VETA NEWS MEDIA

2026-06-18
Offcanvas
Edit Template

చికాగో అమరుల స్ఫూర్తితో పని గంటలు తగ్గింపుకు పోరాడాలి : రమేష్

వనపర్తి చికాగో అమరుల స్ఫూర్తితో పని గంటలు తగ్గింపుకు, నాలుగు లేబర్ కోడెల రద్దుకు పోరాడాలని సిపిఐ వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్ పిలుపునిచ్చారు. గోపాల్‌పేట మండల కేంద్రం బస్టాండ్ లో 141 వ సిపిఐ మండల శాఖ నిర్వహించిన మేడే వారోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గతంలో కార్మికులను 18 నుంచి 20 గంటలు పని చేయించే వారన్నారు. 8 గంటలకు తగ్గించాలని కనీస వేతనం ఇవ్వాలన్న డిమాండ్తో చికాగోలో కార్మికులు ఉద్యమించారన్నారు. అమెరికా పాలకులు జరిపిన కాల్పుల్లో పలువురు కార్మికులు అమరులయ్యారని వారి పోరాట ఫలితంగా 8 గంటల పని దినం అమలులోకి వచ్చిందన్నారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం ఎనిమిది గంటలకు 12 గంటలకు పెంచి, నాటి అమరుల పోరాటాన్ని త్యాగాన్ని పరిహాసం చేసిందన్నారు. 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడులుగా విభజించి చట్టాలను నిర్వీర్యం చేసిందన్నారు. ఫలితంగా కార్మికులు సమ్మె చేసే హక్కు సంఘం పెట్టుకొని హక్కును కూడా కోల్పోయారన్నారు. బిజెపి ప్రభుత్వం కార్మిక ద్రోహి అని కార్మిక లోకం దీనికి వ్యతిరేకంగా లేబర్ కోడలు రద్దయ్యేదాకా పోరాటం సాగించాలన్నారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు జె చంద్రయ్య, సిపిఐ మండల కార్యదర్శి మంగలి శాంతన్న,పొలికెపాడు గ్రామ శాఖ కార్యదర్శి బుచ్చన్న, నేతలు కురుమూర్తి, అన్న స్వామి, నాగన్న, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.

చికాగో అమరుల స్ఫూర్తితో పని గంటలు తగ్గింపుకు పోరాడాలి : రమేష్ Read More »

చికాగో అమరుల త్యాగాలను పరిహాసం చేస్తున్న కేంద్రం: సిపిఐ

వనపర్తి అమెరికా చికాగో లో కార్మిక అమరుల ప్రాణత్యాగంతో సాధించుకున్న 8 గంటల పని దినాన్ని 12 గంటలకు పెంచి కేంద్ర బిజెపి ప్రభుత్వం పరిహాసం చేస్తోందని బుద్ధి చెప్పాలని కార్మికలోకానికి సిపిఐ జిల్లా కార్యదర్శి విజయరాములు, వనపర్తి నియోజకవర్గకార్యదర్శి రమేష్ పిలుపునిచ్చారు. వనపర్తిలో సిపిఐ ఏఐటియుసి ఆధ్వర్యంలో 141 వ మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. కర్రెమ్మ గుడి, పార్టీ ఆఫీస్, అంబేద్కర్ చౌక్, రాజీవ్ చౌక్, టీచర్స్ కాలనీ చౌరస్తాలో సిపిఐ ఆధ్వర్యంలో విజయ రాములు, కళావతమ్మ, చంద్రయ్య, పృథ్వి నాదం, ఎర్ర కురుమయ్య ఎర్రజెండాలను ఆవిష్కరించగా స్నేహ ఫుట్పాత్ సెంటర్, జిల్లా ఆస్పత్రి, మెడికల్ కాలేజ్ వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శాంతన్న, శ్రీను ఏఐటీయూసీ అరుణ పతాకాలను ఆవిష్కరించారు. 18 గంటల పరిధినాన్ని తగ్గించాలని, కనీస వేతనం ఇవ్వాలని అమెరికా చికాగో నగరంలో లక్షలాది మంది కార్మికులు ఉద్యమించారన్నారు. పాలకులు జరిపిన కాల్పుల్లో చాలామంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారన్నారు. అందులో ఒక కార్మికుడు తన శరీరం నుంచి కారుతున్న రక్తంలో తన అంగీని తడిపి ఎగరవేశారని అదే నేడు ఎర్రజెండాగా ప్రపంచ కార్మికులకు కష్టజీవులకు అండగా ఉండి పోరాడు పొందన్నారు. అమరుల పోరాట ఫలితంగా ఎనిమిది గంటల పని దినం ప్రపంచవ్యాప్తంగా అమలవుతుండగా భారత దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలను లేబర్ కోడలుగా మార్చి పని దినం 12 గంటలకు పెంచటం దుర్మార్గమన్నారు. కార్మికుల శ్రమను సంపన్నులకు దోచి పెట్టేందుకే నరేంద్ర మోడీ 12 గంటల పని దినం చేశారని వ్యతిరేకంగా పోరాడాలి అన్నారు. స్వాతంత్ర కాలం నుంచి సాధించుకున్న 44 చట్టాలను నాలుగు లేబర్ కోడలుగా విభజించి వేతనం కోసం పోరాడే హక్కు, సంగం పెట్టుకునే హక్కు లేకుండా చేసిన నరేంద్ర మోడీ దుర్మార్గం ప్రభుత్వానికి కార్మికుల ఐక్యమై బుద్ధి చెప్పాలన్నారు. కార్మికులు సంఘటితంగా పోరాడితేనే వారి హక్కులు దక్కుతాయి అన్నారు. సిపిఐ, ఏఐటీయూసీ ఎర్రజెండాల కింద ప్రజలు కార్మికులు ఏకమై పోరాడాలని కోరారు. సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి రమేష్, సీనియర్ నేత కళావతమ్మ,సిపిఐ, ఏఐటీయూసీ, ఎన్ఎఫ్ఐ డబ్ల్యు, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, డిహెచ్పిఎస్ నేతలు చంద్రయ్య పృథ్వి నాదం గోపాలకృష్ణ ఎర్రకుర్మయ్య శేఖర్ మహేష్ వెంకటయ్య విష్ణు అశోక్ లక్ష్మీనారాయణ రాంబాబు శిరీష జ్యోతి సాయి లీల వంశీ రూప నరేష్ స్వామి శ్రీను నరసింహ శాంతయ్య నరేందర్ లక్ష్మి రాజేష్ శ్రీకాంత్ జలాల్ తదితరులు పాల్గొన్నారు.

చికాగో అమరుల త్యాగాలను పరిహాసం చేస్తున్న కేంద్రం: సిపిఐ Read More »

మన అభివృద్ధి సమాజ సేవకు ఉపయోగపడాలి

వనపర్తి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పానగల్ మండలం గోప్లాపూర్ గ్రామానికి చెందిన మిద్దె సుదర్శన్ హైదరాబాదులోని రాజేంద్ర నగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా అభినందించి సన్మానించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ మన మండలం నుండి హైదరాబాద్ లో వృత్తిరీత్యా స్థిరపడి ఉన్నత స్థానమైన బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎన్నిక కావడం మనకు గర్వకారణం అని అన్నారు. జీవితములో ఉన్నతంగా ఎదిగిన తర్వాత పుట్టిన ఊరికి తల్లిదండ్రులకు మంచి పేరు తెస్తూనే సమాజ సేవకు అంకితం కావాలని కోరారు. న్యాయవాద వృత్తిలో ఉన్నత స్థాయిలో సుదర్శన్ రాణించాలని ఆకాంక్షించారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెంట నందిమల్ల అశోక్ ఉన్నారు.

మన అభివృద్ధి సమాజ సేవకు ఉపయోగపడాలి Read More »

కాంగ్రెస్ సేవాదళ్ సీనియర్ నాయకుడు సీతారాములు గౌడ్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

_వనపర్తి పెద్దమందడి మండలం మణిగిల్ల కాంగ్రెస్ సేవాదల్ సీనియర్ నాయకుడు సీతారాములు గౌడ్ ఇటీవలే గుండెపోటుతో అకాల మరణం చెందారు, ఇట్టి విషయాన్ని మణిగిల్ల కాంగ్రెస్ నాయకుల ద్వారా తెలుసుకున్న ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి శుక్రవారం వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం చేశారు. వారి కుటుంబానికి ఎల్లవేళలా తోడుగా ఉంటానని కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మనిగిళ్ల గ్రామ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ సేవాదళ్ సీనియర్ నాయకుడు సీతారాములు గౌడ్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే Read More »

రెవెన్యూ డివిజన్ స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం

వనపర్తి ప్రజల సమస్యల పరిష్కారానికి మరింత పారదర్శకమైన, బాధ్యతాయుతమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం “ప్రజావాణి” కార్యక్రమాన్ని రెవెన్యూ డివిజన్ స్థాయిలో నిర్వహించాలని నిర్ణయించినట్లు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి నేడొక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి అదనంగా, వెంటనే అమలులోకి వచ్చే విధంగా ప్రతి రెవెన్యూ డివిజన్ స్థాయిలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ మేరకు జిల్లాలోని అన్ని రెవెన్యూ డివిజన్‌ కార్యాలయలలో ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 4వ తేదీ (సోమవారం) నుంచి ప్రారంభించి, నిరంతరంగా నిర్వహించేలా సంబంధిత అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో అందిన పిటిషన్ల సంఖ్యను అదే రోజు ముగింపు నాటికి సేకరించి, ప్రభుత్వం సూచించిన నమూనా ప్రకారం నివేదికగా పంపించాల్సిందిగా తెలిపారు. ఈ ఫార్మాట్ త్వరలో తెలియజేయబడుతుందని చెప్పారు. అలాగే, ఫిర్యాదుల నమోదు, పరిశీలన, పరిష్కార ప్రక్రియను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు సీజీజీ (CGG) ద్వారా వెబ్ ఆధారిత అప్లికేషన్ అభివృద్ధి చేయబడుతున్నదని కలెక్టర్ పేర్కొన్నారు.జిల్లాలోని ప్రజలు ఆర్ డి వో కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని తమ సమస్యలను తెలియజేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి కోరారు.

రెవెన్యూ డివిజన్ స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం Read More »

నూతన మహేంద్ర ట్రాక్టర్ ప్రారంభోత్సవానికి హాజరైన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

వనపర్తి వనపర్తి పట్టణంలో ఏదుల మండలం మాసుపల్లి గ్రామనికి చెందిన మహేంద్ర ట్రాక్టర్ ఓనర్స్ రాములు రమేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన మహేంద్ర ట్రాక్టర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ట్రాక్టర్ యజమానిని శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వ్యాపారం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ధర్మారెడ్డి, పురుషోత్తం, చారి, బుద్ధయ్య, నరసింహ, ఏదుల పార్టీ అధ్యక్షులు అబ్దుల్లా,,బాల్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

నూతన మహేంద్ర ట్రాక్టర్ ప్రారంభోత్సవానికి హాజరైన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి Read More »

ప్రభుత్వ ఉద్యోగులందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలి

వనపర్తి వనపర్తి ప్రభుత్వ పాఠశాలలో మొదటి సంవత్సరం మార్కులు తెచ్చుకున్న జీవన్ సాయి 536 మార్కులు, గురు రాఘవేంద్ర 519 మార్కులు తెచ్చుకున్న విద్యార్థులను బుద్ధారం ప్రభుత్వ పాఠశాలలో మొదటి మార్కులు తెచ్చుకున్న భారతి 518 మార్కులతో , పోల్కపాడులో ప్రభుత్వ పాఠశాలలో మొదటి స్థానం సంపాదించిన విద్యార్థిని మౌనిక లను అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ ఘనంగా సన్మానించారు. పోల్కపాడు సర్పంచ్ బంగారయ్య, 22 వార్డు కౌన్సిలర్ భర్త శ్రీనివాసులు, బీఎస్పీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి మై బూస్, టిడిపి నాయకులు కొత్తగొల్ల శంకర్, సుంద రామస్వామి, ఖాజా WNP ZPHS B ఉపాధ్యాయులు గోపాలకృష్ణ, రవీందర్ గౌడ్, నరేష్,గురు రాజు యాదవ్, వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సతీష్ యాదవ్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగులు తమ తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లలో కాకుండా ప్రభుత్వ స్కూల్లోని చదివించాలని వారిని మిగతావారు కూడా అనుసరిస్తారని ఎందుకంటే ప్రభుత్వ స్కూలల్లో నాణ్యవంతమైన టీచర్లు ఉంటారు… విద్యార్థులు డబ్బులు లేకుండా పాస్ అవుతున్నారు…. ప్రైవేట్ స్కూళ్లలో లక్షలు పెట్టి అన్యాయం అవుతున్నారు కనుక హైదరాబాదులో చదివించేవారు ఆలోచించి వనపర్తి లోనే చదివించాలని మేము విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వ ఉద్యోగులందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలి Read More »

 ప్రతి పౌరుడు తన హక్కులతో పాటు బాధ్యతలను కూడా తెలుసుకొని సమాజ అభివృద్ధికి తోడ్పడాలి

వనపర్తి ప్రతి పౌరుడు తన హక్కులతో పాటు బాధ్యతలను కూడా తెలుసుకొని సమాజ అభివృద్ధికి తోడ్పడాలని అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వినోద్ కుమార్ విజ్ఞప్తి చేశారు. గురువారం పెద్దమందడి మండల పరిధిలో పర్యటించిన అదనపు కలెక్టర్, జగత్పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన పౌర హక్కుల దినం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు పౌర హక్కుల ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ కీలక సూచనలు చేశారు. ప్రతి పౌరుడు తన హక్కులతో పాటు బాధ్యతలను కూడా తెలుసుకొని సమాజ అభివృద్ధికి సహకరించాలని పేర్కొన్నారు. అనంతరం ఆయన మణిగిల్ల, చిన్నమందడి, వెళ్టూర్, పెద్దమందడి గ్రామాల్లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రాల్లో ధాన్యం నిర్వహణపై ఆరా తీసి, రిజిస్టర్లు పరిశీలించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా మరియు వేగవంతంగా నిర్వహించాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కేంద్రాల ఇన్‌చార్జ్‌లకు ఆదేశించారు. రైతుల నుంచి ధాన్యం స్వీకరణలో నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందిగా సూచించారు.అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వినోద్ కుమార్ క్షేత్ర స్థాయిలో ఇంధన సరఫరా పరిస్థితులను సమీక్షించారు. ఈ సందర్భంగా కొత్తకోట మరియు వెల్టూరు ప్రాంతాల్లోని పెట్రోల్ బంకులను ఆయన తనిఖీ చేశారు. డి సి ఎస్ ఓ కాశీ విశ్వనాథ్, తహసీల్దార్ పాండు నాయక్, ఎంపీడీవో పరిణత, ఇతర అధికారులు తదితరులు ఉన్నారు.

 ప్రతి పౌరుడు తన హక్కులతో పాటు బాధ్యతలను కూడా తెలుసుకొని సమాజ అభివృద్ధికి తోడ్పడాలి Read More »

వివాహానికి హాజరై నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

పెబ్బేరు పెబ్బేరు పట్టణంలో పుల్లారెడ్డి రాంరెడ్డి ఫంక్షన్ హాల్ లో జరిగిన మహేష్ & రాజేశ్వరి ల వివాహ కార్యక్రమానికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరై నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. పెబ్బేరు పట్టణంలోని సహారాఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన రంజిత్ & మనోజ్ఞ ల వివాహ కార్యక్రమానికి మాజీ మంత్రి హాజరై నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వెంట మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

వివాహానికి హాజరై నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి Read More »

గృహ ప్రవేశం కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

వనపర్తి వనపర్తి పట్టణం 2వ వార్డుకు చెందిన హౌదికారి రాజన్న గారి ఆహ్వానం మేరకు నూతనంగా నిర్మించిన గృహ ప్రవేశం కార్యక్రమం ఘనంగా నిర్వహించగా, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొని గృహ యజమానులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబం సుఖశాంతులతో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వెంట పట్టణ పార్టీ అధ్యక్షులు పలస రమేష్ గౌడ్, జిల్లా మీడియా సెల్ అధ్యక్షులు నందిమల్ల అశోక్, ప్రేమ్ నాథ్ రెడ్డి కౌన్సిలర్స్ పలస శ్రీకర్ గౌడ్, మాజీ కోఆప్షన్ ఇమ్రాన్, ప్రభాకర్,నాయకులు తదితరులు పాల్గొన్నారు

గృహ ప్రవేశం కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి Read More »

Scroll to Top