వివాహ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
వనపర్తి
వనపర్తి మండలం రాజపేట పాపే తండాకు చెందిన, వశరాం కుమారుడు కాట్రావత్ సురేష్ – మనీష ల వివాహ కార్యక్రమం ఆనందోత్సాహాల నడుమ ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరై నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వధూవరులు సుఖశాంతులతో, ఆనందంగా, ఐశ్వర్యాలతో నిండిన దాంపత్య జీవితం గడపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో, నాయకులు మాధవరెడ్డి, సర్పంచ్ ఎల్లయ్య, స్థానిక నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
