సురవరం ప్రతాప్ రెడ్డి జీవితం సమాజానికి స్ఫూర్తిదాయకం
వనపర్తి
వనపర్తి మొట్టమొదటి ఎమ్మెల్యే సురవరం ప్రతాప్ రెడ్డి 130 జయంతి ఉత్సవాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా,వైభవంగా నిర్వహిస్తున్నామని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా జయంతి ఆహ్వాన పత్రిక ఆవిష్కరించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ సురవరం గారి జీవితం సమాజానికి స్ఫూర్తిదాయకం అని అదొక చరిత్ర అని భావితరాలు ఆ తెలంగాణ వైతాళికుడు బహుముఖ ప్రజ్ఞా శాలి జీవిత విశేషాలు తెలుసుకోవలసిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. విద్యావేత్తలు,సాహితీవేత్తలు,మేధావులు,ప్రజా సంఘాలు,వివిధ పార్టీల శ్రేణులు,కవులు,కళాకారులు,సామాజిక విశ్లేషకులు ప్రత్యేకంగా పాల్గొని విజయవంతం చేయాలి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమములో డాక్టర్.వీరయ్య,శంకర్ గౌడ్,తిరుమలేశ్,పార్టీ నాయకులు పాల్గొన్నారు.
