కొంకనువానిపల్లి పాఠశాలను అప్గ్రేడ్ చేయాలి
వనపర్తి
అమరచింత మండలం కొంకన్వాని పల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను అప్గ్రేడ్ చేయాలని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎండి కుతుబ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఐదవ తరగతి నుండి ఏడో తరగతి వరకు పెంచాలని బుధవారం పాఠశాల ముందు విద్యార్థులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ పాఠశాలను అప్డేట్ చేస్తానని మంత్రి వాకిటి శ్రీహరి ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని లేనిపక్షంలో ఆందోళన చేపడుతామని కుతుబ్ హెచ్చరించారు.
