పుట్టు చీర కార్యక్రమానికి హాజరై చిన్నారిని అక్షింతలు వేసి ఆశీర్వదించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
వనపర్తి
కొత్తకోటలోని ఆర్కే గార్డెన్లో శ్రీమతి మాలతి నరసింహ రెడ్డి గార్ల ఆహ్వానం మేరకు నిర్వహించిన పుట్టు చీర కార్యక్రమానికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారికి అక్షింతలు వేసి ఆశీర్వదించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చిన్నారి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, విద్యా విజ్ఞానాలతో ఉన్నత స్థాయికి ఎదిగి కుటుంబానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అనంతరం కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసి ఆత్మీయంగా ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు, నాయకులు, కార్యకర్తలు, ఆహ్వానితులు తదితరులు పాల్గొన్నారు
