులు, వడ్లు కొనుగోలు కేంద్రాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వనపర్తి శ్రీరంగాపురం మండలం వెంకటాపురం గ్రామంలో సోమవారం నిర్వహించిన పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి తన వంతుగా రూ 3 లక్షల రూపాయలను విరాళంగా అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో నిర్వహించే ఎటువంటి పండుగలు గ్రామ ఐక్యతను చాటి చెబుతాయని ఇలాంటి పండుగలను పాల్గొనడం సంతోషి దాకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో పెబ్బేరు, శ్రీరంగాపురం మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు ఆలయ కమిటీ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు
అన్నదాతలను అగచాట్లకు గురిచేస్తున్న ప్రభుత్వం ఆగం కాక తప్పదు వనపర్తి మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బి.ఆర్.ఎస్ శ్రేణులతో కలసి వరి,మొక్కజొన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కొనుగోలు కేంద్రాలు తాళ్ళ చెరువు,చినగుంటపల్లి,గోపాల్ పేట మరియు వనపర్తి మార్కెట్ యార్డును సందర్శించి రైతుల గోడు విని మార్కెట్ యార్డులో మెరుపు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరవ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ రైతులు ఆరుగాలం శ్రమించి పంటలు పండించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నెలల తరబడి వేచి చూస్తున్న రైతులను ముప్పతిప్పలు పెట్టడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం అని దుయ్యబట్టారు. ప్రతిగింజ కొంటాం అన్న మంత్రుల,అధికారుల మాటలు ప్రకటనలకే పరిమితం అయ్యినాయని విమర్శించారు. రైతుబంధు ఇవ్వకున్న,కరెంటు కోతలు ఉన్నా, సాగునీరు ఇవ్వకున్నా అష్టకష్టాలు పడి పండించిన వరి మొక్కజొన్న ధాన్యములను కొనకుండా రైతులను హరిగోసలు పెడుతున్న ప్రభుత్వం ఆగం కాక తప్పదని హెచ్చరించారు. ట్రాన్స్పోర్టు,హమాలీల కొరత,గన్ని బ్యాగుల కొరత తీర్చకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం అని అన్నారు. యాసంగి పంటలో ఎటువంటి తరుగు ఉండదని తెలిసి కూడా క్వింటాలుకు 10కిలోల తరుగు తీస్తూ రైతులను జలగల లాగ మిల్లర్లు, అధికారులు కుమ్మకై దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం యాసంగిలో రైతులు 65లక్షల 45వేల ఎకరాలలో వరి సాగు చేశారని 1కోటి 50లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యం ఉన్నప్పటికీ కేవలం 15,16లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేయడం జరిగిందని అన్నారు. మొక్కజొన్న పంటను 16లక్షల 46వేల ఎకరాల లో సాగు జరిగిందని వర్షాభావం వల్ల రైతులు మొక్కజొన్న పంటకు ప్రాధాన్యత ఇచ్చారని ఎక్కడ చూసినా మొక్కజొన్న కుప్పలు కుప్పలుగా రాశులు కనిపిస్తున్నాయని నేటికి ఒక్క క్వింటాలు మొక్కజొన్న కొనుగోలు చేసిన దాఖలాలు లేవని అన్నారు. కె.సి.ఆర్ హయాములో రైతులకు సకాలములో యూరియా ,కరెంట్,సాగునీరు అందించి మద్దతు ధరతో ధాన్యాన్ని కొనుగోలు చేయడంతో రైతులు వైభోగంగా గ్రామాలలో బొడ్రాయి,పెద్దమ్మ పండుగలు నిర్వహించుకుని సౌభాగ్యంగా ఉన్నారని కొనియాడారు. కనీసం యూరియా అందించలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఆరోపించారు. అన్నదాతలను అగచాట్లకు గురిచేస్తున్న ప్రభుత్వం ఆగం కాక తప్పదు అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే వరి మొక్కజొన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు లేని పక్షములో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెంట గట్టు యాదవ్ వాకిటి శ్రీధర్ పలుస రమేష్ గౌడ్ నందిమల్ల అశోక్,కె.మాణిక్యం,భాను ప్రకాష్,రఘువర్ధన్ రెడ్డి,రవిప్రకాష్ రెడ్డి,గంధం.పరంజ్యోతి, కౌన్సిలర్స్ మురళీ సాగర్ శ్రీకర్ గౌడ్,సర్పంచు కె. స్వప్న భాస్కర్,బి.బాలరాజు,తిరుపతయ్య, ధర్మా నాయక్, హేమంత్ ముదిరాజ్, వెంకట్ సాగర్,జోహెబ్ హుస్సేన్, మహేశ్వర్ రెడ్డి,చిట్యాల.రాము,మంద రాము, అనుపటి రాము,పోతులపల్లి.రాజు,నందిమల్ల. రమేష్ కవితా నాయక్,నీలస్వామి,గులాం ఖాదర్ ఖాన్,హరీఫ్,ఏ. కే.పాషా తదితరులు ఉన్నారు.
పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వనపర్తి ఖిల్లా ఘనపూర్ మండలం వెనకీ తండాలో జరిగిన మోహన్ నాయక్ జ్యోతివివాహ రిసెప్షన్ కార్యక్రమానికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరై నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఘనపూర్ మండలం అప్పారెడ్డిపల్లి గ్రామంలో నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ నాయకుడు శేఖర్ గృహప్రవేశ కార్యక్రమంలో మాజీ మంత్రి పాల్గొని కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. వారి గృహం సుఖశాంతులతో, ఐశ్వర్యాలతో నిండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాల్లో మాజీ మంత్రి గారి వెంట మండల పార్టీ అధ్యక్షులు రాళ్ల కృష్ణయ్య , మాజీ ఏఎంసీ చైర్మన్ లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీపీ కృష్ణ నాయక్, మాజీ జెడ్పిటిసి సామ్యా నాయక్, సర్పంచులు రాజు నాయక్, నాగయ్య, భరత్ నాయక్, శంకర్ గౌడ్, చెన్నయ్య, లక్ష్మయ్య, ఆంజనేయులు గౌడ్, గోపాల్, పోలిశెట్టి ప్రతాప్, మల్లేష్, మాధవ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
వివాహ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వనపర్తి వనపర్తి మండలం రాజపేట పాపే తండాకు చెందిన, వశరాం కుమారుడు కాట్రావత్ సురేష్ – మనీష ల వివాహ కార్యక్రమం ఆనందోత్సాహాల నడుమ ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరై నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వధూవరులు సుఖశాంతులతో, ఆనందంగా, ఐశ్వర్యాలతో నిండిన దాంపత్య జీవితం గడపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో, నాయకులు మాధవరెడ్డి, సర్పంచ్ ఎల్లయ్య, స్థానిక నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.