వివాహ కార్యక్రమానికి హాజరై మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
వనపర్తి
పానగల్ మండలంలో వనపర్తి మండలం చందాపూర్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు మద్దిలేటి – చిట్టెమ్మ గార్ల కుమార్తె నికిత – విజయ్ ల వివాహ కార్యక్రమం ఆనందోత్సాహాల నడుమ ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరై నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వధూవరులు సుఖశాంతులతో, ఆనందంగా, ఐశ్వర్యాలతో నిండిన దాంపత్య జీవితం గడపాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వెంట చందాపూర్ గ్రామ సర్పంచ్ మహేందర్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మల్లయ్య. సత్యనారాయణ. కృష్ణయ్య. నరేందర్. మల్లయ్య,స్థానిక నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
