కల్వరాల గ్రామానికి చెందిన సర్దార్ మియాని పరామర్శించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
వనపర్తి
కల్వరాల గ్రామానికి చెందిన సర్దార్ మియా గారు ఇటీవల నిమ్స్ హాస్పటల్ లో సర్జరీ చేయించుకున్న విషయం తెలుసుకున్న మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పెబ్బేరు పట్టణంలో వారి స్వగృహానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా సర్దార్ మియా గారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్య సేవలు తీసుకోవాలని సూచించారు. వారు త్వరగా పూర్తిగా కోలుకుని ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కర్రెస్వామి విశ్వరూపం రాజశేఖర్ సాయినాధ్ ఎల్లారెడ్డి వడ్డె రమేష్ సాయిరెడ్డి సంబురాము వేణు మూర్తి అఖిల్ వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
