వనపర్తి
ఘనపూర్ మండలం పర్వతాపూర్ గ్రామానికి చెందిన అశోక్ చారి ఇటీవల ప్రమాదానికి గురై శస్త్రచికిత్స చేయించుకోవడం జరిగింది అశోక్ చారిని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకొన్నారు అనంతరం వైద్యులకు మెరుగైన వైద్యం అందించాలని ఫోన్ ద్వారా సూచించారు. మాజీ మంత్రి వెంట నందిమల్ల అశోక్,మాజీ సర్పంచ్ నిర్మలమ్మ,కౌన్సిలర్ శ్రీకర్ గౌడ్,సయ్యద్.జమీల్,నాగన్న యాదవ్,మహేశ్వర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
