మల్లయ్య దేవుడి పండగ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వనపర్తి పెబ్బేరు మండలం కంచిరావుపల్లి గ్రామంలో గురువారం ప్రారంభమైన మల్లయ్య దేవుడి పండగల కార్యక్రమంలో వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మల్లయ్య ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. గ్రామాల్లో నిర్వహించుకునే ఇలాంటి పండగల ద్వారా గ్రామస్తుల మధ్య ఐక్యత నెలకొంటుందని, ఇలాంటి పండుగలు జరుపుకోవడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో పెబ్బేరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యాపర్ల రాంరెడ్డి, గ్రామ సర్పంచ్ అరుణ జయపాల్ రెడ్డి, గ్రామ వార్డు సభ్యులు గ్రామ పెద్దలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
Uncategorized
పెబ్బేరులో ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాలను ఏర్పాటు చేయాలంటూ వినతి వనపర్తి పెబ్బేరు పట్టణంలో ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ విగ్రహాలను ఏర్పాటు చేయాలని కోరుతూ మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్, పెబ్బేరు మండల అధ్యక్షులు యాపల రాంరెడ్డి గారు గురువారం వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి, వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శివసేన రెడ్డికి వినతి పత్రాన్ని సమర్పించారు. గురువారం పెబ్బేరు మండలం గుమ్మడం గ్రామంలో పలు కార్యక్రమాలలో పాల్గొనే నిమిత్తం వచ్చిన వారికి వారు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రాంరెడ్డి, సురేందర్ గౌడ్, గంధం రంజిత్ కుమార్ భాను ప్రకాష్ స్థానిక కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు
హాక విత్తనాలు ఎరువుల దుకాణాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వనపర్తి వనపర్తి పట్టణంలోని అంబేద్కర్ కూడలి సమీపంలో 6వ వార్డుకు చెందిన యువకుడు కురుమూర్తి ఏర్పాటు చేసుకున్న హాక విత్తనాలు ఎరువుల దుకాణాన్ని గురువారం వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి , జిల్లా అధ్యక్షులు శివసేనరెడ్డి ప్రారంభించారు. వ్యాపార ధోరణిలో అన్నదాతలకు అధిక ధరలకు కాకుండా వారి అవసరానికి తగ్గట్లుగా అన్ని విత్తనాలు ఎరువులు మందులను అందుబాటులో ఉంచి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని యువకుడు కురుమూర్తికి వారు సూచించారు. యువకులు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూనే ఉపాధి అవకాశాలపై దృష్టి సారించి ఇలాంటి వాటిని ఏర్పాటు చేసుకుంటే భవిష్యత్తు బాగుంటుందని వారి పేర్కొన్నారు. కార్యక్రమంలో వనపర్తి మున్సిపల్ చైర్మన్ మాధవి రమేష్, వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, వనపర్తి ఎంపీపీ కిచ్చారెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పట్టణ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు
మహిళా రైతులను ఓదార్చి అధైర్య పడొద్దు అండగా ఉంటాం వనపర్తి మహిళా రైతులను ఓదార్చి అధైర్య పడొద్దు అండగా ఉంటాంఅని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి భరోసా ఇచ్చారు. పెబ్బేర్ మండలంలో గుమ్మడం,పాత సుగూరు,రంగాపురం,పెబ్బేరు గ్రామాలలో పర్యటించి తడిసిన,మొలకెత్తిన ధాన్యాన్ని పరిశీలించి రైతులను ఓదార్చి అధైర్య పడొద్దు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కాలములో యూరియా లేక,కరెంట్ సరఫరా లేక,రైతు భరోసా లేకున్నా ఓర్చుకొని ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు కొనుగోలు లేక పడిగాపులు కాస్తూ రైతులు విలవిలాడుతున్నారని నిరంజన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.అష్టకష్టాలు పడి ధాన్యం తరలిస్తే క్వింటాలుకు 10కిలోల తరుగు తీస్తూ రైతులను జలగల లాగ పీడిస్తున్నారని నిరంజన్ రెడ్డి దుయ్యబట్టారు. వెంటనే తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేసి వారంలోపల రైతులను ప్రభుత్వం ఆదుకోకపోతే రైతుల పక్షాన పోరాడుతాము నిరంజన్ రెడ్డి హెచ్చరించారు.నిరంజన్ రెడ్డి గారి వెంట వనం.రాములు,కర్రీస్వామి,దిలీప్ రెడ్డి,అఖిల్ చారి, పెద్దింటి.వెంకటేష్,జగన్నాథం నాయుడు,ఎం.రాజశేఖర్,కృష్ణా రెడ్డి,ఎద్దుల సాయి కుమార్,ఎల్లారెడ్డి,గోవిందు నాయుడు మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు ఉన్నారు.
సవాయిగూడెంలో రూ. 4 కోట్లతో సోలార్ ప్లాంట్ ఏర్పాటు వనపర్తి ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించిన మహిళా వారోత్సవాల సందర్భంగా వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి వనపర్తి మండలం సవాయిగూడెం గ్రామంలో రూ. 4 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తున్న సోలార్ ప్లాంట్ పనులను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా అభ్యున్నతి కోసం తెలంగాణ రాష్ట్ర సర్కార్ ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. వనపర్తి జిల్లాలో మొదటగా వనపర్తి మండలంలోని సవాయిగూడెం మరియు ఆత్మకూరు మండలాలకు ఈ సోలార్ ప్లాంట్లను ప్రభుత్వం మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు మహిళా సాధికారత కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను చేపట్టిందని వడ్డీ లేని రుణాలను, ఆర్టీసీ బస్సులకు ఓనర్లను, అమ్మ ఆదర్శ పాఠశాలకు చైర్మన్గా, డీజిల్ బంకులకు ఓనర్లుగా, పాఠశాల విద్యార్థులకు బట్టలు కుట్టి వారిగా, పాఠశాలలో వంటలు చేసేవారిగా, క్యాంటీన్ నడిపేవారీగా, మహిళల పేరుపై రైసుమిల్ల ఏర్పాటు, గోదాంల నిర్మాణం, ఇలాంటి అనేక కార్యక్రమాలను చేపట్టి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. రెండేళ్ల కాలంలో ఇచ్చిన హామీలే కాకుండా కొత్త హామీలను కూడా అమలు చేశామని మిగతా హామీలు కూడా వెంటనే నెరవేరుస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పదేళ్లు పాలనలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ సొంత బిడ్డను ఇంటిలో నుంచి తరిమేసే పరిస్థితి ఉందని అలాంటివారు రాష్ట్ర లోని మహిళలు అభివృద్ధిని ఎందుకు కోరుకుంటారు అని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం మహిళా సాధికారత కోసం ఎన్నో చేస్తుందని రానున్న కాలంలోనూ కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ దీవించాలని కోరారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ కిమ్యా నాయక్, డిఆర్డిఓ ఉమాదేవి, మండల మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డి, అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, మైనార్టీ నాయకులు రహీం, గ్రామాల సర్పంచులు మహిళా సంఘం సభ్యురాలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
తడిసి, మోలికెత్తిన ధాన్యాన్ని చూసి చలించిపోయిన మాజీ మంత్రి వనపర్తి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వర్షాలకు తడిసిన ధాన్యాన్ని పరిశీలిస్తూ పెద్దమందడి,ఘనపూర్ మండలాల్లో పలు గ్రామాలలో ఐ.కె.పి సెంటర్స్,సింగిల్ విండో సెంటర్స్,మిగతా కొనుగోలు కేంద్రాలలో విస్తృతంగా పర్యటించి తడిసిన,మొలకెత్తిన ధాన్యాన్ని చూసి రైతులు పడుతున్న హరిగోస చూసి చలించిపోయిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి రైతులను ఓదార్చి దైర్యం చెప్పారు. రాష్టములో 5లక్షల 42వేల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిందని ప్రభుత్వం 90లక్షల ధాన్యం సేకరణ చేస్తున్నామని చెప్పి అందులో కూడా 40శాతం కొనుగోలు చేయలేదని విమర్శించారు. ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీల నిర్లక్ష్యం వైఫల్యం వల్ల రైతులు ధాన్యాన్ని అమ్మడానికి నెలలు నెలలుగా పడిగాపులు పడుతున్నారని రైతుల దీనస్థితి చూస్తే కడుపు తరుక్కు పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలలో విస్తృతంగా పర్యటించి రైతుల సాధకబాధకలను తెలుసుకున్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కలెక్టర్ కి ఫోన్ లో మాట్లాడుతూ రైతుల అగచాట్లు హరిగోస వర్ణనాతీతం అని వెంటనే స్పందించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు వేదికలను ఉపయోగించుకొని అందులో ధాన్యాన్ని నిలువచేసే అవకాశాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. లారీలు, ట్రక్కులు లేని వారికి ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీలు ఇచ్చారు అని విచారణ చేసి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తడిసిన,మొలకెత్తిన ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. మాజీ మంత్రి వెంట జిల్లా రైతు సమితి మాజీ అధ్యక్షులు జగదీశ్వర్ రెడ్డి,జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్,మాజీ ఎం.పి.పి కృష్ణా నాయక్,మండల పార్టీ అధ్యక్షుడు రాళ్ల.కృష్ణయ్య,మన్నే గౌడ్,పులిందర్, పీన్య నాయక్,ప్రతాప్,శివ,లక్మన్,మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు ఉన్నారు.
తాటిపాముల హరిజన చిన్న కూర్మన్న కుటుంబంకి శుభాకాంక్షలు వనపర్తి అరవై ఏళ్ల కుర్మన్న జీవన ప్రయాణం వారి భాంధువులకు, కుతురులకు ఆదర్శం, స్ఫూర్తి కష్టసుఖాలను సమానంగా స్వీకరించి ధైర్యంగా నిలిచిన చిన్న కుర్మన్న దంపతులకు అభినందనలు శంకర్ గౌడ్ తెలిపారు. కుటుంబం కోసం పంచిన ప్రేమ, చూపిన ఆప్యాయత వెలకట్టలేనివి.ముగ్గురు కుతురుల కోసం కుటుంబం కోసం పడిన శ్రమ, చేసిన త్యాగం మరువలేనిది.మీ మాటల్లోని నిజాయితీ, చేతల్లోని నిబద్ధత ఎంధరికో పాఠాలు.పిల్లలను తీర్చిదిద్ది, ఉన్నత శిఖరాలకు చేర్చిన మీకు అభినందనలు. ఇప్పుడు మనవళ్లతో, మనవరాళ్లతో ఆడుతూ పాడుతూ ఆనందించే సమయం. ఆయురారోగ్యాలతో, మనశ్శాంతితో మీ దినదినం గడవాలి. బంధుమిత్రుల మధ్య, ఆత్మీయుల నడుమ మీ జీవితం వెలగాలి. రాగద్వేషాలు లేని ప్రశాంత జీవనం మీకు దక్కాలి. వెంకటేశ్వర స్వామి కృప, ఆ లక్ష్మీదేవి కరుణ మీపై ఉండాలి. మీ అనుభవాల వెలుగు ముంధు తరానికి దారి చూపాలి. ఈ శుభ సమయంలో మీ కుటుంబ సభ్యులకు కూడా అభినందనలు షష్టిపూర్తి మహోత్సవం కన్నుల పండుగగా జరిపినా మీ కుమార్తెలు ,చిటిమ్మ,భాలేశ్వరమ్మ, బాలకిష్టమ్మ, అలివేళ, మంజుల,శాంతమ్మ లకు శంకర్ గౌడ్ అభినందనలూ తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు గోవింద్, బోయ శ్రీను, ప్రకాష్,విష్ణు, చక్రవర్తి, చాంద్ , లక్ష్మయ్య పాల్గొన్నారు
ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్ట్లను వేగవంతంగా పూర్తి చేస్తాం: మంత్రి జూపల్లి వనపర్తి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు పూర్తి చేసి ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లాకు తాగు నీరు ఇచ్చేందుకు జూన్, మొదటి వారంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లా సందర్శించి సమీక్షించనున్న నేపథ్యంలో మంగళవారం రాష్ట్ర ఆబ్కారీ, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఏదుల రిజర్వాయర్ ను సందర్శించి పరిశీలించారు.వనపర్తి జిల్లా శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి, నాగర్ కర్నూల్ శాసన సభ్యులు కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి, అచ్చంపేట శాసన సభ్యులు వంశీకృష్ణ తో కలిసి ఎదుల రిజర్వాయర్ పంప్ హౌజ్ ను సందర్శించి ప్రస్తుత స్థితిగతులు, పూర్తి అయిన పనులను ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. రిజర్వాయర్ గురించి ఇరిగేషన్ ఎస్. ఈ పార్థసారథి వివరిస్తూ (5) స్టేజిలలో డిజైన్ చేసిన ఈ ప్రాజెక్టు శ్రీశైలం ప్రాజెక్టు పారుతున్న నీటిని ఎత్తిపోతల ద్వారా నార్లపూర్ (అంజనగిరి) రిజర్వాయర్ లో నింపి అక్కడి నుండి ఎత్తిపోసి 6.55 టి.యం.సి. ల నీటి సామర్థ్యంతో నిర్మించిన ఎదుల రిజర్వాయర్ నింపడం జరుగుతుందన్నారు. ఎదుల రిజర్వాయర్ నుండి వట్టేం, ఉదండపూర్, కే.పి. లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ల ద్వారా ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు సాగు, తాగు నీరు అందించడం జరుగుతుందన్నారు. ఎదుల సర్జిపుల్ నుండి 134 మీటర్ల ఎత్తున ఉన్న రిజర్వాయర్ నింపడానికి 10 మోటార్లు ఏర్పాటు చేయడం జరిగిందని, రోజుకు రెండు టి.యం.సి ల నీటిని ఎత్తిపోసేందుకు ఒక్కో పంపు 1.45 మెగావాట్ల సామర్థ్యం కలిగి ఉన్నట్లు తెలిపారు. సంవత్సరంలో 45 రోజుల పాటు 90 టి.యం.సి ల నీటిని ఎత్తిపోసేందుకు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం జరిగిందని వివరించారు. మోటారు పంపుల సామర్థ్యం, వాటి ధర, మన్నిక తదితర విషయాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టులన్నింటినీ వేగవంతంగా చేయడానికి, సమస్యల పరిష్కారం, అవాంతరాలను తొలగించడానికి ప్రాజెక్ట్ లను సందర్శించినట్లు చెప్పారు. మంత్రి వెంట వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, వనపర్తి జిల్లా ఎస్పీ సునితా రెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ సంగ్రాం సింగ్ పాటిల్, ఇరిగేషన్ ఎస్.ఈ పార్థసారథి, కార్యనిర్వహక ఇంజనీర్లు అమర్ సింగ్, రవీందర్, శ్రీనివాస్, వనపర్తి ఆర్డీఓ సుబ్రమణ్యం, కొల్లాపూర్ ఆర్డీఓ బన్సిలాల్ తదితరులు ఉన్నారు.
రాబందుల రాజ్యం మనకొద్దు ఎమ్మెల్యే మేఘారెడ్డి వనపర్తి డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ కేంద్ర బిజెపి సర్కార్ మొదటి భోగిలో మోదీ రెండో భోగిలో ఆదాని అంబానీ లాంటి వారు ప్రయాణిస్తూ దేశాన్ని రాబందుల పిక్కుతింటున్నారని ఈ డబల్ ఇంజన్ సర్కారుకు చరమగీతం పాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు మంగళవారం ఎమ్మెల్యే మేఘారెడ్డి, శివసేనరెడ్డి లు వనపర్తి లో ఎద్దుల బండ్లతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం ఇంధనంపై పెంచిన రేట్లు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. గంటలు మోగిస్తే చప్పట్లు కొట్టినంత మాత్రాన నిరుపేదల సమస్యలు తీరవని, ప్రజలకు అధిక భారం లేకుండా చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం అధిక ధరలను పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని విమర్శించారు. భారతీయ జనతా పార్టీ నాయకులు వనపర్తి లో ధర్నాలు చేయడం సరికాదని బాధ్యత యుతంగా వ్యవహరించి మోడీ ఇంటి ముందల ధర్నాలు చేసి రాష్ట్రానికి ఏదైనా మేలు చేస్తే బాగుంటుందని ఆయన అన్నారు. మాయమాటలు చెప్పే అధికారులకు వచ్చిన మోడీ సర్కార్ ఇప్పటికే మూడు పర్యాయాలు ఏడున్నర రూపాయలను పెట్రోల్ డీజిల్ పై పెంచిందని పేర్కొన్నారు. మోడీ సర్కార్ ఇంధనం ధరలను వెంటనే తగ్గించకపోతే జిల్లా మండల గ్రామస్థాయిలోని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టి మెడలు వంచాల్సి వస్తుంది అన్నారు. టిఆర్ఎస్ బిజెపి పార్టీలు మంచి దోస్తాన్ మైంటైన్ చేస్తున్నాయని వారి కార్యకలాపాలు నిరసిస్తూ మనం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుందని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు. దేశంలోని 19 రాష్ట్రాలలో బిజెపి ప్రభుత్వమే ఉందని మరి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం న్యాయం చేయడం లేదంటూ నిలదీశారు. వడ్ల కొనుగోలు నీతులు చెప్పే నాయకులు వడ్ల కష్టాలు పెంచడానికి మీరు పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలు వాస్తవం కాదా అన్నారు. ఎఫ్ సి ఐ లకు, గోదాములకు సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టకపోగా పైపెచ్చు ఇలాంటి మాటలు మాట్లాడడం సరికాదన్నారు. వారి నిరంకుష పాలనను నిరసిస్తూ అవసరమైతే ఢిల్లీ వరకు వెళ్లి నరేంద్ర మోడీ సర్కార్ను ముట్టడించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి అనే ఇంజన్ ప్రభుత్వాన్ని కొనసాగిస్తుందని రానున్న రోజుల్లో కేంద్రంలోనూ రాహుల్ గాంధీ మరో ఇంజన్ గా మారతారని ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, వనపర్తి మున్సిపల్ చైర్మన్ మాధవి రమేష్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వాకిటి ఆదిత్య, మున్సిపల్ కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, మున్సిపల్ మాజీ చైర్మన్లు, వనపర్తి నియోజకవర్గం పరిధిలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పెద్దయించిన పాల్గొన్నారు
వివాహ కార్యక్రమానికి హాజరై మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వనపర్తి పానగల్ మండలంలో వనపర్తి మండలం చందాపూర్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు మద్దిలేటి – చిట్టెమ్మ గార్ల కుమార్తె నికిత – విజయ్ ల వివాహ కార్యక్రమం ఆనందోత్సాహాల నడుమ ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరై నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వధూవరులు సుఖశాంతులతో, ఆనందంగా, ఐశ్వర్యాలతో నిండిన దాంపత్య జీవితం గడపాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వెంట చందాపూర్ గ్రామ సర్పంచ్ మహేందర్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మల్లయ్య. సత్యనారాయణ. కృష్ణయ్య. నరేందర్. మల్లయ్య,స్థానిక నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.