వనపర్తి
ఇటీవల మరణించిన జానీమియా కుటుంబసభ్యులను గౌరవ రావుల చంద్రశేఖరరెడ్డి పరమార్శించినారు. ఈ సందర్భంగా రావుల జానీమియా గారి సతీమణి రహీమున్నిసా బేగం గారితో మాట్లాడుతూ జానీ బాయ్ నాకు అత్యంత ఆప్తుడు,సన్నిహితుడని వారు లేనిలోటు తీర్చలేనిదని అన్నారు. ఎప్పుడు ఏమి అవసరం ఉన్నా తాను తోడుగా ఉంటానని భరోసా ఇచ్చారు. చింతకుంట. ఆంజనేయులును పరామర్శించిన రావుల. రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స తీసుకొని విశ్రాంతి తీసుకుంటున్న చింతకుంట.ఆంజనేయులు మరియు చింతకుంట.శ్రీనివాసులు గార్లను వారి ఇంటి దగ్గర పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకొని ఆర్థిక సహాయం అందజేశారు. రావుల వెంట నందిమల్ల అశోక్,సయ్యద్. జెమిల్,నందిమల్ల.రమేష్,ముద్దుసార్ ,మోహన్,సంపత్ తదితరులు ఉన్నారు.
