పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
వనపర్తి
శ్రీరంగాపురం మండలం వెంకటాపురం గ్రామంలో సోమవారం నిర్వహించిన పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి తన వంతుగా రూ 3 లక్షల రూపాయలను విరాళంగా అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో నిర్వహించే ఎటువంటి పండుగలు గ్రామ ఐక్యతను చాటి చెబుతాయని ఇలాంటి పండుగలను పాల్గొనడం సంతోషి దాకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో పెబ్బేరు, శ్రీరంగాపురం మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు ఆలయ కమిటీ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు
