కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు
వనపర్తి
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ భారతదేశ యువతకు ఆదర్శమని, ఆయన స్ఫూర్తితో యువత ముందుకెళ్లాలని వనపర్తి డిసిసి చీఫ్, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేన రెడ్డి అన్నారు. శుక్రవారం రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో వనపర్తి డిసిసి చీఫ్ శివసేన రెడ్డి అధ్యక్షతన ఘనంగా వేడుకలు జరిగాయి. కాంగ్రెస్ శ్రేణుల మధ్య రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని కేకు కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ ప్రజల సంక్షేమం సామాజిక న్యాయం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. దేశ ప్రజల సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రజా సమస్యల పరిరక్షణకు సంబంధించిన పోరాటం యువతకు స్ఫూర్తినిచ్చి ప్రేరణగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజా శ్రేయస్సు కోసం మరింత కృషి చేస్తున్న నాయకుడు భావితరాల భవిష్యత్తు, భావి భారత ప్రధాని రాహుల్ గాంధీనాన్ని నాయకుల ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో రోగులకు వారి సహాయకులకు, అభాగ్యులకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ డెలిగేట్ తైలం శంకర్ ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు తిరుపతయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి బ్రహ్మచారి, మున్సిపల్ చైర్పర్సన్ మాధవి, వైస్ చైర్మన్ మధుసూదన్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కదిరే రాములు, అధికార ప్రతినిధులు కోళ్ల వెంకటేష్, శరవంద, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సహదేవ్, బి. కృష్ణ, చీర్ల జనార్ధన్ సాగర్, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




