సామూహిక కార్మికుల పండగలలో పాలుపంచుకుంటే ఆత్మసంతృప్తి మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి
వనపర్తి
పట్టణ తోపుడు బండ్ల సంఘం ప్రతి ఏటా నిర్వహించే “కోట మైసమ్మ పండుగకు”అనవాయితీ ప్రకారం మాజీ ఎంపి రావుల చంద్రశేఖర్ రెడ్డి 10వేల ఆర్థిక సహకారం జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ ద్వారా అందజేశారు. రావుల.చంద్రశేఖర్ రెడ్డి కార్మికులతో ఫోన్ లో మాట్లాడుతూ గ్రామ దేవతల్ని ప్రతి సంవత్సరం ఆరాధించడం వల్ల కార్మిక కుటుంబాలతో పాటు పట్టణ ప్రజలు సుభిక్షంగా ఉంటారని అభిప్రాయపడ్డారు. ఈ పండుగలు కార్మికుల మధ్య ఐక్యత,స్నేహభావం పెరుగుతాయని అన్నారు. ఈ కార్యక్రమములో తోపుడు బండ్ల సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నాగశేషన్న,రాఘవేంద్ర మరియు రాములు,మల్లయ్య కార్మికులు ఉన్నారు
