VETA NEWS MEDIA

2026-06-18
Offcanvas
Edit Template

Uncategorized

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే వనపర్తి ఖిల్లా ఘణపురం మండలం సల్కేలాపురం గ్రామానికి చెందిన గొల్ల చెన్నయ్య గారి కుమారుడు శ్రీకాంత్ యాదవ్ వివాహానికి వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. హిందూ సంప్రదాయంలో వివాహ మహోత్సవానికి ప్రత్యేక గుర్తింపు ఉందని పెద్దల సమక్షంలో జరిగే వివాహ వేడుకలు కలకాలం అన్యోన్యంగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు సాయి చరణ్ రెడ్డి, గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Read More »

రాజ్యాధికారమే లక్ష్యంగా బీసీల పోరాటం

నాగర్ కర్నూల్ రాజ్యాధికారమే లక్ష్యంగా బీసీలు పోరాటం చేయాలని బీసీ పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు దన్నోజు అరవింద్ చారి పేర్కొన్నారు. నేపాల్ లో జెఎన్ జీ ఉద్యమం. తమిళనాడులో టీవీకే అధికారంలోకి రావడాన్ని గమనిస్తే తెలంగాణలోనూ మెజారిటీ ప్రజలైన బీసీలు పోరాడితే 2029లో అధికారం దక్కడం ఖాయమని బీసీ పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు దన్నోజు అరవింద్ చారి బుధవారం రోజున ఒక ప్రకటనలో కనిపిస్తోందని పేర్కొన్నారు. కాంగ్రెస్, భాజపా, భరాస పార్టీలు సామాజిక న్యాయం పాటించడం లేదని, బీసీలను ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించడం లేదని పేర్కొన్నారు. జనగణనలో బీసీ కుల గణన చేయకుండా కేంద్రం అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. మహిళా బిల్లుల్లో బీసీలకు సబ్ కోటా పెట్టకుండా 40 కోట్ల మంది బీసీ మహిళలను భాజపా అవమానించిందని బిసి పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు దన్నోజు అరవింద్ అన్నారు.

రాజ్యాధికారమే లక్ష్యంగా బీసీల పోరాటం Read More »

రైతులకు కొనుగోలు విషయంలో ఎలాంటి ఆటంకాలకు తావివ్వద్దు

రైతులకు కొనుగోలు విషయంలో ఎలాంటి ఆటంకాలకు తావివ్వద్దు వనపర్తి రైతులకు కొనుగోలు విషయంలో ఎలాంటి ఆటంకాలకు తావివ్వద్దు. వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు తో మాట్లాడిన డిసిసి చీఫ్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డిఐకెపి సెంటర్స్, దళారులు తరువు పేరుతో రైతులను మోసం చేస్తున్నారని రైతులు శివసేన రెడ్డికి విన్నవించారు.వెంటనే స్పందించి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి కి చరవాణి ద్వారా సమాచారాన్ని చేరవేసి.. క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాల్సిందిగా కోరడమైనది. కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షపాతిగా ప్రభుత్వం పని చేస్తుంది. రైతులు కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వారికి కావలసిన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయాలని, ప్రభుత్వం నిర్ణీతమైన తేమ శాతం ప్రకారం కొనుగోలు చేయాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, చిన్న చిన్న పొరపాట్లు ఉంటే సరి చేయాలని అధికారులకు సూచించారు. దళారులు మోసం చేసిన రైతులకు తెలియని పరిస్థితుల్లో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని, అందుకు ముందస్తు ప్రణాళికలతో కొనుగోలు కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తనతకుండా చూడాలని తెలిపారు.

రైతులకు కొనుగోలు విషయంలో ఎలాంటి ఆటంకాలకు తావివ్వద్దు Read More »

రాజ్యాధికారమే లక్ష్యంగా బీసీల పోరాటం Veta News Wanaparthy : బీసీ పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు దన్నోజు అరవింద్ చారిరాజ్యాధికారమే లక్ష్యంగా బీసీలు పోరాటం చేయాలని బీసీ పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు దన్నోజు అరవింద్ చారి పేర్కొన్నారు. నేపాల్ లో జెఎన్ జీ ఉద్యమం. తమిళనాడులో టీవీకే అధికారంలోకి రావడాన్ని గమనిస్తే తెలంగాణలోనూ మెజారిటీ ప్రజలైన బీసీలు పోరాడితే 2029లో అధికారం దక్కడం ఖాయమని బీసీ పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు దన్నోజు అరవింద్ చారి బుధవారం రోజున ఒక ప్రకటనలో కనిపిస్తోందని పేర్కొన్నారు. కాంగ్రెస్, భాజపా, భరాస పార్టీలు సామాజిక న్యాయం పాటించడం లేదని, బీసీలను ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించడం లేదని పేర్కొన్నారు. జనగణనలో బీసీ కుల గణన చేయకుండా కేంద్రం అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. మహిళా బిల్లుల్లో బీసీలకు సబ్ కోటా పెట్టకుండా 40 కోట్ల మంది బీసీ మహిళలను భాజపా అవమానించిందని బిసి పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు దన్నోజు అరవింద్ అన్నారు

Read More »

అన్నదాతలకు అధైర్యం వద్దు

వనపర్తి అన్నదాతలు ఎవరు కూడా అధైర్య పడరాదని, వారు సాగుచేసిన వరి, మొక్కజొన్న పంటలను చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం శ్రీరంగాపూర్ , పెబ్బేరు మార్కెట్ యార్డులో PACS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్నదాతలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా వారు పండించిన పంటను కొనుగోలు కేంద్రాలలో విక్రయించవచ్చునని దళారుల మాటలు నమ్మే మోసపోకూడదు అని ఎమ్మెల్యే సూచించారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే అన్నదాతలకు ఎలాంటి సమస్యలు రానివ్వకుండా నిర్వాహకులు ప్రత్యేక దృష్టి దృష్టి సారించాలన్నారు.ధాన్యాన్ని విక్రయించిన అన్నదాతల పేర్లను వెంటనే నమోదు చేయాలని వారికి ధాన్యం విక్రయ సొమ్మును వెంటనే వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన వారికి సూచించారు. కార్యక్రమంలో పెబ్బేరు మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ సుమిత్ర ఎల్లారెడ్డి, పెబ్బేరు మార్కెట్ యార్డ్ అధ్యక్షురాలు ప్రమోదిని రెడ్డి, ఉపాధ్యక్షులు విజయవర్ధన్ రెడ్డి, కౌన్సిలర్లు, పెబ్బేరు మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారులు, శ్రీరంగాపురం మండల నాయకులు శ్రీహరి రాజు, అధికారులు తదితరులు పాల్గొన్నారు

అన్నదాతలకు అధైర్యం వద్దు Read More »

whatsapp image 2026 05 02 at 2.44.26 pm

పీఆర్సీ ఫిట్‌మెంట్‌పై జూన్‌ నాటికి నిర్ణయం

cfg vvvv vహైదరాబాద్‌, మే 2 (ఆంధ్ర జ్యోతి): ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి రెండో వేతన సవరణ సంఘం (పీఆర్సీ) ఫిట్‌మెంట్‌పై జూన్‌ నాటికి నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. తక్షణమే పీఆర్సీ నివేదిక అందించాలని అధికారుల కమిటీని ఆదేశించారు. శనివారం తన నివాసంలో ఉద్యోగ సంఘాల నాయకులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వమని, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను చాలా వరకు పరిష్కరించామన్నారు. ఒకటో తేదీనే జీతాలు ఇస్తున్నామని గుర్తు చేశారు. పీఆర్సీ సహా నాలుగు అంశాలపై స్పష్టత ఇచ్చిన సీఎం.. ఉద్యోగులకు ఆరోగ్య భద్రత కార్డులను జూన్‌ 1లోగా అందజేస్తామన్నారు. పదవీ విరమణ చేసిన

పీఆర్సీ ఫిట్‌మెంట్‌పై జూన్‌ నాటికి నిర్ణయం Read More »

ప్రజల నెత్తిన బిజెపి గ్యాస్ బండ.. తక్షణం ఉపసంహరించాలి: సిపిఐ

వనపర్తి వాణిజ్య సిలిండర్ ధరను రూ. 993 కు పెంచి వినియోగదారుల బిజెపి పాణిజ్య గ్యాస్ బండ వేసిందని సిపిఐ వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్ విమర్శించారు. శనివారం సిపిఐ ఆఫీస్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.‌ 19 కిలోల సిలిండర్ రూ. 2321 ఉండేదని ఏకంగా రూ. 993 పెంచడంతో రూ. 3315కు పెరిగిందన్నారు. ఒకేసారి సిలిండర్ పై ఇంత ధర పెంపు బిజెపి పాలనలోనే జరిగిందన్నారు. ఇది పరోక్షంగా ప్రజలపైనే భారం పడుతుందన్నారు. వాణిజ్య గ్యాస్ సిలిండర్ ఉపయోగించి హోటల్లు రెస్టారెంట్లు టీ దుకాణాల తినుబండారాలు తయారు చేస్తారని, గ్యాస్ ధరపించడంతో వాటి రేట్లు అమాంతం పెంచేసి అవకాశం ఉందన్నారు. వనపర్తి జిల్లాలో మామూలు హోటల్లో అధికంగా ఉంటాయని ఎక్కువమంది గ్యాస్ ను ఉపయోగిస్తారని వారు తయారు చేసే ఉత్పత్తులపై ధర పెంచుతారు అన్నారు. ఈ ధర రూ. 10 ఉందని అమాంతము 15కి పెరిగే అవకాశం ఉందన్నారు. టిఫిన్లు ధరలు రూ. 50 నుంచి 60 ఉన్నాయని రూ. 80 కి పెంచే అవకాశం ఉందన్నారు. తన ప్రాంతాలకు ప్రయాణాలు చేసేవారు ఆసుపత్రులకు వెళ్లేవారు అనివార్యంగా ఓటర్లు రెస్టారెంట్ లోనే భోజనం టిఫిన్ చేయాల్సి వస్తుందని వారందరిపై భారం పడుతుందన్నారు. బిజెపి చెప్పే మాటలకు చేతలకు పొంతనలేదన్నారు. పెంచటం లేదంటూనే ధరలు పెంచుతూ సామాన్యులను నడ్డి విరుస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే డీజిల్ పెట్రోల్ సరఫరా లో కేంద్ర విఫలమైందని వాడి ధరలు కూడా పెంచే ఆలోచనలో ఉందన్నారు. వంటగ్యాస్ సిలిండర్ ధర పెంపు కూడా ఎంతో దూరంలో లేదన్నారు. ధరలు పెంచమంటూనే పెంచి ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ప్రజలను సమీకరించి ప్రతిఘటించి తీరుతామన్నారు. పెంచిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను తక్షణం రూ. 2215 కు తగ్గించాలని డిమాండ్ చేశారు. సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి గోపాలకృష్ణ, సీనియర్ నేత పృథ్వినాదం, శేఖర్, వంశీ తదితరులు పాల్గొన్నారు.

ప్రజల నెత్తిన బిజెపి గ్యాస్ బండ.. తక్షణం ఉపసంహరించాలి: సిపిఐ Read More »

ప్రజా ప్రభుత్వానికి సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ల వంటివి

వనపర్తి ప్రజా ప్రభుత్వానికి సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ల వంటివని, రెండింటిని సమానంగా ముందుకు తీసుకుపోవడమే ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి పేర్కొన్నారు. శనివారం వనపర్తి పట్టణంలోని దాచా లక్ష్మయ్య ఫంక్షన్ హాల్ నందు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వనపర్తి నియోజకవర్గ స్థాయి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘా రెడ్డి, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరితోపాటు అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖీమ్య నాయక్, జెడ్పి సీఈవో యాదయ్య, వనపర్తి మున్సిపల్ చైర్ పర్సన్ మాధవి, పెబ్బేరు మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, వనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. కార్యక్రమానికి ముందుగా తెలంగాణ గీతాన్ని ఆలపించి, సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని చదివి వినిపించారు. అనంతరం వనపర్తి నియోజకవర్గం లో ప్రజా ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను లబ్ధి పొందుతున్న వారి వివరాలను తెలియజేసారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వనపర్తి నియోజకవర్గం లో ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు రుణ మాఫీ పథకం ద్వారా 29,455 మంది రైతులకు రూ. 201 కోట్ల లబ్ది చేకూర్చడం జరిగింది అన్నారు. రైతు భరోసా కింద 83,964 మంది రైతులకు రూ. 91 కోట్ల పెట్టుబడి సాయం అందించమన్నారు. 2025-26 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి 26,678 మంది రైతుల నుంచి ధాన్యం సేకరించి రూ. 286 కోట్లు వారి ఖాతాల్లో వేసినట్లు తెలిపారు. వనపర్తి నియోజకవర్గంలో 74,846 రేషన్ కార్డులు ఉండగా వాటిలో 35,837 కార్డులు ప్రజా ప్రభుత్వం లో కొత్తగా జారీ చేయడం జరిగిందన్నారు. నియోజకవర్గం లో 30,812 లబ్ధిదారులకు గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు అందించి కరెంటు బిల్లుల భారం తగ్గించిందాన్నారు. అదేవిధంగా నియోజకవర్గం లో మొత్తం 3978 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి సొంతం ఇంటి కల నెరవేర్చమన్నారు. కార్యక్రమం లో ఆర్డీవో సుబ్రహ్మణ్యం, వనపర్తి మున్సిపల్ వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, పెబ్బేరు మున్సిపల్ వైస్ చైర్మన్ సుమిత్ర, పెబ్బేరు మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ ప్రమోదిని, సిపిఓ హరికృష్ణ, డిఆర్డిఓ ఉమాదేవి, జిల్లా స్థాయి అధికారులు, కౌన్సిలర్లు ఇతర ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

ప్రజా ప్రభుత్వానికి సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ల వంటివి Read More »

చికాగో అమరుల స్ఫూర్తితో పని గంటలు తగ్గింపుకు పోరాడాలి : రమేష్

వనపర్తి చికాగో అమరుల స్ఫూర్తితో పని గంటలు తగ్గింపుకు, నాలుగు లేబర్ కోడెల రద్దుకు పోరాడాలని సిపిఐ వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్ పిలుపునిచ్చారు. గోపాల్‌పేట మండల కేంద్రం బస్టాండ్ లో 141 వ సిపిఐ మండల శాఖ నిర్వహించిన మేడే వారోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గతంలో కార్మికులను 18 నుంచి 20 గంటలు పని చేయించే వారన్నారు. 8 గంటలకు తగ్గించాలని కనీస వేతనం ఇవ్వాలన్న డిమాండ్తో చికాగోలో కార్మికులు ఉద్యమించారన్నారు. అమెరికా పాలకులు జరిపిన కాల్పుల్లో పలువురు కార్మికులు అమరులయ్యారని వారి పోరాట ఫలితంగా 8 గంటల పని దినం అమలులోకి వచ్చిందన్నారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం ఎనిమిది గంటలకు 12 గంటలకు పెంచి, నాటి అమరుల పోరాటాన్ని త్యాగాన్ని పరిహాసం చేసిందన్నారు. 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడులుగా విభజించి చట్టాలను నిర్వీర్యం చేసిందన్నారు. ఫలితంగా కార్మికులు సమ్మె చేసే హక్కు సంఘం పెట్టుకొని హక్కును కూడా కోల్పోయారన్నారు. బిజెపి ప్రభుత్వం కార్మిక ద్రోహి అని కార్మిక లోకం దీనికి వ్యతిరేకంగా లేబర్ కోడలు రద్దయ్యేదాకా పోరాటం సాగించాలన్నారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు జె చంద్రయ్య, సిపిఐ మండల కార్యదర్శి మంగలి శాంతన్న,పొలికెపాడు గ్రామ శాఖ కార్యదర్శి బుచ్చన్న, నేతలు కురుమూర్తి, అన్న స్వామి, నాగన్న, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.

చికాగో అమరుల స్ఫూర్తితో పని గంటలు తగ్గింపుకు పోరాడాలి : రమేష్ Read More »

చికాగో అమరుల త్యాగాలను పరిహాసం చేస్తున్న కేంద్రం: సిపిఐ

వనపర్తి అమెరికా చికాగో లో కార్మిక అమరుల ప్రాణత్యాగంతో సాధించుకున్న 8 గంటల పని దినాన్ని 12 గంటలకు పెంచి కేంద్ర బిజెపి ప్రభుత్వం పరిహాసం చేస్తోందని బుద్ధి చెప్పాలని కార్మికలోకానికి సిపిఐ జిల్లా కార్యదర్శి విజయరాములు, వనపర్తి నియోజకవర్గకార్యదర్శి రమేష్ పిలుపునిచ్చారు. వనపర్తిలో సిపిఐ ఏఐటియుసి ఆధ్వర్యంలో 141 వ మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. కర్రెమ్మ గుడి, పార్టీ ఆఫీస్, అంబేద్కర్ చౌక్, రాజీవ్ చౌక్, టీచర్స్ కాలనీ చౌరస్తాలో సిపిఐ ఆధ్వర్యంలో విజయ రాములు, కళావతమ్మ, చంద్రయ్య, పృథ్వి నాదం, ఎర్ర కురుమయ్య ఎర్రజెండాలను ఆవిష్కరించగా స్నేహ ఫుట్పాత్ సెంటర్, జిల్లా ఆస్పత్రి, మెడికల్ కాలేజ్ వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శాంతన్న, శ్రీను ఏఐటీయూసీ అరుణ పతాకాలను ఆవిష్కరించారు. 18 గంటల పరిధినాన్ని తగ్గించాలని, కనీస వేతనం ఇవ్వాలని అమెరికా చికాగో నగరంలో లక్షలాది మంది కార్మికులు ఉద్యమించారన్నారు. పాలకులు జరిపిన కాల్పుల్లో చాలామంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారన్నారు. అందులో ఒక కార్మికుడు తన శరీరం నుంచి కారుతున్న రక్తంలో తన అంగీని తడిపి ఎగరవేశారని అదే నేడు ఎర్రజెండాగా ప్రపంచ కార్మికులకు కష్టజీవులకు అండగా ఉండి పోరాడు పొందన్నారు. అమరుల పోరాట ఫలితంగా ఎనిమిది గంటల పని దినం ప్రపంచవ్యాప్తంగా అమలవుతుండగా భారత దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలను లేబర్ కోడలుగా మార్చి పని దినం 12 గంటలకు పెంచటం దుర్మార్గమన్నారు. కార్మికుల శ్రమను సంపన్నులకు దోచి పెట్టేందుకే నరేంద్ర మోడీ 12 గంటల పని దినం చేశారని వ్యతిరేకంగా పోరాడాలి అన్నారు. స్వాతంత్ర కాలం నుంచి సాధించుకున్న 44 చట్టాలను నాలుగు లేబర్ కోడలుగా విభజించి వేతనం కోసం పోరాడే హక్కు, సంగం పెట్టుకునే హక్కు లేకుండా చేసిన నరేంద్ర మోడీ దుర్మార్గం ప్రభుత్వానికి కార్మికుల ఐక్యమై బుద్ధి చెప్పాలన్నారు. కార్మికులు సంఘటితంగా పోరాడితేనే వారి హక్కులు దక్కుతాయి అన్నారు. సిపిఐ, ఏఐటీయూసీ ఎర్రజెండాల కింద ప్రజలు కార్మికులు ఏకమై పోరాడాలని కోరారు. సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి రమేష్, సీనియర్ నేత కళావతమ్మ,సిపిఐ, ఏఐటీయూసీ, ఎన్ఎఫ్ఐ డబ్ల్యు, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, డిహెచ్పిఎస్ నేతలు చంద్రయ్య పృథ్వి నాదం గోపాలకృష్ణ ఎర్రకుర్మయ్య శేఖర్ మహేష్ వెంకటయ్య విష్ణు అశోక్ లక్ష్మీనారాయణ రాంబాబు శిరీష జ్యోతి సాయి లీల వంశీ రూప నరేష్ స్వామి శ్రీను నరసింహ శాంతయ్య నరేందర్ లక్ష్మి రాజేష్ శ్రీకాంత్ జలాల్ తదితరులు పాల్గొన్నారు.

చికాగో అమరుల త్యాగాలను పరిహాసం చేస్తున్న కేంద్రం: సిపిఐ Read More »

Scroll to Top