అమెరికా సామ్రాజ్యవాదంతో మానవ మనుగడకు ముప్పు వనపర్తి అమెరికా సామ్రాజ్యవాదంతో ప్రపంచ మానవ మనుగడకే ముప్పని శాంతికాముకులు ఐక్యంగా ప్రతిఘటించి పోరాడాలని ఐప్సో, పార్టీలు, ప్రజా సంఘాల నేతలు పిలుపునిచ్చారు. వనపర్తి లో అఖిలభారత శాంతి సంఘీభావ సంఘం (ఏఐపిఎస్ఓ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌక్ నుంచి రాజీవ్ చౌక్ వరకు శాంతి ర్యాలీ నిర్వహించారు. యుద్ధం వద్దు- శాంతి ముద్దు, ప్రపంచ శాంతి వర్ధిల్లాలి, అమెరికా సామ్రాజ్యవాదం నశించాలి అంటూ నేతలు ప్రజలు విద్యార్థులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. జిల్లా ఐఫ్సో ప్రధాన సమన్వయ కార్యదర్శి యత్తం శివ అధ్యక్షతన సభ నిర్వహించారు.ఎత్తం శివ, రమేష్, జలజ్వాల రాధాకృష్ణ,వనగంటి నాగేశ్వర్, భరత్, సీఎన్ శెట్టి పలుస శంకర్ గౌడ్,గంధంనాగరాజు, గణేష్, ఖాదర్ బాషా తదితరులు మాట్లాడుతూ.. అమెరికా సామ్రాజ్యవాద కాంక్షతో పొరుగు దేశాలను ఆక్రమించి, దేశ నాయకత్వాన్ని అంతం చేసి భూగర్భ సంపదను నిక్షేపాలను స్వాధీనం చేసుకుంటుందన్నారు. వెనుజుల అధ్యక్షుడు మధురొ దంపతుల అక్రమ నిర్బంధం, ఇరాన్ అయతుల్లా ఖుమేని హతం ఇందులో భాగవేనన్నారు. అమెరికాతో సాంగత్యం ఉన్న అన్ని దేశాలు అమెరికా ఇజ్రాయిల్- ఇరాన్ యుద్ధం వల్ల నాశనమయ్యాయి అన్నారు. వేలాదిమంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని లక్షలాదిమంది క్షతగాత్రులు అయ్యారన్నారు. చాలా దేశాలతో పాటు భారతదేశంలో విపరీతంగా నిత్యవసర వస్తువుల ధరలు పెరిగాయి అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ చేతకానితనం కూడా దీనికి కారణం అన్నారు. యుద్ధాలను ఆపితేనే మానవ మనుగడ అభివృద్ధి సాధ్యమని ఆ దిశగా ప్రపంచ దేశాలు సంఘటితమై అమెరికా ఆట కట్టించాలన్నారు. రక్త పిపాసి అమెరికా సామ్రాజ్యవాదాన్ని పొదుముట్టించేందుకు శాంతికాముక దేశాలన్నీ ఏకం కావాలని కోరారు. అందుకు భారతదేశం ముందు వరుసలో నిలవాలన్నారు. నేతలు కళావతమ్మ, గట్టు యాదవ్,గోపాలకృష్ణ, జయమ్మ, లింగన్న, మధు,ఖాదర్పాష, వెంకటమ్మ, పరంజ్యోతి, వంశీ, అరవిందు, శిరీష, అరుణ జ్యోతి కాలేజ్ డి.ఎం.ఎల్.టి కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.
