భూ తగాదాలను కోర్టుల ద్వారానే పరిష్కరించుకోవాలి : జిల్లా ఎస్పీ సునిత రెడ్డి
వనపర్తి
భూ వివాదాలకు సంబంధించిన సమస్యలు న్యాయస్థానాల ద్వారానే పరిష్కరించుకోవాలని శాంతిభద్రతలకు విఘాతం కలిగించే పరిస్థితులు తలెత్తితే వెంటనే పోలీసులను ఆశ్రయించాలి. ప్రజలకు న్యాయం, భద్రత, విశ్వాసం కల్పించడమే జిల్లా పోలీసు శాఖ లక్ష్యం” అని జిల్లా ఎస్పీ సునిత రెడ్డి తెలిపారు. ప్రతి సోమవారం వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయములో నిర్వహించే ప్రజావాణిలో భాగంగా జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి 22మంది పిర్యాదుదారులు వివిధ సమస్యలపై నేరుగా జిల్లా అదనపు ఎస్పీ శ్రీమతి సునిత రెడ్డి కి ఫిర్యాదులు అందించార ఫిర్యాదు చేసిన ప్రతి ఫిర్యాదుపై ఎస్పీ వెంటనే స్పందించి స్వయంగా ఫిర్యాదును పరిశీలించి సంబంధిత పోలీస్టేషన్ అధికారులకు తక్షణమే సదరు ఫిర్యాదులపై చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని అదేశాలు జారీ చేశారు.
