తిరుమలయ్య గుట్టను పర్యటక కేంద్రం చేయాలి
వనపర్తి
తిరుమలయ్య గుట్టను పర్యటక కేంద్రం చేయాలని అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ తెలిపారు. వచ్చేనెల వనపర్తి వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే మెగా రెడ్డి కు తిరుమలయ్య కొండకు ఐదు కోట్ల కేటాయించి పర్యాటక కేంద్రం చేయాలని తెలిపారు. వనపర్తి పట్టణంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయానికి రెండు కోట్లు కేటాయించిన ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే చేత్తో తిరుమలయ్య గుట్టకు కూడా ఐదు కోట్ల నుండి 10 కోట్ల వరకు కేటాయిస్తే వనపర్తి జిల్లాలోని ఒక అపురూపమైన ‘తిరుమల’ ఏర్పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు వెంకటేశ్వర్లు, టిడిపి నాయకులు కొత్త గొల్ల శంకర్, టిఆర్ఎస్ నాయకులు ప్రేమ్ నాథ్ రెడ్డి, అఓపా సంగం నాయకులు శ్రీనివాసులు, వెంకటేశ్వర్ రెడ్డి, చందు యాదవ్, బాలరాజు, మరియు భక్తులు, ఆర్యవైశ్య సంఘం నాయకులు పాల్గొన్నారు.
