వనపర్తి
వనపర్తి పట్టణంలో ఏదుల మండలం మాసుపల్లి గ్రామనికి చెందిన మహేంద్ర ట్రాక్టర్ ఓనర్స్ రాములు రమేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన మహేంద్ర ట్రాక్టర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ట్రాక్టర్ యజమానిని శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వ్యాపారం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ధర్మారెడ్డి, పురుషోత్తం, చారి, బుద్ధయ్య, నరసింహ, ఏదుల పార్టీ అధ్యక్షులు అబ్దుల్లా,,బాల్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
